నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన జాతీయ విద్యావిధానాన్ని వెనక్కి తీసుకోవాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్యులు లక్ష్మీనారాయణ కోరారు.
హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం ఆచార్య లక్ష్మీనారాయణ
‘రగిలే జ్ఞాపకం’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న గొర్రెపాటి మాధవరావు, ఇఫ్టూ నేత ప్రదీప్, వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ తదితరులు
నిజామాబాద్ విద్యావిభాగం, న్యూస్టుడే: కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన జాతీయ విద్యావిధానాన్ని వెనక్కి తీసుకోవాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్యులు లక్ష్మీనారాయణ కోరారు. నిజామాబాద్ నగరంలో మూడు రోజులుగా కొనసాగిన పీడీఎస్యూ రాష్ట్ర మహాసభలు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తోందని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. విద్యారంగానికి బడ్జెట్ పెంచాలని, ఖాళీలు భర్తీ చేయాలన్నారు. అరుణోదయ సాం స్కృతిక సమాఖ్య రాష్ట్ర నాయకుడు ఉదయగిరి రాసిన ‘ఎగిసేటి యువ తరంగాలై’ పాట సీడీతో పాటు ‘రగిలే జ్ఞాపకం’ అనే పుస్తకాన్ని గొర్రెపాటి మాధవరావు, ఇఫ్టూ నేత ప్రదీప్, వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్, నాగన్న, పాపయ్య, పరుచూరి శ్రీధర్, సాయిబాబా ఆవిష్కరించారు. పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి మహేష్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటర్లో అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ 27వ స్థానంలో, ద్వితీయంలో 29వ స్థానంలో నిలిచింది. -
సమాయత్తం.. ఓట్లపైనే చిత్తం
[ 25-04-2024]
లోక్సభ నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ నామ పత్రాలు దాఖలు చేశారు. -
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. -
ఫిర్యాదులపై పెరిగిన చైతన్యం
[ 25-04-2024]
ఎన్నికల నియమాలు, ఉల్లంఘనలపై పౌరుల్లో చైతన్యం పెరిగింది. ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల్ కమిషన్ 1950 కాల్సెంటర్, సీ-విజిల్ యాప్ను రూపొందించిన విషయం తెలిసిందే -
రాష్ట్రంలో చివరి స్థానం
[ 25-04-2024]
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫలితాలు నిరాశపరిచాయి. తొలిసారిగా రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. 35వ స్థానంలో నిలిచింది. -
ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం
[ 25-04-2024]
ఎల్లారెడ్డి బల్దియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. -
కళాశాలల తనిఖీలకు వేళాయె
[ 25-04-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 2024-25 నూతన విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ కోసం ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల తనిఖీలు గురువారం నుంచి చేపట్టనున్నారు. -
కోడ్ ముగిశాకే.. సవరణకు అవకాశం
[ 25-04-2024]
ఎన్నికల కోడ్ రాకముందే ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. -
అదరగొట్టారు..
[ 25-04-2024]
కుటుంబ నేపథ్యం ఏదైనా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని అహర్నిశలు కష్టపడ్డారు. నిపుణుల వద్ద సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రణాళికబద్ధంగా చదివారు. పరీక్షలు రాశారు.