ఐదు నెలలైనా పొత్తాలు ఇవ్వలే!
విద్యాసంవత్సరం ప్రారంభమై ఐదు నెలలవుతున్నా జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో పూర్తి స్థాయిలో పుస్తకాల పంపిణీ జరగలేదు.
బడుల్లో పాఠ్యాంశాల బోధనకు అవరోధాలు
న్యూస్టుడే, కామారెడ్డి పట్టణం
జిల్లాకు వచ్చిన పుస్తకాలను నిల్వ చేస్తున్న సిబ్బంది
విద్యాసంవత్సరం ప్రారంభమై ఐదు నెలలవుతున్నా జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో పూర్తి స్థాయిలో పుస్తకాల పంపిణీ జరగలేదు. ఈసారి ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం, అధిక సంఖ్యలో ముద్రించాల్సి ఉండటంతో ఆలస్యం అవుతోంది. ఫలితంగా బోధనకు అవరోధాలు తప్పడం లేదు.
జూన్లో బడులు ప్రారంభం కాగా జులైలో ఎఫ్ఏ-1 పరీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న అరకొర పుస్తకాలనే విద్యార్థులకు పంపిణీ చేశారు. అందనివారు గత విద్యా సంవత్సరం వారివి తీసుకుని చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అక్టోబరు, నవంబరులో 50 వేల పుస్తకాలు వచ్చినా సరిపోలేదు. ఏడో తరగతిలో సామాన్య, 8లో జీవశాస్త్రం, 9 లో ఆంగ్లం, 10లో తెలుగు పుస్తకాలు సరిపడా రాలేదు.
పాఠ్యప్రణాళికపై ప్రభావం
నిర్దిష్ట ప్రణాళిక మేరకు బోధన సాగాల్సి ఉన్నా వివిధ కారణాల రీత్యా పాఠ్యాంశాలు పూర్తిగా చెప్పలేదు. ఆగస్టులో పక్షం రోజుల పాటు వజ్రోత్సవాలు, దసరాకు 15 రోజులు, అధిక వర్షాల కారణంగా ఏడు రోజులు సెలవులు వచ్చాయి. పదో తరగతి విద్యార్థులకు బడులు ప్రారంభమై ఐదు మాసాలవుతున్నా పాఠ్యప్రణాళిక 53 శాతమే పూర్తయింది.
సరఫరా ఆధారంగా పంపిణీ
- రాజు, డీఈవో-కామారెడ్డి
జిల్లాకు వచ్చే పుస్తకాల సరఫరా ఆధారంగా విద్యార్థులకు పంపిణీ చేస్తున్నాం. అందరికీ సమకూరేలా చర్యలు చేపడతాం. తరగతుల్లో వెనుకబడిన పిల్లలను గుర్తించి మొదట వారికి ఇవ్వాలని ప్రధానోపాధ్యాయులకు సూచించాం. ఈ నెలలో శతశాతం పంపిణీ పూర్తవుతుందని భావిస్తున్నాం.
బడులు 1,011
కావాల్సిన పుస్తకాలు (లక్షల్లో) 8.60
వచ్చింది (లక్షల్లో) 7.20
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుస్తకంతో దోస్తీ చేద్దామా..?
[ 20-04-2024]
వేసవి సెలవుల్లో పిల్లల అల్లరి నియంత్రించేందుకు తల్లిదండ్రులు చేసేది.. సెల్ఫోన్ ఇచ్చి ఒక చోట పరిమితం చేయడం. కానీ దాంతో కంటి చూపు మందగించడం, మానసిక సమస్యల వంటి దుష్పరిణామాలను గ్రహించలేకపోతున్నారు. -
‘నగరాభివృద్ధిపై భారాస ప్రభుత్వం వివక్ష’
[ 20-04-2024]
భారాస ప్రభుత్వ హయాంలో నగరాభివృద్ధిపై పూర్తి వివక్ష చూపారని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
రెండో రోజు.. ఆరుగురు
[ 20-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ఆరు నామపత్రాలు దాఖలయ్యాయి. ఇందులో ప్రధాన పార్టీలైన భారాస, భాజపా అభ్యర్థులున్నారు. -
ప్రజలు మళ్లీ మోసపోవద్దు
[ 20-04-2024]
భాజపా అభ్యర్థి అర్వింద్ రాముడి పేరుతో రాజకీయం తప్ప.. ప్రజలకు చేసింది ఏమీ లేదని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
బడుల బలోపేతానికి కృషి
[ 20-04-2024]
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ‘మన ఊరు మన బడి కింద’ ఎంపికైంది. ఇక్కడ వంట గదులు సక్రమంగా లేవు. ఏళ్ల నాటి గదుల్లోనే వంట చేస్తున్నారు -
హలో పురపాలిక
[ 20-04-2024]
‘హలో మేము పాత బాన్సువాడ నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ పైపులైను పగిలి నీటి సమస్యగా మారింది. దీన్ని త్వరగా పరిష్కరించేలా చొరవ తీసుకోండి -
సమస్యలు అటుంచి.. విధానాలే ముందుంచి
[ 20-04-2024]
శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే లోక్సభ స్థానం పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచార బాధ్యతలను ముఖ్య కార్యకర్తలకే అప్పగిస్తున్నారు. -
వడగళ్ల వాన.. వణికిన రైతన్న
[ 20-04-2024]
వడగళ్ల వాన జిల్లాను మరోసారి వణికించింది. శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో వాన కురిసింది -
ప్రమాదాల కాలం.. అప్రమత్తతతోనే పదిలం
[ 20-04-2024]
ఎండలు మండుతుండడంతో ఏప్రిల్, మే నెలల్లో అగ్నిప్రమాదాలకు ఆస్కారముంది. నాలుగు నెలల కిందట కామారెడ్డి జిల్లాకేంద్రంలోని అయ్యప్ప షాపింగ్ మాల్లో సంభవించిన అగ్నిప్రమాదంలో రెండు రోజులకు గానీ మంటలు అదుపులోకి రాలేదు -
ఈ- కేవైసీకి మరో అవకాశం
[ 20-04-2024]
రేషన్ కార్డుకు ఈ కేవైసీ చేయించుకునేందుకు అధికారులు మళ్లీ అవకాశం కల్పించారు. గతంలో మూడు సార్లు గడువు పొడిగించినప్పటికీ ఉమ్మడి జిల్లాలో ఇంకా 19 శాతం మంది ప్రక్రియ పూర్తిచేసుకోలేదు. -
ముందస్తు పన్ను రాయితీపై ఆసక్తి
[ 20-04-2024]
ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్నుల వసూలులో ఆర్మూర్ బల్దియా ముందంజలో ఉంది. ఈనెల 1 నుంచి 30 వరకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన పన్ను రుసుముపై 5 శాతం రాయితీ ఇస్తున్న విషయం తెలిసిందే. -
గొలుసుకట్టు చెరువులు నిండేదెట్లా?
[ 20-04-2024]
వృథా నీటిని చెరువుల్లోకి మళ్లించేందుకు నీటిపారుదల శాఖ యంత్రాంగం చేపట్టిన లక్ష్యం నిధుల కొరతతో ఆచరణకు నోచుకోవడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం