సారూ.. ఎంత సేపో చెప్పరా!
యాసంగి సాగు విద్యుత్తు సరఫరా వేళలు ఇంకా ఖరారు కాలేదు. ప్రభుత్వం రైతులకు 24 గంటల పాటు అందిస్తున్నట్లు చెబుతున్నా.. ఆరునెలలుగా కేవలం 12 గంటలే ఇస్తున్నారు. రాత్రివేళలో నిలిపివేస్తున్నారు.
ఇంకా ఖరారు కాని యాసంగి విద్యుత్తు సరఫరా వేళలు
ప్రస్తుతం 12 గంటలే
న్యూస్టుడే, కామారెడ్డి కలెక్టరేట్
యాసంగి సాగు విద్యుత్తు సరఫరా వేళలు ఇంకా ఖరారు కాలేదు. ప్రభుత్వం రైతులకు 24 గంటల పాటు అందిస్తున్నట్లు చెబుతున్నా.. ఆరునెలలుగా కేవలం 12 గంటలే ఇస్తున్నారు. రాత్రివేళలో నిలిపివేస్తున్నారు. ఉదయం పూట అప్పుడప్పుడు గంట నుంచి గంటన్నర పాటు కోతలు విధిస్తున్నారు. వానాకాలం సాగులో పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు. ప్రస్తుతం రైతులందరూ యాసంగిపై దృష్టి సారించారు. ఉభయ జిల్లాల్లో నారుమళ్లు తయారు చేసుకుంటున్నారు. జనవరి మొదటి, రెండో వారం నుంచి నాట్లు వేయనున్నారు. ఈ పరిస్థితుల్లో పూర్తి సమయంలో విద్యుత్తు సరఫరా లేకుంటే సాగు ప్రశ్నార్థకం కానుంది.
ఇదీ పరిస్థితి.. ఉభయ జిల్లాల్లో చాలా వరకు బోరుబావుల ఆధారిత వ్యవసాయమే ఉంది. భూగర్భజలాలు సమృద్ధిగా ఉండటంతో రైతులు యాసంగిలో వరినే ఎంచుకుంటున్నారు. గతేడాది ధాన్యం సేకరించబోమని సర్కారు తెగేసి చెప్పినా.. చాలా మంది అదే పంట వేశారు. ఈసారి వానాకాలం సీజన్కు కొంచెం అటుఇటుగా నారుమళ్లు సిద్ధం చేస్తున్నారు.
నీటి అవసరం అధికం.. వరికి నీటి అవసరం ఎక్కువ. జనవరిలో నాట్లు వేసుకుంటే ఏప్రిల్-మే మధ్యకాలంలో దిగుబడి చేతికొస్తుంది. మార్చిలో వేసవి ఎండలు పెరగనున్నందున రెండు నెలల పాటు నీరు ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇస్తున్నట్లు విద్యుత్తు సరఫరా ఉంటే సాగుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని కర్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్తు కనెక్షన్ల వివరాలు..
కామారెడ్డి 1.05 లక్షలు
బోరు బావులు నిజామాబాద్ 1.60 లక్షలు
ఉత్తర్వులు రాలేదు
రమేశ్బాబు, ఎస్ఈ, విద్యుత్తుశాఖ, కామారెడ్డి
ప్రభుత్వం ఆదేశానుసారం యాసంగి సాగుకు విద్యుత్తు సరఫరా చేస్తాం. ఎన్ని గంటల పాటు అనేదానిపై ఇంకా ఉత్తర్వులు రాలేదు. ఇప్పటికైతే 13 గంటలు ఇస్తున్నాం. ప్రభుత్వం 24 గంటల పాటు ఇవ్వమంటే అందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం కోతలు పూర్తికావడంతో లోడ్ భారం తగ్గింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్ధమవుతున్నారు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో బరిలో నిలిచే అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. -
‘వ్యాపార కాంక్షతోనే బీబీపాటిల్ పోటీ’
[ 19-04-2024]
తన వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకే బీబీపాటిల్ ఎంపీగా పోటీచేస్తున్నారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు విమర్శించారు. -
ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ
[ 19-04-2024]
రైతులకు ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ పేర్కొన్నారు. -
లక్ష్యం అధిగమించి.. ఆర్థికంగా ఎదిగి
[ 19-04-2024]
మహిళా సంఘాలకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తోంది. ఈ అవకాశాన్ని చాలా మంది మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. -
ఇక ప్రచార హోరు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఇక హోరెత్తనుంది. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరు పెంచేందుకు సిద్ధమయ్యారు. -
బీఫాం అందుకున్న బాజిరెడ్డి
[ 19-04-2024]
నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు అధినేత కేసీఆర్ హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం బీఫాం అందజేశారు. -
రూ.52.71 లక్షల నగదు.. 16,547 లీటర్ల మద్యం పట్టివేత
[ 19-04-2024]
సాధారణ ఎన్నికల షెడ్యూల్ మార్చి 16న విడుదలైంది. ఆ రోజు నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. -
ఇద్దరు సీఐలపై వేటు
[ 19-04-2024]
కమిషనరేట్ పరిధిలో ఇద్దరు సీఐలపై గురువారం సస్పెన్షన్ వేటు పడింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ను తప్పించేందుకు పంజాగుట్ట సీఐని సంప్రదించినట్లు విచారణలో తేలడంతో అప్పటి బోధన్ సీఐ ప్రేమ్కుమార్ సస్పెండ్ చేశారు. -
హైకోర్టును ఆశ్రయించిన సాహిల్
[ 19-04-2024]
హైదరాబాద్ పంజాగుట్ట వద్ద బారీకేడ్లను ఢీకొట్టిన రోడ్డు ప్రమాద ఘటనలో నిందితుడిగా చేర్చడాన్ని సవాలు చేస్తూ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ అలియాస్ రాహిల్ హైకోర్టును ఆశ్రయించారు. -
అరచేతిలో ఎన్నికల సమాచారం
[ 19-04-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎక్కడైనా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, డబ్బుల పంపిణీ చేస్తే ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా? -
‘పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి’
[ 19-04-2024]
నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉందని’ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబుకు విజ్ఞప్తి చేశారు. -
హ్యాట్రిక్ వీరులు ఇద్దరు
[ 19-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరు వ్యక్తులు వరుసగా మూడు సార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 1952లో హరీశ్ చంద్ర హెడా కాంగ్రెస్ తరఫున విజయం సాధించి మొదటి సారి లోక్సభ సభ్యుడిగా అడుగు పెట్టారు. -
విద్యార్థులు.. సైబర్ రక్షకులు
[ 19-04-2024]
పెరిగిన సాంకేతికత, చరవాణులు అందరికీ చేరువై అన్ని రంగాల్లో సేవలు సులభమయ్యాయి. కానీ అదే సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగత డేటా, ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి సైబర్ మోసగాళ్లు డబ్బులు అపహరిస్తున్నారు. -
ఆకాశవాణి మీకోసం..
[ 19-04-2024]
పిల్లలూ.. మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు మొదలుకానున్నాయి.. ఇంటి వద్దే ఉంటూ చరవాణిలో వీడియో గేమ్స్ ఆడుకుంటూ సమయాన్ని వృథా చేయకండి. -
ద్విచక్రవాహనాల దొంగ అరెస్టు
[ 19-04-2024]
ట్రాక్టర్ నడుపుకొంటూ జీవనం సాగించే వ్యక్తి అక్రమంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో ద్విచక్ర వాహనాలను దొంగతనాలు చేసి తనిఖీల్లో ఒకటో ఠాణా పోలీసులకు దొరికిపోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి డాక్టర్ లక్ష్మి