సెల్ టవర్పై ఉరేసుకొని రైతు ఆత్మహత్య
తన పొలం గుండా కాలువ నీటిని తీసుకెళ్తే నష్టం జరుగుతుందని మానసిక వేదనతో సెల్ టవర్ ఎక్కి ఉరేసుకొని రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మెంగారం గ్రామంలో చోటుచేసుకుంది.
అందరు చూస్తుండగానే అఘాయిత్యం
నాలుగు గంటల పాటు ఉత్కంఠ
ఆంజనేయులు
ఈనాడు డిజిటల్, కామారెడ్డి, లింగంపేట, న్యూస్టుడే: తన పొలం గుండా కాలువ నీటిని తీసుకెళ్తే నష్టం జరుగుతుందని మానసిక వేదనతో సెల్ టవర్ ఎక్కి ఉరేసుకొని రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మెంగారం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. పుట్ట ఆంజనేయులు(38)కు ఊరచెరువు కింద అరగుంట భూమి ఉంది. యాసంగిలో పంటలు వేయడానికి రైతులు, రెవెన్యూ అధికారులు రెండు రోజుల క్రితం తైబందీ చేశారు. పంట కాల్వల పూడిక తీసేందుకు రైతులు సన్నద్ధమయ్యారు. కాల్వ తవ్వితే భూమిలో పంట పండకుండా పోతుందని మనోవేదకు గురైన ఆంజనేయులు సోమవారం మధ్యాహ్నం సెల్ టవర్ ఎక్కారు. మద్యం మత్తులో ఉన్న ఆయన నష్టపరిహారం అందించాలని, ఘటనా స్థలానికి డీఎస్పీ రావాలని చరవాణిలో తహసీల్దారు మారుతి, ఎస్సై శంకర్ను కోరారు. స్పందించిన అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. ఇక్కడికి ఆర్డీవో శ్రీనునాయక్, డీఎస్పీ శ్రీనివాసులు చేరుకునేలోపే రైతు తన మెడలోని టవల్తో టవర్కు ఉరేసుకొని బలవన్మరణం పొందారు. ఆయన గతంలోనూ సెల్ టవర్ ఎక్కి, గడ్డిమందు తాగి బెదిరింపులకు పాల్పడ్డారు. ఇప్పుడూ అలాగే చేస్తాడేమోనని గ్రామస్థులు, అధికారులు తేలికగా తీసుకున్నారు. ‘కిందికి దిగిరా నాన్నా’ అని ఆయన ముగ్గురు పిల్లలు భయంతో అరిచినా.. భార్య కన్నీరుమున్నీరుగా విలపించినా ఆయన పట్టించుకోలేదు. నాలుగు గంటల పాటు ఉత్కంఠ కొనసాగింది. ఆత్మహత్యకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ట్వీట్ చేశారు.
రోదిస్తున్న పిల్లలు
మూడు సార్లు : తన పంట పొలం గుండా నీటి కాల్వ వెళ్లడానికి వీల్లేదని రెండేళ్ల క్రితం సెల్టవర్ ఎక్కి హంగామా సృష్టించారు. అప్పటి తహసీల్దార్ అమీన్సింగ్, ఎస్సై శ్రీకాంత్ నచ్చజెప్పి కిందకు దింపి రూ. 2 వేలు అందించారు. మరోసారి విద్యుత్తు తీగలు పట్టుకుంటానని వెళ్లాడని, ఇంకోసారి పురుగుల మందు తాగినట్లు గ్రామస్థులు తెలిపారు.
అప్పుడు అన్న.. ఇప్పుడు తమ్ముడు: మెంగారం వాసి పుట్ట కాశీరాంకు ముగ్గురు కొడుకులు. చిన్నవాడు ఆంజనేయులు. రెండో కొడుకు రాజుకు మతిస్థిమితం సరిగా లేక అనారోగ్యంతో మృతి చెందారు. ఇప్పుడు తమ్ముడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం.. ఆంజనేయులు కుటుంబాన్ని ఆదుకుంటామని ఎమ్మెల్యే సురేందర్ అన్నారు. ఆయన పిల్లలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని గ్రామస్థులతో చరవాణిలో మాట్లాడారు.
దిగి రమ్మన్నా కరుణించకపోతివి
అడ్డంకులను ఎదురించడం నేర్పాల్సిన నీవు చిన్నపాటి సమస్యకు ఆగమైపోతివి.. అర గుంట భూమి కోసం వందేళ్ల జీవితం పణంగా పెడ్తివి.. నీ ప్రాణాలు తీసుకుని మా బతుకులు ఆగం చేస్తివి.. నీ చేయి పట్టుకుని నడవాలనుకున్న మా ఆశలు అడియాసలు చేస్తివి..
కళ్లెదుటే ప్రాణం పోతున్నా..
మధ్యాహ్నం ఒంటి గంటకు రైతు సెల్టవర్ ఎక్కారు. ఎస్సై శంకర్, తహసీల్దార్ మారుతి అక్కడికి చేరుకొని ఆంజనేయులుతో చరవాణిలో మాట్లాడారు. గతంలో పనిచేసిన తహసీల్దారు అమీన్సింగ్, డీఎస్పీ, ఎస్పీ రావాలని పట్టుబట్టారు. అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకుండా చరవాణిని కిందకు పడేశారు. అందరూ చూస్తుండగానే రైతు ఉరేసుకున్నారు. ప్రాణాలు విడిచి రెండు గంటలైనా ఎవరూ టవర్ ఎక్కలేదు. చివరికి సర్పంచి మహేశ్, ఓ రైతు, ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది సహకారంతో మృతదేహాన్ని కిందకు దించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 19-04-2024]
తాండూరు గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి కూలీల వద్దకు వెళ్లి 6 గ్యారంటీలు, రుణమాఫీ గురించి స్థానిక కాంగ్రెస్ నాయకులు వివరించారు. -
పోరు.. ఇక జోరు
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
సిద్ధమవుతున్నారు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో బరిలో నిలిచే అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. -
‘వ్యాపార కాంక్షతోనే బీబీపాటిల్ పోటీ’
[ 19-04-2024]
తన వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకే బీబీపాటిల్ ఎంపీగా పోటీచేస్తున్నారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు విమర్శించారు. -
ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ
[ 19-04-2024]
రైతులకు ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ పేర్కొన్నారు. -
లక్ష్యం అధిగమించి.. ఆర్థికంగా ఎదిగి
[ 19-04-2024]
మహిళా సంఘాలకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తోంది. ఈ అవకాశాన్ని చాలా మంది మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. -
ఇక ప్రచార హోరు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఇక హోరెత్తనుంది. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరు పెంచేందుకు సిద్ధమయ్యారు. -
బీఫాం అందుకున్న బాజిరెడ్డి
[ 19-04-2024]
నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు అధినేత కేసీఆర్ హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం బీఫాం అందజేశారు. -
రూ.52.71 లక్షల నగదు.. 16,547 లీటర్ల మద్యం పట్టివేత
[ 19-04-2024]
సాధారణ ఎన్నికల షెడ్యూల్ మార్చి 16న విడుదలైంది. ఆ రోజు నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. -
ఇద్దరు సీఐలపై వేటు
[ 19-04-2024]
కమిషనరేట్ పరిధిలో ఇద్దరు సీఐలపై గురువారం సస్పెన్షన్ వేటు పడింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ను తప్పించేందుకు పంజాగుట్ట సీఐని సంప్రదించినట్లు విచారణలో తేలడంతో అప్పటి బోధన్ సీఐ ప్రేమ్కుమార్ సస్పెండ్ చేశారు. -
హైకోర్టును ఆశ్రయించిన సాహిల్
[ 19-04-2024]
హైదరాబాద్ పంజాగుట్ట వద్ద బారీకేడ్లను ఢీకొట్టిన రోడ్డు ప్రమాద ఘటనలో నిందితుడిగా చేర్చడాన్ని సవాలు చేస్తూ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ అలియాస్ రాహిల్ హైకోర్టును ఆశ్రయించారు. -
అరచేతిలో ఎన్నికల సమాచారం
[ 19-04-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎక్కడైనా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, డబ్బుల పంపిణీ చేస్తే ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా? -
‘పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి’
[ 19-04-2024]
నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉందని’ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబుకు విజ్ఞప్తి చేశారు. -
హ్యాట్రిక్ వీరులు ఇద్దరు
[ 19-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరు వ్యక్తులు వరుసగా మూడు సార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 1952లో హరీశ్ చంద్ర హెడా కాంగ్రెస్ తరఫున విజయం సాధించి మొదటి సారి లోక్సభ సభ్యుడిగా అడుగు పెట్టారు. -
విద్యార్థులు.. సైబర్ రక్షకులు
[ 19-04-2024]
పెరిగిన సాంకేతికత, చరవాణులు అందరికీ చేరువై అన్ని రంగాల్లో సేవలు సులభమయ్యాయి. కానీ అదే సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగత డేటా, ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి సైబర్ మోసగాళ్లు డబ్బులు అపహరిస్తున్నారు. -
ఆకాశవాణి మీకోసం..
[ 19-04-2024]
పిల్లలూ.. మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు మొదలుకానున్నాయి.. ఇంటి వద్దే ఉంటూ చరవాణిలో వీడియో గేమ్స్ ఆడుకుంటూ సమయాన్ని వృథా చేయకండి. -
ద్విచక్రవాహనాల దొంగ అరెస్టు
[ 19-04-2024]
ట్రాక్టర్ నడుపుకొంటూ జీవనం సాగించే వ్యక్తి అక్రమంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో ద్విచక్ర వాహనాలను దొంగతనాలు చేసి తనిఖీల్లో ఒకటో ఠాణా పోలీసులకు దొరికిపోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
సీఎం జగన్పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి