ఆహార భద్రత అంతంతే
నాసిరకం ఆహార పదార్థాలు ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఉమ్మడి జిల్లాల్లో ఏడు వేలకు పైగా హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, తదితర దుకాణాలు ఉంటే.. ఆహార శాఖ అనుమతులు పొందినవి కేవలం నాలుగు వేలే.
ఉమ్మడి జిల్లాలో 129 నమూనాలే సేకరణ
ఏడాదంతా 15 కేసులే
ఉన్నది ఇద్దరు అధికారులే
నమూనాలు సేకరిస్తున్న అధికారులు
నాసిరకం ఆహార పదార్థాలు ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఉమ్మడి జిల్లాల్లో ఏడు వేలకు పైగా హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, తదితర దుకాణాలు ఉంటే.. ఆహార శాఖ అనుమతులు పొందినవి కేవలం నాలుగు వేలే. అవగాహన లేక కొందరు, రుసుము చెల్లించలేక మరికొందరు అనుమతులకు ఆసక్తి చూపడం లేదు. దీంతో కల్తీ విక్రయం యథేచ్ఛగా సాగుతోంది.
నిజామాబాద్ జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు 59 నమూనాలు సేకరించగా ఐదు కేసులు నమోదయ్యాయి. వీటిలో మూడు జరిమానా కేసులు కాగా మరో రెండు జైలుకెళ్లేవి ఉన్నాయి. కామారెడ్డిలో 70 నమూనాలు సేకరించగా 10 కేసులయ్యాయి. నాలుగు జైలుకెళ్లేవి, ఆరు జరిమానావి. ల్యాబ్ నివేదికల ఆధారంగా జరిమానాలు, శిక్షలు వేస్తారు. లైసెన్స్ లేకుంటే రూ.5 లక్షలు, ఆర్నెల్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
న్యూస్టుడే, నిజామాబాద్ వైద్యవిభాగం: కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ఇద్దరే అధికారులు ఉన్నారు. 5 నుంచి 10 నమూనాలు సేకరించడం, వీటిని హైదరాబాద్ ల్యాబ్కు పంపడం, నివేదికల ఆధారంగా కేసులు నమోదు చేయడం, జరిమానాలు విధించడంతోనే వీరికి సరిపోతుంది.
ఇష్టారాజ్యంగా విక్రయాలు
మిఠాయి దుకాణాలు, హోటళ్లు మినహాయిస్తే కర్రీ పాయింట్లు, జూస్ సెంటర్లు, పానీపూరి బండ్లు, ఫాస్ట్ఫుడ్ కేంద్రాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. నాసిరకం సామగ్రితో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. అప్పటికప్పుడు ప్రమాదం లేకున్నా.. దీర్ఘకాలికంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు.
ఇక వాహనంలోనే పరీక్షలు
ఆహార పదార్థాల తనిఖీ కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల క్రితం జిల్లాకు ప్రత్యేక వాహనం కేటాయించింది. వ్యాపార సముదాయాలు ఉన్నచోటకు వెళ్లి నమూనాలు సేకరించి అక్కడే పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ సాధ్యపడని నమూనాలు హైదరాబాద్కు పంపనున్నారు.
తనిఖీలు చేస్తున్నాం
- నాయక్, ఆహార భద్రత అధికారి
గత ఏడాది కాలంగా ఉమ్మడి జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాం. ప్రతి దుకాణదారుడు లైసెన్స్ తీసుకోవాలి. లేదంటే జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వాహనం కేటాయించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇందూరు నగరం.. కాషాయ వనం
[ 24-04-2024]
మనసంతా పవనసుతుని నామ జపం.. తనువంతా ఆధ్యాత్మికం.. అయోధ్య రాముడి బంటుగా.. సీతమ్మ జాడను అందించిన హనుమంతుడిపై ఇందూరు ప్రజలు తమ భక్తిని చాటుకున్నారు. -
ప్రణాళికతో సద్వినియోగం
[ 24-04-2024]
సెలవులు వచ్చాయంటే పిల్లలకు భలే సరదా.. చిందులు, సరదాలు, బంధువుల ఇళ్లకు వెళ్లి ఉరకలేసే సమయం. ఆనందం మాత్రమే చూసుకుంటే ఒక్కోసారి విషాదం, ఆందోళనకు దారి తీయొచ్చు. -
సాగర్లో పూడిక.. తొలగించాలిక
[ 24-04-2024]
ఉమ్మడి జిల్లా వరదాయిని నిజాంసాగర్లో పూడిక పేరుకుపోయింది. ప్రస్తుతం 17 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్నట్లు అధికారులు చెబుతున్నా.. ఆ స్థాయిలో నీరు లేదు. -
వరికే ప్రాధాన్యం
[ 24-04-2024]
రానున్న వర్షాకాలంలో నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయనే వాతావరణ శాఖ సమాచారంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది సైతం సమృద్ధిగా వానలు పడితే జలాశయాలు నిండి పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరివ్వొచ్చనే అంచనాలతో వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. -
సంగ్రామానికి సమష్టిగా..
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల పోరు ఊపందుకొంది. అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార వేగాన్ని పెంచుతున్నారు. -
సమాచారం అరచేతిలో..
[ 24-04-2024]
ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఎప్పటికప్పుడు అనేక మార్పులు వస్తున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం నూతన సంస్కరణలకు నాంది పలికింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో యంత్రాంగం సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటోంది. -
బాలాగౌడ్కు అత్యల్పం.. రాంగోపాల్రెడ్డికి అత్యధికం
[ 24-04-2024]
ఎన్నికల్లో ఒక్క ఓటు అనేది ఎంతో కీలకం. ఒక్క ఓటుతోనే ఫలితం తారుమారు కావచ్చు. చాలా మంది ఓటుహక్కును వినియోగించుకోవడం లేదు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరూ ఎంపీలు స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. -
పోలింగ్శాతంపై అభ్యర్థుల బెంగ
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో నమోదయ్యే పోలింగ్శాతంపై అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఏప్రిల్లోనే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. -
ఐదో రోజు తొమ్మిది నామినేషన్లు
[ 24-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఐదో రోజైన మంగళవారం తొమ్మిది మంది నామినేషన్లు వేశారు. అశోక్గౌడ్(బహుజన్ లెఫ్ట్ పార్టీ), పోతు నవీన్(ఆలిండియా బీసీ, ఓబీసీ పార్టీ), నాగార్జున్(ప్రజా సేన పార్టీ), ఎండీ.షాహెద్ ఖాన్(ఆలిండియా నేషనల్ పార్టీ), గోలి నరేష్(దళిత బహుజన పార్టీ), శక్తి ప్రసాద్, బీబీ నాయక్, మహ్మద్ జమీల్, సాయికృష్ణ(స్వతంత్ర) నామపత్రాలను రిటర్నింగ్ అధికారి రాజీవ్గాంధీ హన్మంతుకు అందజేశారు. -
ఓట్లు ఎక్కువ.. ప్రాతినిధ్యం తక్కువ
[ 24-04-2024]
పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. రాజకీయ రంగంలోకి వచ్చేసరికి సర్పంచి నుంచి జడ్పీ ఛైర్పర్సన్ వరకు ఇలా వివిధ పదవుల్లో రాణిస్తున్నారు. -
కార్యకర్తలపైనే ప్రచార బాధ్యతలు
[ 24-04-2024]
నామపత్రాల దాఖలు గడువు చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గతానికి భిన్నంగా జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మొదటిసారి త్రిముఖపోరు నెలకొంది. -
పర్యవేక్షిస్తేనే ఆదాయం
[ 24-04-2024]
బల్దియాల నుంచి అనుమతులు పొందకుండానే ప్రధాన కూడళ్లతోపాటు ఆయా రోడ్ల పక్కన ప్రచార బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఈ దిశగా అడుగులు పడటంలేదు. -
200 మందికి ఉపాధి లక్ష్యం
[ 24-04-2024]
గ్రామాల్లో ఉపాధి పనుల జోరు పెంచాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి గ్రామ పంచాయతీలో 200 మంది కూలీల కంటే ఎక్కువగా హాజరు ఉండాలని పేర్కొంది. దీంతో జిల్లా యంత్రాంగం ఉపాధి కూలీల సంఖ్య పెరగడంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి