నాటి కీర్తనలు.. నేటి తరానికి
ఆధ్యాత్మిక ప్రియులకు అన్నమయ్య కీర్తనలు అంటే అమితమైన మక్కువ. వాటిని నేర్చుకోలేకపోయామని చాలా మంది అప్పుడప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు.
సరస్వతి ఆలయంలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న పూర్ణదయాళ్
న్యూస్టుడే, బాన్సువాడ: ఆధ్యాత్మిక ప్రియులకు అన్నమయ్య కీర్తనలు అంటే అమితమైన మక్కువ. వాటిని నేర్చుకోలేకపోయామని చాలా మంది అప్పుడప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. అలాంటి కీర్తనలపై ఆసక్తి, పట్టు ఉన్న ఓ వ్యక్తి వాటిని చిన్నారులకు ఉచితంగా నేర్పిస్తున్నారు. ఆయనే బాన్సువాడ శాఖ ఎస్బీఐ మేనేజర్ పూర్ణదయాళ్. ఈయన పట్టణంలోని సరస్వతి ఆలయంలో దాదాపు 30 మంది చిన్నారులకు ఎనిమిది నెలలుగా ప్రతి గురువారం శిక్షణ ఇస్తున్నారు.
పుస్తకాలు కొనుగోలు చేసి
పూర్ణదయాళ్ది నస్రుల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు 14,800 అన్నమయ్య సంకీర్తనలను 29 పుస్తకాల్లో ముద్రించగా.. పూర్ణదయాళ్ వాటిని సహ ఉద్యోగి సహకారంతో కొన్నేళ్ల క్రితం కొనుగోలు చేశారు. అనంతరం భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి తెలుగు, హిందీ, ఆంగ్లం, తమిళం, కన్నడ భాషల్లో పుస్తకాలు, సీడీలుగా రూపొందించి అన్నమయ్య సంకీర్తనలపై తనకున్న ఇష్టాన్ని చాటుకున్నారు.
చిన్నారుల కోసం సమయం కేటాయిస్తున్నా
పూర్ణదయాళ్, బాన్సువాడ ఎస్బీఐ బ్యాంకు మేనేజర్
అన్నమయ్య కీర్తనలు అంటే నాకు ప్రాణం. చిన్నారులకు నేర్పించాలనే ఉద్దేశంతో ప్రతి గురువారం వారికి రెండున్నర గంటల సమయం కేటాయిస్తున్నా. ఇప్పటికే చాలా మంది చిన్నారులు శిక్షణ పొంది బాగా పాడుతున్నారు. కీర్తనలు చాలా భాషల్లోకి తర్జుమా చేసి పుస్తకాలు, సీడీలు రూపొందించడంతో పాటు వెబ్సైట్లోనూ (www.annamayyabadi.com) ఉంచాను. అన్ని భాషల్లో అందుబాటులో ఉంచే ప్రయత్నం చేశా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయాలి.. చైతన్యం చాటాలి
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా స్వీప్ ద్వారా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. -
ఆధారాలు చూపిస్తే నగదు వాపస్
[ 29-03-2024]
పార్లమెంట్ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినందున పోలీసు, ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్ బృందాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయని, రూ.50 వేల కంటే ఎక్కువ నగదు, బంగారం, వెండి, ఇతర వస్తువులకు -
లక్ష్య సాధనలో పరుగులు
[ 29-03-2024]
జిల్లాలో వ్యవసాయోత్పత్తులు ఆశాజనకంగా ఉండటంతో మార్కెట్ ఫీజు వసూళ్లు ఈ ఏడాది ఊపుమీదున్నాయి. -
ఇంటి వద్దే ఓటు
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల్లోనూ దివ్యాంగులు, వయోవృద్ధులకు ఇంటి వద్దనే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. -
బాసరలో జంట ఆత్మహత్య ఘటనలో యువకుడి గుర్తింపు
[ 29-03-2024]
బాసర రైల్వే స్టేషన్లో బుధవారం రాత్రి ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. -
నిధులు లేక.. నిలిచిన భూ సేకరణ
[ 29-03-2024]
జిల్లాలోని సాగునీటి పథకాల నిర్మాణాలకు నిధుల విడుదలలో జాప్యంతో భూ సేకరణ నిలిచిపోయింది. కాళేశ్వరం ప్యాకేజీ-22 పనులతో పాటు నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. -
స్తబ్దుగా సలహా సంఘాలు
[ 29-03-2024]
ప్రజల భాగస్వామ్యంతో ఆయా శాఖల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం సలహా సంఘాలను(అభివృద్ధి కమిటీలు) ఏర్పాటు చేస్తుంది. -
చోరీలకు పాల్పడిన నిందితుడి రిమాండ్
[ 29-03-2024]
మద్యానికి బానిసై చోరీలు చేసిన నిందితుడిని రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ సత్యనారాయణ పేర్కొన్నారు. పట్టణంలోని కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. -
కుళాయి కనెక్షన్లు.. ఆన్లైన్లో తప్పులు
[ 29-03-2024]
పాలనలో పారదర్శకత పెంచడానికి, ప్రజలకు జవాబుదారీతనం కలిగించడానికి ఆన్లైన్ విధానం అమల్లోకి తెచ్చినా క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో అపసోపాలు తప్పడం లేదు. -
కర్ణాటకలో జిల్లా దంపతుల బలవన్మరణం
[ 29-03-2024]
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా సోమవార్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.