నేర్చుకుందామా ప్రాణవిద్య
హైదరాబాద్ జింఖానా మైదానంలో ఒక మహిళ స్పృహ తప్పి పడిపోగా అక్కడే విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ సీపీఆర్ అందించారు. ఈ ఘటన సెప్టెంబరులో చోటుచేసుకుంది.
సీపీఆర్పై కొరవడిన అవగాహన
ఆశా కార్యకర్త ప్రయత్నం చర్చనీయాంశం
ఇందూరు ఫీచర్స్, న్యూస్టుడే
హైదరాబాద్ జింఖానా మైదానంలో ఒక మహిళ స్పృహ తప్పి పడిపోగా అక్కడే విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ సీపీఆర్ అందించారు. ఈ ఘటన సెప్టెంబరులో చోటుచేసుకుంది.
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండూరు గిర్ని చౌరస్తాలో అప్పటి వరకు మాట్లాడిన సాగర్ అకస్మాత్తుగా కుప్పకూలారు. వెంటనే గుర్తించిన ఆయన భార్య, ఆశా కార్యకర్త వాసవి వెంటనే సీపీఆర్(కార్డియోపల్మనరీ రిససీటేషన్) చేసి కాపాడేందుకు ప్రయత్నించారు. తీవ్రమైన నొప్పి కావడంతో ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటన సోమవారం జరిగింది.
హైదరాబాద్లోనే మరో వ్యక్తి విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించిన కానిస్టేబుల్ సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించారు. నవంబరు చివరి వారంలో చోటు చేసుకుందీ ఘటన.
ఇలా అక్కడక్కడ సీపీఆర్ చేస్తుండటంతో ఇటీవల ఈ పదానికి ప్రాచుర్యం లభించింది. కానీ ఎలా చేయాలన్నది అవగాహన లేదు. దేశంలో 98 శాతం మందికి సీపీఆర్పై అవగాహనే లేదని చెబుతారు. వైద్య, అత్యవసర సిబ్బంది విధి అంటూ పొరబడుతుంటారు. గుండె వైద్య నిపుణులు మాత్రం ప్రతి ఒక్కరూ తెలిసి ఉండాల్సిన నైపుణ్యం అంటారు. ఇంట్లో ఆత్మీయులే అపస్మారక స్థితికి చేరితే అంబులెన్సు, లేదా ఆస్పత్రికి చేరుకునే వరకు ప్రాణం నిలబెట్టేది ఇదేనంటారు నిపుణులు.
ఇటీవల కాలంలో కూర్చున్న చోటనే కుప్పకూలడం, వేదికపై మాట్లాడుతూ, నృత్యం చేస్తూ, హాస్యం పండిస్తూ, జిమ్లో వ్యాయామం చేస్తూ... అకస్మాత్తుగా మరణిస్తున్న ఘటనలు చాలానే చూశాం. వీరికి తక్షణం నాణ్యమైన సీపీఆర్ అందిస్తే కొంత మేరకైనా ప్రాణం నిలిపే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. ఎయిమ్స్ వంటి సంస్థలు దేశంలో సీపీఆర్పై విస్తృత అవగాహన, శిక్షణ ఇప్పించాలని ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే పలు సంఘాల ఆధ్వర్యంలో తర్ఫీదునిస్తున్నారు.
ఇలాంటి ప్రయత్నాలు ప్రయోజనకరం..
గతంలో సంస్కార్ ప్లాన్ ఆధ్వర్యంలో కొనసాగిన పాఠశాలల్లో చిన్నారి డాక్టర్లు అనే విధానం కొనసాగించేవారు. 6-10 వ తరగతుల్లో ఒక్కొక్కరిని ఎంపిక చేసి వారికి ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించేవారు.
* ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆరోగ్య కమిటీలు ఏర్పాటు చేసి ఒకరిని చిన్నారి డాక్టర్గా పిలిచేవారు. తోటి విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత, అనారోగ్యానికి గురైతే ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చే బాధ్యతలు చూసేవారు. ఈ విధానం ఇప్పుడు బడుల్లో లేదు. వీటిని పునరుద్ధరించి వారికి ప్రథమ, అత్యవసర చికిత్సపై అవగాహన ఏర్పరిస్తే సమాజంలోకి చిన్నారి డాక్టర్లను పంపినట్లే.
* కేరళలో 2019లో సీపీఆర్ ప్రాధాన్యం గుర్తించి ఏక కాలంలో 35వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. పాఠశాలల్లో ఇంకా నేర్పిస్తున్నారని చెబుతారు.
విద్యార్థులకు నేర్పిస్తే...
ప్రభుత్వ విద్యాలయాల్లోని విద్యార్థులనే తీసుకుంటే 5.24 లక్షల మంది ప్రాథమిక వైద్యులను సమాజంలోకి వదిలినట్లే. ప్రతి ఐదుగురికి ఒక సీపీఆర్ నిపుణుడు అందుబాటులోకి వస్తారు.
ఇలా చేయాలి
గుండెపోటు, ప్రమాదం, విషాహారం, పాముకాటు, నీట మునిగిన సమయంలో ఒక వ్యక్తి అపస్మారక స్థితిలో లేదా ఉలుకు పలుకు లేకుండా పడి ఉంటారు. వీరిని ప్రాథమికంగా స్పృహ కోల్పోయిన వ్యక్తులేనని గుర్తించడానికి మొదట వారి దగ్గరకు వెళ్లి భుజంపై తట్టి చెవి దగ్గర గట్టిగా అరచి లేపాలి. స్పందన కొరవడితే వెంటనే సీపీఆర్ ప్రక్రియలోకి దిగాలి. అది ఎలా చేయాలో ముంబయిలోని రిలయన్స్కు చెందిన ఆస్పత్రిలో ఎమర్జెన్సీ వైద్యంలో పీజీ చేసి విధులు నిర్వర్తిస్తున్న జిల్లా వాసి గోనె యజ్ఞ ఇలా చెబుతున్నారు.
అవకాశమున్న చోట అవగాహన
- సుదర్శనం, జిల్లా వైద్యాధికారి
ఇటీవల ఆశా కార్యకర్తలు, ఇతర వైద్య సిబ్బందికి అత్యవసర వైద్యంపై శిక్షణనిచ్చాం. వైద్య సిబ్బందికి అవగాహన ఉంది. విద్యాలయాల్లో వ్యాధులపై అవగాహన కల్పించే క్రమంలో అత్యవసర వైద్యంపైనా చెబుతుంటాం. అవకాశమున్న చోట సీపీఆర్పై అవగాహన కల్పిస్తాం. అందరికీ ఉంటే ప్రయోజనం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
[ 23-04-2024]
భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి. శంకర్ అన్నారు. -
కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా పని చేయాలి
[ 23-04-2024]
కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని కార్యకర్తలు ప్రజల మధ్యకు తీసుకుపోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. -
వైభవంగా రథోత్సవం
[ 23-04-2024]
శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా మంగళవారం వేకువజామున పట్టణ కేంద్రంలో రథోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. -
ఘనంగా హనుమాన్ విజయయాత్ర
[ 23-04-2024]
ఎల్లారెడ్డి పట్టణంలోని పలు ఆంజనేయ స్వామి ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
[ 23-04-2024]
మడలంలోని అన్ని గ్రామాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. -
రేపటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు
[ 23-04-2024]
జిల్లాలో రేపటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు డీఈఓ రాజు ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం
[ 23-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. -
భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 23-04-2024]
ధర్మారెడ్డి గ్రామంలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మన పార్లమెంటు మహోన్నతం
[ 23-04-2024]
దేశమంతా సార్వత్రిక ఎన్నికల సంగ్రామంతో హోరెత్తుతోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. ఫలితమెలా ఉంటుందని ఉత్కంఠగా ఎదురుచూస్తోంది -
పద..పార్టీ మారుదాం !
[ 23-04-2024]
రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీల క్యాడర్ స్వరూపం మారిపోతోంది. ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు కిందిస్థాయి క్రీయాశీలక కార్యకర్తల వరకు ఒక్కొక్కరు తమకు అనుకూలంగా ఉండే పార్టీల వైపు క్యూ కడుతున్నారు. -
ఓటరే లక్ష్యం.. అస్త్రాలు సిద్ధం
[ 23-04-2024]
పార్లమెంటు ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభంకావడంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయం వేడెక్కింది. నిజామాబాద్, జహీరాబాద్ లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉండే అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు -
12 లో ఫెయిల్ జీవితంలో గెలుపు
[ 23-04-2024]
పది, ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో ఉత్తీర్ణతే మైలురాయి కాదు. విద్యాలయాలకు వెళ్లకపోయినా దూర విద్యలోనూ డిగ్రీలు సాధించి ఉన్నత స్థానాల్లో స్థిరపడినవారున్నారు. పరిమిత వనరుల్లోనూ ప్రణాళికాబద్ధంగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి -
పోరు.. ఇక హోరు
[ 23-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అగ్రనేతల ప్రచారానికి రంగం సిద్ధమైంది. కాంగ్రెస్, భారాస, భాజపాలు ఇప్పటికే నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశాయి -
సెప్టెంబరులో చక్కెర కర్మాగారాలు తెరిపిస్తాం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు నిజాం చక్కెర కర్మాగారాలు తెరిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
ఓటరు తీర్పు విభిన్నం..
[ 23-04-2024]
కామారెడ్డి జిల్లా ప్రజలకు జహీరాబాద్, మెదక్ లోక్సభ స్థానాలతో అనుబంధం ఉంది. ఇక్కడి ఓటర్లు విభిన్నమైన తీర్పులు ఇచ్చారు. -
వీడని వాన
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాను అకాల వర్షాలు వీడటం లేదు. ఉపరితల ద్రోణి ప్రభావంతో వరుసగా కురుస్తున్న వానలు అన్నదాతలకు కునుకులేకుండా చేస్తున్నాయి. సోమవారం కూడా పలు ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో వర్షం పడింది. -
బోధన్ - మహబూబ్నగర్ ప్యాసింజర్ రద్దు
[ 23-04-2024]
నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి మహబూబ్నగర్ మధ్య నడిచే రైలును మే 16 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వు జారీ చేశారు -
2.30 లక్షల మె.ట.ధాన్యం కొనుగోలు
[ 23-04-2024]
జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా ఆధ్వర్యంలో మొదట 480 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. 411 కేంద్రాలు ప్రారంభించి ఇప్పటి వరకు 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి.. రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది -
కాంగ్రెస్ శ్రేణుల్లో హుషారు
[ 23-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహించిన తొలి ఎన్నికల సభకు భారీగా జనం తరలివచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా ఇతర నాయకులు తమ ప్రసంగాలతో పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం నింపారు
తాజా వార్తలు (Latest News)
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్