logo

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఉమ్మడి జిల్లాల డీసీసీబీ ఛైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated : 08 Dec 2022 19:28 IST

బీర్కూరు : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఉమ్మడి జిల్లాల డీసీసీబీ ఛైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. బీర్కూరు మండలంలోని అన్నారం గ్రామంలో రూ.25లక్షలతో నిర్మించనున్న ఎరువుల నిల్వ గిడ్డంగికి ఆయన భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల సౌకర్యం కోసం ప్రభుత్వం ధాన్యం, ఎరువుల నిల్వ గిడ్డంగులను నిర్మిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘు, సొసైటీ ఛైర్మన్‌ మారుతీపటేల్, తెరాస యూత్‌ మండల అధ్యక్షుడు శశికాంత్‌, విండో కార్యదర్శి జాకీర్‌, ఎంపీటీసీ భారతి, సర్పంచ్‌ సాయిరాం పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని