టాస్క్కు వెనుకడుగు
డిగ్రీతోనే అయిదంకెల వార్షికాదాయంతో ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. ప్రాంగణ నియామకాల్లో ప్రతిభ చాటుతున్నారు. ఇటీవల వివిధ కళాశాలల్లో ప్రముఖ సంస్థల ప్రతినిధులు వచ్చి మౌఖిక పరీక్షలు నిర్వహించి విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నారు.
వివరాల నమోదుకు కళాశాలలు దూరం
న్యూస్టుడే, కామారెడ్డి విద్యావిభాగం
దరఖాస్తులు అందజేస్తున్న విద్యార్థులు
డిగ్రీతోనే అయిదంకెల వార్షికాదాయంతో ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. ప్రాంగణ నియామకాల్లో ప్రతిభ చాటుతున్నారు. ఇటీవల వివిధ కళాశాలల్లో ప్రముఖ సంస్థల ప్రతినిధులు వచ్చి మౌఖిక పరీక్షలు నిర్వహించి విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నారు. సంస్థలో వచ్చే ఆటుపోట్లు, ఆర్థిక స్థితిగతులు, వినియోగదారులతో సంబంధాల నిర్వహణ తదితర అంశాల్లో ఏ మేరకు అవగాహన ఉందో పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. టాస్క్ శిక్షణతోనే ఇది సాధ్యం అవుతోంది. అంత టి ప్రాధాన్యం ఉన్న దీనికి ఈ విద్యా సంవత్సరం అనేక కళాశాలలు దరఖాస్తులు సమర్పించలేదు. ఈ నెల 24 వరకు గడువు ఉంది. ఈలోపు ఆయా యాజమాన్యాలు స్పందించాలని నిర్వాహకులు కోరుతున్నారు.
చదువుతూనే ఉద్యోగాలపై ఆసక్తి
ప్రముఖ సంస్థల ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాలల్లో నిర్వహించే ప్రాంగణ నియామకాల ద్వారా జిల్లాలో ఐదేళ్లలో 500 మంది ఎంపికయ్యారు. వీరికి రూ.18 వేల- రూ.25 వేల వరకు వేతనం ఉంది. అనుభవం ఆధారంగా మరింత పెరుగుతుందని సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.
శిక్షణే కీలకం
డిగ్రీ విద్యార్థులకు ఏటా టాస్క్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి కళాశాలకు ఒక శిక్షకుడిని నియమిస్తున్నారు. వారు ఆంగ్లంపై పట్టు పెంపొందించుకునేలా మెలకువలు సూచిస్తారు. సమకాలీన అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఎదుటివారితో అలవోకగా మాట్లాడే నైపుణ్యాలు నేర్పుతారు. సంబంధాలను మెరుగపరుచుకునే అంశాలను మార్గదర్శనం చేస్తారు. ఈ విద్యా సంవత్సరం 3,600 మంది విద్యార్థులు టాస్క్ శిక్షణకు వివరాలు నమోదు చేసుకున్నారు.
యాజమాన్యాలు స్పందించాలి: - శ్రీనాథ్రెడ్డి, ఉమ్మడి జిల్లా టాస్క్ రిలేషన్షిప్ మేనేజర్
ఉమ్మడి జిల్లాలో ఆయా కళాశాలల యాజమాన్యాలు టాస్క్ శిక్షణ నిమిత్తం దరఖాస్తు చేసుకోవాలి. శిక్షణ ద్వారా విద్యార్థుల్లో మార్పు వస్తుంది. సామర్థ్యాలు మెరుగుపడతాయి. భావవ్యక్తీకరణ, సంబంధాల నిర్వహణపై పట్టు సాధిస్తారు. ప్రాంగణ నియామకాల్లో సునాయాసంగా విజయం సాధించేలా అడుగులు వేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్లో చేరిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికల వేళ జహీరాబాద్ పార్లమెంట్ పరిధి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
మతోన్మాద పార్టీలకు గుణపాఠం చెప్పాలి
[ 25-04-2024]
సీపీఎం కామారెడ్డి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. -
ప్రపంచ మలేరియా దినోత్సవ అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
భాజపా ఎన్నికల ప్రచారం
[ 25-04-2024]
ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపే విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నారని భాజపా మండల ప్రధాన కార్యదర్శి నరేష్ పేర్కొన్నారు. -
ఓటే వజ్రాయుధం
[ 25-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. -
6 గ్యారంటీ పథకాలే కాంగ్రెస్ను గెలిపిస్తాయి
[ 25-04-2024]
ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెత్కర్ కు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇంటర్లో అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ 27వ స్థానంలో, ద్వితీయంలో 29వ స్థానంలో నిలిచింది. -
సమాయత్తం.. ఓట్లపైనే చిత్తం
[ 25-04-2024]
లోక్సభ నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ నామ పత్రాలు దాఖలు చేశారు. -
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. -
ఫిర్యాదులపై పెరిగిన చైతన్యం
[ 25-04-2024]
ఎన్నికల నియమాలు, ఉల్లంఘనలపై పౌరుల్లో చైతన్యం పెరిగింది. ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల్ కమిషన్ 1950 కాల్సెంటర్, సీ-విజిల్ యాప్ను రూపొందించిన విషయం తెలిసిందే -
రాష్ట్రంలో చివరి స్థానం
[ 25-04-2024]
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫలితాలు నిరాశపరిచాయి. తొలిసారిగా రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. 35వ స్థానంలో నిలిచింది. -
ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం
[ 25-04-2024]
ఎల్లారెడ్డి బల్దియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. -
కళాశాలల తనిఖీలకు వేళాయె
[ 25-04-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 2024-25 నూతన విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ కోసం ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల తనిఖీలు గురువారం నుంచి చేపట్టనున్నారు. -
కోడ్ ముగిశాకే.. సవరణకు అవకాశం
[ 25-04-2024]
ఎన్నికల కోడ్ రాకముందే ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. -
అదరగొట్టారు..
[ 25-04-2024]
కుటుంబ నేపథ్యం ఏదైనా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని అహర్నిశలు కష్టపడ్డారు. నిపుణుల వద్ద సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రణాళికబద్ధంగా చదివారు. పరీక్షలు రాశారు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్