logo

350 క్వింటాళ్ల బియ్యం పట్టివేత

కమిషనరేట్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు భారీగా పీడీఎస్‌ బియ్యాన్ని పట్టుకొన్నారు. వర్ని ఠాణా పరిధిలో అక్రమ రవాణా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ సీఐ వెంకటేష్‌ ఆధ్వర్యంలో గురువారం నిఘా ఉంచారు.

Published : 09 Dec 2022 05:09 IST

స్వాధీనం చేసుకొన్న లారీతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

నిజామాబాద్‌ నేరవార్తలు: కమిషనరేట్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు భారీగా పీడీఎస్‌ బియ్యాన్ని పట్టుకొన్నారు. వర్ని ఠాణా పరిధిలో అక్రమ రవాణా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ సీఐ వెంకటేష్‌ ఆధ్వర్యంలో గురువారం నిఘా ఉంచారు. ఓ లారీలో తరలిస్తున్న 350 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఠాణాకు తరలించారు. లారీ యజమాని హబీబ్‌, చోదకుడు చంద్రకాంత్‌పై కేసు నమోదు చేశారు. పట్టుబడిన నిల్వల విలువ రూ.10 లక్షలు పైబడి ఉంటుందని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని