నాటు తుపాకీ పేలి వేటగాడు మృతి
వన్య ప్రాణుల వేటకు వెళ్లిన వేటగాడు ప్రమాదవశాత్తు నాటు తుపాకీ పేలి మృతి చెందిన ఘటన సిరికొండ మండలం తూంపల్లి అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది.
తూంపల్లిలో ఘటన
బానావత్ రావోజీ
సిరికొండ, మాచారెడ్డి, న్యూస్టుడే: వన్య ప్రాణుల వేటకు వెళ్లిన వేటగాడు ప్రమాదవశాత్తు నాటు తుపాకీ పేలి మృతి చెందిన ఘటన సిరికొండ మండలం తూంపల్లి అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. ధర్పల్లి సీఐ సైదా, సిరికొండ ఎస్సై నర్సింహులు కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సర్ధాపూర్తండాకు చెందిన బానావత్ రావోజీ, రాంరెడ్డి, సోమర్పేట్కు చెందిన ఆశారెడ్డి కలిసి బుధవారం రాత్రి తూంపల్లి శివారులోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. చెట్టుపై ఉన్న రావోజీ (38)కి కింద ఉన్న రాంరెడ్డి తుపాకీ అందిస్తున్న క్రమంలో ట్రిగ్గర్ కొమ్మకు తగిలి పేలింది. తూటా నేరుగా రావోజీకి తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలిని గురువారం డీఎఫ్ఓ వికాస్మీనా పరిశీలించారు. వేటగాళ్లపై వన్య ప్రాణుల సంరక్షణ చట్టం- 1972 సెక్షన్లు 9, 39, 49, 50 కింద కేసు నమోదు చేశారు.
లభ్యమైన నాటు తుపాకీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇందూరు నగరం.. కాషాయ వనం
[ 24-04-2024]
మనసంతా పవనసుతుని నామ జపం.. తనువంతా ఆధ్యాత్మికం.. అయోధ్య రాముడి బంటుగా.. సీతమ్మ జాడను అందించిన హనుమంతుడిపై ఇందూరు ప్రజలు తమ భక్తిని చాటుకున్నారు. -
ప్రణాళికతో సద్వినియోగం
[ 24-04-2024]
సెలవులు వచ్చాయంటే పిల్లలకు భలే సరదా.. చిందులు, సరదాలు, బంధువుల ఇళ్లకు వెళ్లి ఉరకలేసే సమయం. ఆనందం మాత్రమే చూసుకుంటే ఒక్కోసారి విషాదం, ఆందోళనకు దారి తీయొచ్చు. -
సాగర్లో పూడిక.. తొలగించాలిక
[ 24-04-2024]
ఉమ్మడి జిల్లా వరదాయిని నిజాంసాగర్లో పూడిక పేరుకుపోయింది. ప్రస్తుతం 17 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్నట్లు అధికారులు చెబుతున్నా.. ఆ స్థాయిలో నీరు లేదు. -
వరికే ప్రాధాన్యం
[ 24-04-2024]
రానున్న వర్షాకాలంలో నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయనే వాతావరణ శాఖ సమాచారంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది సైతం సమృద్ధిగా వానలు పడితే జలాశయాలు నిండి పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరివ్వొచ్చనే అంచనాలతో వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. -
సంగ్రామానికి సమష్టిగా..
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల పోరు ఊపందుకొంది. అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార వేగాన్ని పెంచుతున్నారు. -
సమాచారం అరచేతిలో..
[ 24-04-2024]
ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఎప్పటికప్పుడు అనేక మార్పులు వస్తున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం నూతన సంస్కరణలకు నాంది పలికింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో యంత్రాంగం సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటోంది. -
బాలాగౌడ్కు అత్యల్పం.. రాంగోపాల్రెడ్డికి అత్యధికం
[ 24-04-2024]
ఎన్నికల్లో ఒక్క ఓటు అనేది ఎంతో కీలకం. ఒక్క ఓటుతోనే ఫలితం తారుమారు కావచ్చు. చాలా మంది ఓటుహక్కును వినియోగించుకోవడం లేదు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరూ ఎంపీలు స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. -
పోలింగ్శాతంపై అభ్యర్థుల బెంగ
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో నమోదయ్యే పోలింగ్శాతంపై అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఏప్రిల్లోనే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. -
ఐదో రోజు తొమ్మిది నామినేషన్లు
[ 24-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఐదో రోజైన మంగళవారం తొమ్మిది మంది నామినేషన్లు వేశారు. అశోక్గౌడ్(బహుజన్ లెఫ్ట్ పార్టీ), పోతు నవీన్(ఆలిండియా బీసీ, ఓబీసీ పార్టీ), నాగార్జున్(ప్రజా సేన పార్టీ), ఎండీ.షాహెద్ ఖాన్(ఆలిండియా నేషనల్ పార్టీ), గోలి నరేష్(దళిత బహుజన పార్టీ), శక్తి ప్రసాద్, బీబీ నాయక్, మహ్మద్ జమీల్, సాయికృష్ణ(స్వతంత్ర) నామపత్రాలను రిటర్నింగ్ అధికారి రాజీవ్గాంధీ హన్మంతుకు అందజేశారు. -
ఓట్లు ఎక్కువ.. ప్రాతినిధ్యం తక్కువ
[ 24-04-2024]
పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. రాజకీయ రంగంలోకి వచ్చేసరికి సర్పంచి నుంచి జడ్పీ ఛైర్పర్సన్ వరకు ఇలా వివిధ పదవుల్లో రాణిస్తున్నారు. -
కార్యకర్తలపైనే ప్రచార బాధ్యతలు
[ 24-04-2024]
నామపత్రాల దాఖలు గడువు చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గతానికి భిన్నంగా జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మొదటిసారి త్రిముఖపోరు నెలకొంది. -
పర్యవేక్షిస్తేనే ఆదాయం
[ 24-04-2024]
బల్దియాల నుంచి అనుమతులు పొందకుండానే ప్రధాన కూడళ్లతోపాటు ఆయా రోడ్ల పక్కన ప్రచార బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఈ దిశగా అడుగులు పడటంలేదు. -
200 మందికి ఉపాధి లక్ష్యం
[ 24-04-2024]
గ్రామాల్లో ఉపాధి పనుల జోరు పెంచాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి గ్రామ పంచాయతీలో 200 మంది కూలీల కంటే ఎక్కువగా హాజరు ఉండాలని పేర్కొంది. దీంతో జిల్లా యంత్రాంగం ఉపాధి కూలీల సంఖ్య పెరగడంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో