logo

కారు అదుపుతప్పి నలుగురికి గాయాలు

బస్వాపూర్‌ వద్ద కారు అదుపుతప్పి 44వ జాతీయ రహదారిపై నుంచి సర్వీస్‌ రోడ్డుపైకి దూసుకుపోయిన ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.

Published : 20 Jan 2023 04:33 IST

నాలుగేళ్ల బాలుడి పరిస్థితి విషమం

భిక్కనూరు, న్యూస్‌టుడే: బస్వాపూర్‌ వద్ద కారు అదుపుతప్పి 44వ జాతీయ రహదారిపై నుంచి సర్వీస్‌ రోడ్డుపైకి దూసుకుపోయిన ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. వీరిలో నాలుగేళ్ల బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన భార్యాభర్తలు సంతోష్‌ అగర్వాల్‌, సునీత, కూతురు పద్మ, మనవళ్లు ప్రథమ్‌(1), క్రిషన్‌(4)తోపాటు మరో మహిళ లలిత కలిసి గురువారం కారులో హైదరాబాద్‌ బయలుదేరారు. వేగంగా వెళ్తుండగా బస్వాపూర్‌ వద్ద అదుపు తప్పి ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై నుంచి పక్కకు దూసుకెళ్లి విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టి సర్వీస్‌ రోడ్డుపైకి చేరింది. పద్మ, క్రిషన్‌కు తీవ్ర గాయాలవ్వడంతో 108లో రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. డ్రైవర్‌ నిద్ర మత్తులోకి జారుకోవడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని