కేంద్రీయ విద్యాలయానికి నిధులు మంజూరు
దాదాపు దశాబ్ద కాలంగా తాత్కాలిక భవనంలో అరకొర వసతుల మధ్య ఉమ్మడి నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయం(కేవి) కొనసాగుతోంది.
రూ.21 కోట్లతో నిర్మాణానికి ఆమోదం
న్యూస్టుడే, బోధన్ గ్రామీణం
బెల్లాల్లో తాత్కాలిక భవనంలో కొనసాగుతున్న పాఠశాల
దాదాపు దశాబ్ద కాలంగా తాత్కాలిక భవనంలో అరకొర వసతుల మధ్య ఉమ్మడి నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయం(కేవి) కొనసాగుతోంది. ఎట్టకేలకు రూ.21 కోట్లతో భవన నిర్మాణానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ ఆమోదం తెలిపింది. ఇప్పటికే రూ.5 కోట్లు విడుదల చేసింది. త్వరలోనే బడికి సొంత భవనం అందుబాటులోకి వచ్చి విద్యార్థులు, తల్లిదండ్రుల ఆకాంక్ష తీరనుంది.
2014లో ప్రారంభం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవి లేని ఏకైక జిల్లా నిజామాబాద్. దీంతో విద్యాశాఖ అధికారులు దీన్ని ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖకు లేఖలు పంపించారు. బోధన్లో విద్యాలయ ఏర్పాటుకు తాత్కాలిక భవనం, శాశ్వత భవనానికి పాండుఫారం శివారులో 8 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు నివేదించారు. దీంతో 2014లో విద్యాలయం మంజూరైంది. 2015 విద్యా సంవత్సరం నుంచి బెల్లాల్లోని మధుమలాంచ జూనియర్ కళాశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. వసతులు లేని ఈ భవనంలోనే ప్రస్తుతం 380 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. దీని తరువాత జిల్లా కేంద్రానికి మంజూరైన మరో కేంద్రీయ విద్యాలయానికి సొంత భవనం ఉండగా.. ఇక్కడ 8 ఏళ్ల తరువాత నిధులు కేటాయించారు.
ప్రయోజనాలు ఇవీ ..
గతేడాది బెల్లాల్ కేంద్రీయ విద్యాలయంలో నీట్, ఐఐటీ వంటి పరీక్ష కేంద్రాలను నిర్వహించారు. సొంత భవనం అందుబాటులోకి వస్తే మరిన్ని నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. రెగ్యులర్ ఉపాధ్యాయులు ఇక్కడ పనిచేయడానికి ఆసక్తి కనబర్చడంతో బోధనలో నాణ్యత ప్రమాణాలు పెరిగి విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇంటర్మీడియెట్ వరకు అప్గ్రేడ్ అవుతుంది. పాండుఫారం శివారులో త్వరలో శంకుస్థాపన చేసేందుకు కేవి సంఘటన్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజలు తమ ఓటుని నిర్భయంగా వినియోగించుకోవాలి
[ 28-03-2024]
ఓటర్లలో చైతన్యం పెంచేందుకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు స్వీప్ (సిస్టమటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్) కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఎల్లారెడ్డి ఆర్డీవో, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ప్రభాకర్ తెలిపారు. -
జీవశాస్త్రం పరీక్షకు 100 శాతం విద్యార్థుల హాజరు
[ 28-03-2024]
పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా జీవశాస్త్రం పరీక్ష గురువారం నిర్వహించారు. -
మీ ఓటు ఉందా?
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. కొన్ని రోజుల్లో హడావుడి మొదలవుతుంది. అధికారులు అంతా తీరిక లేకుండా ఉంటారు. ఇప్పుడు ఉన్న ఓటు అప్పుడు లేదంటే ఎవరూ పట్టించుకోరు. -
ఔషధ దుకాణాలపై నజర్
[ 28-03-2024]
గతంలో ఏ జిల్లావారు అక్కడే తనిఖీలు చేసేవారు. కానీ గతేడాది నుంచి జంబ్లింగ్ పద్ధతిని పాటిస్తున్నారు. ప్రతి నెల మొదటి వారంలో ఇతర జిల్లాల అధికారులు నిజామాబాద్లో, ఇక్కడి వారు వేరేచోట తనిఖీలు చేస్తున్నారు. -
సమృద్ధిగా జలం... ఆయకట్టుకు జీవం
[ 28-03-2024]
రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల్లో నీటినిల్వలు అడుగంటిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టుల కింద నిర్దేశిత ఆయకట్టుకు నీటిని అందించలేని పరిస్థితి నెలకొంది. చేతికంది వచ్చిన పంటలు ఎండిపోయి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
నిజామాబాద్ బరిలో జీవన్రెడ్డి
[ 28-03-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అందరూ అనుకున్నట్లుగానే తాటిపర్తి జీవన్రెడ్డిని బరిలోకి దింపనుంది. ఈయన అభ్యర్థిత్వాన్ని అధిష్ఠానం బుధవారం రాత్రి ఖరారు చేసింది. -
‘అవినీతికి చిరునామా కాంగ్రెస్’
[ 28-03-2024]
అవినీతికి చిరునామా కాంగ్రెస్ పార్టీ అని భారాస జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి విమర్శించారు. భారాస జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. -
కొమ్మును కొట్టేస్తున్నారు!
[ 28-03-2024]
అత్యంత పవిత్రంగా భావించే పసుపు పంటను చోరీ చేస్తే ఏదీ కలిసిరాదంటారు. కానీ, నిత్యం నిఘా కెమోరాలు పనిచేసే చోట చోరీ జరుగుతోంది. బంగారంతో పోటీ పడుతున్న పసుపు కొనుగోళ్లు జరిగే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో. -
వలసలతో పరేషాన్..!
[ 28-03-2024]
కాంగ్రెస్లోకి వలసలు రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
డబ్బులు ఎప్పుడొస్తాయో..!
[ 28-03-2024]
‘చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు వెంకట్రెడ్డి. తాడ్వాయి మండలం బ్రహ్మణపల్లి నివాసి. ధరణి పోర్టల్ ప్రారంభమైనప్పుడు భూమి కొనుగోలు చేద్దామని మీ-సేవకేంద్రంలో స్లాటు బుక్చేసుకున్నారు. -
టెట్కు సమాయత్తం
[ 28-03-2024]
సర్కారు ఇటీవల మెగా డీఎస్సీ ప్రకటించింది. గత ప్రభుత్వం 2023లో విడుదల చేసిన ప్రకటనను రద్దు చేసి అప్పటి పోస్టులకు మరిన్ని కలిపి ఇటీవల ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే