తప్పు ఒకరిది.. చలానా మరొకరికి
వాహన చోదకులు నిబంధనలు అతిక్రమిస్తే పోలీసులు కెమెరాతో ఫొటోలు తీసి జరిమానాలు విధిస్తున్నారు. పూర్తి సమాచారం తెలుసుకోకుండానే వెబ్సైట్లో వివరాలు నమోదు చేస్తుండడంతో ఒకరికి బదులు మరొకరు చలాన్లు కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
బీర్కూర్, న్యూస్టుడే: వాహన చోదకులు నిబంధనలు అతిక్రమిస్తే పోలీసులు కెమెరాతో ఫొటోలు తీసి జరిమానాలు విధిస్తున్నారు. పూర్తి సమాచారం తెలుసుకోకుండానే వెబ్సైట్లో వివరాలు నమోదు చేస్తుండడంతో ఒకరికి బదులు మరొకరు చలాన్లు కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి సంఘటన బీర్కూర్లో గుండం గంగారాంకు ఎదురైంది. అతని ద్విచక్ర వాహనం నంబరు టీఎస్ 17 జీ 6817. శిరస్త్రాణం ధరించలేదని 2021 జులై 11న ఈ చలాన్ ద్వారా రూ.235 జరిమానా విధించారు. 15 రోజుల క్రితం బీర్కూర్ ఠాణా ఎదుట నుంచి పొలానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పోలీసులు ఆపి తన వాహనంపై ఏడు చలాన్లు పెండింగ్లో ఉన్నాయని కట్టాలని మందలించి వదిలేశారు. అనుమానం వచ్చి గంగారం స్థానిక పోలీసులను ఆశ్రయించి వివరాలు తెలుసుకున్నారు. తీరా చూస్తే 8817 ద్విచక్ర వాహనంపై వేయాల్సిన చలాన్లు గంగారం ద్విచక్ర వాహనం 6817 నంబర్కు (ఏడు చలాన్లు మొత్తం రూ.1145) విధించారు. తనకు అనారోగ్య సమస్య ఉందని, 15 కి.మీ దాటి ఎక్కడకు వెళ్లనని చెప్పారు. హైదరాబాద్లోని మాదాపూర్, మెదక్, బాన్సువాడ, పిట్లం, నస్రుల్లాబాద్ ప్రాంతాల్లో శిరస్త్రానిణం లేకుండా ప్రయాణించినట్లు తనకు జరిమానా విధించడం ఆశ్యర్యం వేసిందని బాధితుడు వాపోయారు. ద్విచక్ర వాహనంపై ఆరు సంఖ్య ఎనిమిదిలాగా కన్పించడంతోనే వేరే వ్యక్తికి వెళ్లే చలాన్లు గంగారాం ద్విచక్ర వాహనానికి వచ్చాయని పోలీసులు తెలిపారు. బాన్సువాడలో అధికారులను సంప్రదించగా త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారని బాధితుడు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయాలి.. చైతన్యం చాటాలి
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా స్వీప్ ద్వారా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. -
ఆధారాలు చూపిస్తే నగదు వాపస్
[ 29-03-2024]
పార్లమెంట్ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినందున పోలీసు, ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్ బృందాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయని, రూ.50 వేల కంటే ఎక్కువ నగదు, బంగారం, వెండి, ఇతర వస్తువులకు -
లక్ష్య సాధనలో పరుగులు
[ 29-03-2024]
జిల్లాలో వ్యవసాయోత్పత్తులు ఆశాజనకంగా ఉండటంతో మార్కెట్ ఫీజు వసూళ్లు ఈ ఏడాది ఊపుమీదున్నాయి. -
ఇంటి వద్దే ఓటు
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల్లోనూ దివ్యాంగులు, వయోవృద్ధులకు ఇంటి వద్దనే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. -
బాసరలో జంట ఆత్మహత్య ఘటనలో యువకుడి గుర్తింపు
[ 29-03-2024]
బాసర రైల్వే స్టేషన్లో బుధవారం రాత్రి ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. -
నిధులు లేక.. నిలిచిన భూ సేకరణ
[ 29-03-2024]
జిల్లాలోని సాగునీటి పథకాల నిర్మాణాలకు నిధుల విడుదలలో జాప్యంతో భూ సేకరణ నిలిచిపోయింది. కాళేశ్వరం ప్యాకేజీ-22 పనులతో పాటు నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. -
స్తబ్దుగా సలహా సంఘాలు
[ 29-03-2024]
ప్రజల భాగస్వామ్యంతో ఆయా శాఖల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం సలహా సంఘాలను(అభివృద్ధి కమిటీలు) ఏర్పాటు చేస్తుంది. -
చోరీలకు పాల్పడిన నిందితుడి రిమాండ్
[ 29-03-2024]
మద్యానికి బానిసై చోరీలు చేసిన నిందితుడిని రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ సత్యనారాయణ పేర్కొన్నారు. పట్టణంలోని కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. -
కుళాయి కనెక్షన్లు.. ఆన్లైన్లో తప్పులు
[ 29-03-2024]
పాలనలో పారదర్శకత పెంచడానికి, ప్రజలకు జవాబుదారీతనం కలిగించడానికి ఆన్లైన్ విధానం అమల్లోకి తెచ్చినా క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో అపసోపాలు తప్పడం లేదు. -
కర్ణాటకలో జిల్లా దంపతుల బలవన్మరణం
[ 29-03-2024]
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా సోమవార్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు