విశ్వాన్ని ఏలేది ధర్మమే
‘ప్రతి జీవి కణాన్ని కర్మే నిర్ణయిస్తుంది. ఎవరు ఎక్కడ ఎలా పుట్టాలో ముందే తేలిపోతుంది. లోకంలో చెడును రూపుమాపేందుకు ఏదో రూపంలో నారాయణుడు ఉద్భవిస్తూనే ఉంటాడు’ అని శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద పేర్కొన్నారు.
భక్తులను కట్టిపడేసిన పరిపూర్ణానంద ప్రసంగం
అట్టహాసంగా ముగిసిన సాధూ సమ్మేళనం
హాజరైన భక్తులు : మాతాజీలకు పుష్పాభిషేకం చేస్తున్న రాములు మహరాజ్
నందిపేట్ గ్రామీణం : ‘ప్రతి జీవి కణాన్ని కర్మే నిర్ణయిస్తుంది. ఎవరు ఎక్కడ ఎలా పుట్టాలో ముందే తేలిపోతుంది. లోకంలో చెడును రూపుమాపేందుకు ఏదో రూపంలో నారాయణుడు ఉద్భవిస్తూనే ఉంటాడు’ అని శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద పేర్కొన్నారు. నందిపేట్లోని కేదారేశ్వరాలయంలో కొనసాగుతున్న సాధూసమ్మేళనానికి బుధవారం ఆయన హాజరై ప్రవచించారు. దేవుడు ప్రతిజీవి అంతరాత్మలో ఉండి గమనిస్తాడు. విశ్వమంతటా అమ్మవారు ఉంటారని గుర్తెరగాలి అని సూచించారు. దేవీమాత ఎన్ని ప్రదేశాలు ఉన్నా.. భారతదేశాన్నే తన స్థానంగా ఎంచుకుందని.. అందుకే నదులకు అమ్మవారి పేర్లు పెట్టుకున్నామని చెప్పారు. మనల్ని భౌతికంగా రాజ్యాంగమే నడిపించినా ధర్మమే ఈ విశ్వాన్ని ఏలుతుందని.. ప్రతిదీ తపోశ్శక్తితో సాధించొచ్చని చెప్పారు. రచయిత, గాయకుడు కర్క రమేశ్ రూపొందిన ‘ఎగరాలి.. ఎగరాలి కాషాయ జెండా’ ఆడియో సీడీని సాధూపరిషత్ సభ్యులు ఆవిష్కరించారు. ధర్మ పరిరక్షణకు, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఇవి దోహదపడతాయని అఖిలాంధ్ర సాధూపరిషత్ అధ్యక్షురాలు శ్రీమాతా పరావిద్యానందగిరి అన్నారు.
మాతాజీలకు ఘన సత్కారం : సాధూపరిషత్ సమ్మేళనం కనులపండువగా ముగిసింది. పలుగుట్టకు వచ్చిన 40 మంది మాతాజీలను ఆశ్రమ కమిటీ ఆధ్వర్యంలో పుష్పాభిషేకం చేశారు. మహాసభకు హాజరైన దాదాపు 500 మంది స్వామీజీలు, పీఠాధిపతులు, సాధువులకు ఘనంగా వీడ్కోలు పలికారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఆశ్రమ వ్యవస్థాపకుడు రాములు మహరాజ్ బొట్టు పెట్టి ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా 1,331 పూర్ణకలశాలను భక్తులకు పంపిణీ చేశారు. ఏర్పాట్లలో భాగస్వాములైన ఆశ్రమ కమిటీ, గ్రామకమిటీ, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
పలుగుట్ట పైకి సీసీ రోడ్డు : పలుగుట్టపై ఉన్న గ్రామ పోచమ్మ ఆలయానికి వెళ్లేందుకు సీసీ రోడ్డు కోసం రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే జీవన్రెడ్డి హామీ ఇచ్చారు. సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. త్వరలో ఆలయ పరిసరాల్లో ఆసుపత్రి నిర్మించుకుందామని చెప్పారు. గుట్టను పరిరక్షించుకునేందుకు 53 ఎకరాలు సేకరించి పెట్టామన్నారు. సిద్ధుల గుట్ట మాదిరిగా పలుగుట్ట దినదినాభివృద్ధి చెందుతోందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సాధూపరిషత్ సభ్యులు సన్మానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 19-04-2024]
తాండూరు గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి కూలీల వద్దకు వెళ్లి 6 గ్యారంటీలు, రుణమాఫీ గురించి స్థానిక కాంగ్రెస్ నాయకులు వివరించారు. -
పోరు.. ఇక జోరు
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
సిద్ధమవుతున్నారు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో బరిలో నిలిచే అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. -
‘వ్యాపార కాంక్షతోనే బీబీపాటిల్ పోటీ’
[ 19-04-2024]
తన వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకే బీబీపాటిల్ ఎంపీగా పోటీచేస్తున్నారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు విమర్శించారు. -
ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ
[ 19-04-2024]
రైతులకు ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ పేర్కొన్నారు. -
లక్ష్యం అధిగమించి.. ఆర్థికంగా ఎదిగి
[ 19-04-2024]
మహిళా సంఘాలకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తోంది. ఈ అవకాశాన్ని చాలా మంది మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. -
ఇక ప్రచార హోరు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఇక హోరెత్తనుంది. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరు పెంచేందుకు సిద్ధమయ్యారు. -
బీఫాం అందుకున్న బాజిరెడ్డి
[ 19-04-2024]
నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు అధినేత కేసీఆర్ హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం బీఫాం అందజేశారు. -
రూ.52.71 లక్షల నగదు.. 16,547 లీటర్ల మద్యం పట్టివేత
[ 19-04-2024]
సాధారణ ఎన్నికల షెడ్యూల్ మార్చి 16న విడుదలైంది. ఆ రోజు నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. -
ఇద్దరు సీఐలపై వేటు
[ 19-04-2024]
కమిషనరేట్ పరిధిలో ఇద్దరు సీఐలపై గురువారం సస్పెన్షన్ వేటు పడింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ను తప్పించేందుకు పంజాగుట్ట సీఐని సంప్రదించినట్లు విచారణలో తేలడంతో అప్పటి బోధన్ సీఐ ప్రేమ్కుమార్ సస్పెండ్ చేశారు. -
హైకోర్టును ఆశ్రయించిన సాహిల్
[ 19-04-2024]
హైదరాబాద్ పంజాగుట్ట వద్ద బారీకేడ్లను ఢీకొట్టిన రోడ్డు ప్రమాద ఘటనలో నిందితుడిగా చేర్చడాన్ని సవాలు చేస్తూ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ అలియాస్ రాహిల్ హైకోర్టును ఆశ్రయించారు. -
అరచేతిలో ఎన్నికల సమాచారం
[ 19-04-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎక్కడైనా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, డబ్బుల పంపిణీ చేస్తే ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా? -
‘పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి’
[ 19-04-2024]
నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉందని’ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబుకు విజ్ఞప్తి చేశారు. -
హ్యాట్రిక్ వీరులు ఇద్దరు
[ 19-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరు వ్యక్తులు వరుసగా మూడు సార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 1952లో హరీశ్ చంద్ర హెడా కాంగ్రెస్ తరఫున విజయం సాధించి మొదటి సారి లోక్సభ సభ్యుడిగా అడుగు పెట్టారు. -
విద్యార్థులు.. సైబర్ రక్షకులు
[ 19-04-2024]
పెరిగిన సాంకేతికత, చరవాణులు అందరికీ చేరువై అన్ని రంగాల్లో సేవలు సులభమయ్యాయి. కానీ అదే సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగత డేటా, ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి సైబర్ మోసగాళ్లు డబ్బులు అపహరిస్తున్నారు. -
ఆకాశవాణి మీకోసం..
[ 19-04-2024]
పిల్లలూ.. మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు మొదలుకానున్నాయి.. ఇంటి వద్దే ఉంటూ చరవాణిలో వీడియో గేమ్స్ ఆడుకుంటూ సమయాన్ని వృథా చేయకండి. -
ద్విచక్రవాహనాల దొంగ అరెస్టు
[ 19-04-2024]
ట్రాక్టర్ నడుపుకొంటూ జీవనం సాగించే వ్యక్తి అక్రమంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో ద్విచక్ర వాహనాలను దొంగతనాలు చేసి తనిఖీల్లో ఒకటో ఠాణా పోలీసులకు దొరికిపోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ