ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధార్ నమోదు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన శిశువులకు అక్కడే ఆధార్ నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పుట్టిన వెంటనే కార్డు సిద్ధం
న్యూస్టుడే, నిజామాబాద్ వైద్యవిభాగం
జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వివరాలు నమోదు చేస్తున్న సిబ్బంది
ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన శిశువులకు అక్కడే ఆధార్ నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంతో పోల్చితే సర్కారు దవాఖానాల్లో ప్రసవాలు పెరిగాయి. అయితే పిల్లల ఆధార్ నమోదుపై తల్లిదండ్రులు దృష్టి సారించడం లేదు. మారుమూల ప్రాంతాల్లోని వారికి ఇవన్నీ తెలియడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం చైల్డ్ ఎన్రోల్మెంట్ క్లైంట్ విధానాన్ని తీసుకొచ్చింది. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ దవాఖానాల్లో శిశువుల ఆధార్ నమోదు చేస్తున్నారు.
శిశువు చిత్రాలతో..
కేసీఆర్ కిట్ల పంపిణీ ప్రక్రియ బాధ్యతలు చూసే డేటా ఎంట్రీ ఆపరేటర్లకే ఆధార్ నమోదుపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. బయోమెట్రిక్ పరికరం, ట్యాబ్తో పాటు అవసరమైన పరికరాలు సమకూర్చారు. శిశువు చిత్రంతో పాటు తల్లి, తండ్రి బయోమెట్రిక్ తీసుకుని వివరాలు నమోదు చేయగానే నంబరు వస్తుంది. దీని ద్వారా ఎక్కడైనా ఆధార్ ధ్రువీకరణ పత్రాన్ని ప్రింట్ తీసుకోవచ్చు. తల్లి పేరుతో బేబి ఆఫ్ మదర్ అని నమోదవుతోంది. శిశువుకు పేరు పెట్టిన తర్వాత అదే నంబరుతో ఆధార్ను నవీకరించుకునే అవకాశం కల్పిస్తున్నారు.
మొరాయిస్తున్న పరికరాలు
జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సిబ్బందికి రెండు ట్యాబ్లు ఇవ్వగా.. ఒకటి పనిచేయడం లేదు. కొన్ని సందర్భాల్లో నెట్వర్క్ సమస్య, తదితర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బోధన్ దవాఖానాలో ట్యాబ్లు మొరాయించడంతో ప్రక్రియ నిలిచిపోయింది.
సిబ్బందికి శిక్షణ ఇచ్చాం
..ప్రతిమారాజ్, ఆసుపత్రి సూపరింటెండెంట్
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కేసీఆర్ కిట్లు పంపిణీ చేసే సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. వారితోనే ఆధార్ నమోదు చేయిస్తున్నాం. పక్కాగా పర్యవేక్షిస్తున్నాం.
గతేడాది ఆధార్ నమోదు చేసిన వివరాలు..
సెప్టెంబరు 147
అక్టోబరు 344
నవంబరు 300
డిసెంబరు 469
జనవరి(2023) 95
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారతీయ జనతా పార్టీ నూతన కార్యవర్గం ఎన్నిక
[ 28-03-2024]
జహీరాబాద్ పార్లమెంట్ అసెంబ్లీ కో ఆర్డినేటర్ మహారాజుల మురళి ఆధ్వర్యంలో భాజపా మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. -
ప్రజలు తమ ఓటుని నిర్భయంగా వినియోగించుకోవాలి
[ 28-03-2024]
ఓటర్లలో చైతన్యం పెంచేందుకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు స్వీప్ (సిస్టమటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్) కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఎల్లారెడ్డి ఆర్డీవో, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ప్రభాకర్ తెలిపారు. -
జీవశాస్త్రం పరీక్షకు 100 శాతం విద్యార్థుల హాజరు
[ 28-03-2024]
పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా జీవశాస్త్రం పరీక్ష గురువారం నిర్వహించారు. -
మీ ఓటు ఉందా?
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. కొన్ని రోజుల్లో హడావుడి మొదలవుతుంది. అధికారులు అంతా తీరిక లేకుండా ఉంటారు. ఇప్పుడు ఉన్న ఓటు అప్పుడు లేదంటే ఎవరూ పట్టించుకోరు. -
ఔషధ దుకాణాలపై నజర్
[ 28-03-2024]
గతంలో ఏ జిల్లావారు అక్కడే తనిఖీలు చేసేవారు. కానీ గతేడాది నుంచి జంబ్లింగ్ పద్ధతిని పాటిస్తున్నారు. ప్రతి నెల మొదటి వారంలో ఇతర జిల్లాల అధికారులు నిజామాబాద్లో, ఇక్కడి వారు వేరేచోట తనిఖీలు చేస్తున్నారు. -
సమృద్ధిగా జలం... ఆయకట్టుకు జీవం
[ 28-03-2024]
రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల్లో నీటినిల్వలు అడుగంటిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టుల కింద నిర్దేశిత ఆయకట్టుకు నీటిని అందించలేని పరిస్థితి నెలకొంది. చేతికంది వచ్చిన పంటలు ఎండిపోయి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
నిజామాబాద్ బరిలో జీవన్రెడ్డి
[ 28-03-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అందరూ అనుకున్నట్లుగానే తాటిపర్తి జీవన్రెడ్డిని బరిలోకి దింపనుంది. ఈయన అభ్యర్థిత్వాన్ని అధిష్ఠానం బుధవారం రాత్రి ఖరారు చేసింది. -
‘అవినీతికి చిరునామా కాంగ్రెస్’
[ 28-03-2024]
అవినీతికి చిరునామా కాంగ్రెస్ పార్టీ అని భారాస జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి విమర్శించారు. భారాస జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. -
కొమ్మును కొట్టేస్తున్నారు!
[ 28-03-2024]
అత్యంత పవిత్రంగా భావించే పసుపు పంటను చోరీ చేస్తే ఏదీ కలిసిరాదంటారు. కానీ, నిత్యం నిఘా కెమోరాలు పనిచేసే చోట చోరీ జరుగుతోంది. బంగారంతో పోటీ పడుతున్న పసుపు కొనుగోళ్లు జరిగే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో. -
వలసలతో పరేషాన్..!
[ 28-03-2024]
కాంగ్రెస్లోకి వలసలు రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
డబ్బులు ఎప్పుడొస్తాయో..!
[ 28-03-2024]
‘చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు వెంకట్రెడ్డి. తాడ్వాయి మండలం బ్రహ్మణపల్లి నివాసి. ధరణి పోర్టల్ ప్రారంభమైనప్పుడు భూమి కొనుగోలు చేద్దామని మీ-సేవకేంద్రంలో స్లాటు బుక్చేసుకున్నారు. -
టెట్కు సమాయత్తం
[ 28-03-2024]
సర్కారు ఇటీవల మెగా డీఎస్సీ ప్రకటించింది. గత ప్రభుత్వం 2023లో విడుదల చేసిన ప్రకటనను రద్దు చేసి అప్పటి పోస్టులకు మరిన్ని కలిపి ఇటీవల ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్