భక్తుల కొంగుబంగారం బడాపహాడ్
ఉర్సు ఉత్సవాలకు బడాపహాడ్ దర్గా ముస్తాబైంది. సయ్యద్ హజరత్ షాదుల్లా బాబా దర్గా వర్ని మండలంలోని జలాల్పూర్ గ్రామపంచాయతీ పరిధి బడాపహాడ్లో ఉంది.
నేటి నుంచి ఉర్సు
న్యూస్టుడే, వర్ని
దర్గాకు వెళ్లే మెట్ల మార్గం
ఉర్సు ఉత్సవాలకు బడాపహాడ్ దర్గా ముస్తాబైంది. సయ్యద్ హజరత్ షాదుల్లా బాబా దర్గా వర్ని మండలంలోని జలాల్పూర్ గ్రామపంచాయతీ పరిధి బడాపహాడ్లో ఉంది.
చరిత్ర..
నిజాం ప్రభువులు పాలించే కాలంలో నల్గొండ జిల్లాలో సయ్యద్ హజరత్ షాదుల్లా తహసీల్దార్గా విధులు నిర్వహించేవారు. ఆ సమయంలో అక్కడ కరవు కాటకాలు తాండవించాయి. అలంగిరి జవాన్లకు ప్రజల సమస్యలు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఖజానా డబ్బును ప్రజలకు పంచిపెట్టారు. ఆగ్రహించిన జవాన్లు షాదుల్లాను బంధించాలని ప్రయత్నించారు. ఆ సమయంలో ఆయన వర్ని మండలం జలాల్పూర్ గ్రామ శివారులో ఉన్న పెద్దగుట్ట ప్రాంతానికి వచ్చారు. అక్కడే ఉంటూ భగవంతుడ్ని ప్రార్థిస్తూ జీవనం సాగించేవారు. పులి, కుక్క, పిల్లి, గుర్రం తదితర జంతువులు ఆయన వెంట ఉండేవి. షాదుల్లా ధ్యానంతో రాళ్ల నుంచి నీరు రావడం, ప్రజలకు మంచి జరగడంతో సయ్యద్ హజరత్ షాదుల్లా బాబాగా పేరొందారు. కొన్నేళ్ల తర్వాత ఆయన పెద్దగుట్టపై సమాధి కావడంతో కులమతాలకు అతీతంగా ప్రజలు బాబాను పూజిస్తూ కోరికలు కోరుకునేవారు. అవి నెరవేరడంతో భక్తుల సంఖ్య పెరిగింది. రాష్ట్రం నుంచే కాక మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు.
మూడు రోజులపాటు..
ఏటా మూడు రోజుల పాటు ఉర్సు ఉత్సవాలను బడాపహాడ్ పుణ్యక్షేత్రంలో చేయడం ప్రత్యేకత. ఉర్దూ కాలమానిని ప్రకారం రజబ్ 10 తర్వాత వచ్చే తేదీల్లో నిర్వహిస్తారు. ఈ ఏడాది 2, 3, 4 తేదీల్లో ఘనంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు.
రామన్నలొంక ఆలయం ప్రసిద్ధి...
బడాపహాడ్ పుణ్యక్షేత్రానికి వెళ్లే ప్రవేశ ద్వారం దాటిన తర్వాత కుడి వైపున ఉన్న శ్రీ బుగ్గ రామాలయం శ్రీరామన్నలొంకగా కొన్ని శతాబ్దాలుగా ప్రసిద్ధి చెందింది. పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తులు బుగ్గ రామాలయాన్ని కులమతాలకు అతీతంగా దర్శించుకుంటారు. 300 సంవత్సరాల క్రితం నంది, శివుని లింగం వెలియడంతో భక్తులు పూజలు జరిపేవారు. పెద్దగుట్ట పైనున్న నవాజ్పహాడ్లో రాళ్ల మధ్యలో నుంచి ప్రవహించే నీరు నంది, శివలింగం ఉన్న బావి ప్రాంతంలోకి చేరి నీటి బుగ్గలు ఏర్పడేవి. ఆ నీటిని తాగితే దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయనే విశ్వాసం భక్తుల్లో ఉంది. వేడుకల నిర్వహణకు వక్ఫ్బోర్డు నుంచి రూ.14 లక్షల నిధులు మంజూరయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్లో చేరిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికల వేళ జహీరాబాద్ పార్లమెంట్ పరిధి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
మతోన్మాద పార్టీలకు గుణపాఠం చెప్పాలి
[ 25-04-2024]
సీపీఎం కామారెడ్డి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. -
ప్రపంచ మలేరియా దినోత్సవ అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
భాజపా ఎన్నికల ప్రచారం
[ 25-04-2024]
ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపే విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నారని భాజపా మండల ప్రధాన కార్యదర్శి నరేష్ పేర్కొన్నారు. -
ఓటే వజ్రాయుధం
[ 25-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. -
6 గ్యారంటీ పథకాలే కాంగ్రెస్ను గెలిపిస్తాయి
[ 25-04-2024]
ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెత్కర్ కు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇంటర్లో అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ 27వ స్థానంలో, ద్వితీయంలో 29వ స్థానంలో నిలిచింది. -
సమాయత్తం.. ఓట్లపైనే చిత్తం
[ 25-04-2024]
లోక్సభ నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ నామ పత్రాలు దాఖలు చేశారు. -
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. -
ఫిర్యాదులపై పెరిగిన చైతన్యం
[ 25-04-2024]
ఎన్నికల నియమాలు, ఉల్లంఘనలపై పౌరుల్లో చైతన్యం పెరిగింది. ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల్ కమిషన్ 1950 కాల్సెంటర్, సీ-విజిల్ యాప్ను రూపొందించిన విషయం తెలిసిందే -
రాష్ట్రంలో చివరి స్థానం
[ 25-04-2024]
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫలితాలు నిరాశపరిచాయి. తొలిసారిగా రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. 35వ స్థానంలో నిలిచింది. -
ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం
[ 25-04-2024]
ఎల్లారెడ్డి బల్దియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. -
కళాశాలల తనిఖీలకు వేళాయె
[ 25-04-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 2024-25 నూతన విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ కోసం ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల తనిఖీలు గురువారం నుంచి చేపట్టనున్నారు. -
కోడ్ ముగిశాకే.. సవరణకు అవకాశం
[ 25-04-2024]
ఎన్నికల కోడ్ రాకముందే ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. -
అదరగొట్టారు..
[ 25-04-2024]
కుటుంబ నేపథ్యం ఏదైనా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని అహర్నిశలు కష్టపడ్డారు. నిపుణుల వద్ద సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రణాళికబద్ధంగా చదివారు. పరీక్షలు రాశారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!