బాధితులే.. నిందితులై!2 డబ్బుల కోసం కుటుంబం అపహరణనిర్మల్ పట్టణం, న్యూస్టుడే: తక్కువ ధరకు బంగారం వస్తుందని ఓ మోసగాడి మాటలకు ఆశపడి పెద్దమొత్తంలో డబ్బులు చెల్లించి, తీరా మోసపోయామని గుర్తించిన వారు.. నగదు తిరిగివ్వాలని కోరారు. నెలలు గడుస్తున్నా స్పందన లేకపోవడంతో.. అందరూ కలిసి సదరు వ్యక్తి కుటుంబాన్ని అపహరించారు. ఈ క్రమంలో పోలీసులకు చిక్కి నిందితులుగా మారారు. నిర్మల్ డీఎస్పీ జీవన్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం దూద్గాంకు చెందిన అబ్దుల్ అన్వర్ వృత్తిరీత్యా వ్యాపారి. 2019లో ఇతడు తాను దుబాయ్ వెళ్లొచ్చానని, తనవద్ద ఉన్న బంగారాన్ని మార్కెట్ ధర కన్నా తక్కువకే ఇస్తానంటూ దూరపు బంధువైన నబీ షాబ్ అలియాస్ మహ్మద్ నబీకి నమ్మబలికాడు. నబీ తనకు తెలిసిన మహ్మద్ అలీం, అబ్దుల్ గఫర్, మహ్మద్ ఖాజాషఫియుద్దీన్, మహ్మద్ అబ్దుల్ షౌకత్, విక్రాంత్, బచ్చు గంగాసాగర్, నజీర్, ఖలీల్, యూనుస్, సమికి విషయం చెప్పాడు. అందరూ కలిసి సుమారు రూ.10 కోట్లు అన్వర్కు ఇచ్చారు. వారికి కొంత బంగారం ఇచ్చి మిగతాది ఇవ్వకుండా, డబ్బులు తిరిగిచ్చేయకుండా దాదాపు ఆరు నెలలుగా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాధితులంతా అతడి కోసం గాలించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో అన్వర్ నిర్మల్ పట్టణం గాయత్రీపురంలో బంధువుల ఇంట్లో ఉంటున్నాడనే సమాచారం తెలుసుకుని అతడిని పట్టుకొని ఎలాగైనా డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం ఆదివారం రాత్రి నిర్మల్కు చేరుకున్నారు. అన్వర్ ఉంటున్న నివాసానికి వెళ్లి అతడిని, అతని భార్య, ఇద్దరు పిల్లలను బలవంతంగా అపహరించి తీసుకెళ్లారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ సమీపంలోని మిత్రుడి రైస్మిల్లులో వారిని బంధించారు. కోపంతో అతడిపై దాడిచేశారు. చంపేస్తామని బెదిరించారు. ఈలోపు అన్వర్ బంధువులు కిడ్నాప్ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుసుకొని భయపడ్డారు. మహారాష్ట్రలోని నాగ్పూర్ వెళ్తే పోలీసులకు దొరకమని బుధవారం రెండు కార్లలో బయల్దేరారు. ఉదయం 6.30 గంటల ప్రాంతంలో నిర్మల్ పట్టణం సోఫినగర్ ప్రాంతంలో కాలకృత్యాల కోసం ఆగిఉన్న విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు.. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2 కార్లు, 7 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. మరో అయిదుగురు పరారీలో ఉన్నారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వివరించారు. బందీగా ఉన్న కుటుంబాన్ని క్షేమంగా తీసుకొచ్చారు. సమావేశంలో పట్టణ సీఐ మల్లేశ్, ఎస్సైలు గంగాధర్, యాసిర్ అరాఫత్ ఉన్నారు.వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ జీవన్రెడ్డి
తక్కువ ధరకు బంగారం వస్తుందని ఓ మోసగాడి మాటలకు ఆశపడి పెద్దమొత్తంలో డబ్బులు చెల్లించి, తీరా మోసపోయామని గుర్తించిన వారు.. నగదు తిరిగివ్వాలని కోరారు. నెలలు గడుస్తున్నా స్పందన లేకపోవడంతో.. అందరూ కలిసి సదరు వ్యక్తి కుటుంబాన్ని అపహరించారు.
డబ్బుల కోసం కుటుంబం అపహరణ
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ జీవన్రెడ్డి
నిర్మల్ పట్టణం, న్యూస్టుడే: తక్కువ ధరకు బంగారం వస్తుందని ఓ మోసగాడి మాటలకు ఆశపడి పెద్దమొత్తంలో డబ్బులు చెల్లించి, తీరా మోసపోయామని గుర్తించిన వారు.. నగదు తిరిగివ్వాలని కోరారు. నెలలు గడుస్తున్నా స్పందన లేకపోవడంతో.. అందరూ కలిసి సదరు వ్యక్తి కుటుంబాన్ని అపహరించారు. ఈ క్రమంలో పోలీసులకు చిక్కి నిందితులుగా మారారు. నిర్మల్ డీఎస్పీ జీవన్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం దూద్గాంకు చెందిన అబ్దుల్ అన్వర్ వృత్తిరీత్యా వ్యాపారి. 2019లో ఇతడు తాను దుబాయ్ వెళ్లొచ్చానని, తనవద్ద ఉన్న బంగారాన్ని మార్కెట్ ధర కన్నా తక్కువకే ఇస్తానంటూ దూరపు బంధువైన నబీ షాబ్ అలియాస్ మహ్మద్ నబీకి నమ్మబలికాడు. నబీ తనకు తెలిసిన మహ్మద్ అలీం, అబ్దుల్ గఫర్, మహ్మద్ ఖాజాషఫియుద్దీన్, మహ్మద్ అబ్దుల్ షౌకత్, విక్రాంత్, బచ్చు గంగాసాగర్, నజీర్, ఖలీల్, యూనుస్, సమికి విషయం చెప్పాడు. అందరూ కలిసి సుమారు రూ.10 కోట్లు అన్వర్కు ఇచ్చారు. వారికి కొంత బంగారం ఇచ్చి మిగతాది ఇవ్వకుండా, డబ్బులు తిరిగిచ్చేయకుండా దాదాపు ఆరు నెలలుగా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాధితులంతా అతడి కోసం గాలించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో అన్వర్ నిర్మల్ పట్టణం గాయత్రీపురంలో బంధువుల ఇంట్లో ఉంటున్నాడనే సమాచారం తెలుసుకుని అతడిని పట్టుకొని ఎలాగైనా డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం ఆదివారం రాత్రి నిర్మల్కు చేరుకున్నారు. అన్వర్ ఉంటున్న నివాసానికి వెళ్లి అతడిని, అతని భార్య, ఇద్దరు పిల్లలను బలవంతంగా అపహరించి తీసుకెళ్లారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ సమీపంలోని మిత్రుడి రైస్మిల్లులో వారిని బంధించారు. కోపంతో అతడిపై దాడిచేశారు. చంపేస్తామని బెదిరించారు. ఈలోపు అన్వర్ బంధువులు కిడ్నాప్ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుసుకొని భయపడ్డారు. మహారాష్ట్రలోని నాగ్పూర్ వెళ్తే పోలీసులకు దొరకమని బుధవారం రెండు కార్లలో బయల్దేరారు. ఉదయం 6.30 గంటల ప్రాంతంలో నిర్మల్ పట్టణం సోఫినగర్ ప్రాంతంలో కాలకృత్యాల కోసం ఆగిఉన్న విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు.. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2 కార్లు, 7 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. మరో అయిదుగురు పరారీలో ఉన్నారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వివరించారు. బందీగా ఉన్న కుటుంబాన్ని క్షేమంగా తీసుకొచ్చారు. సమావేశంలో పట్టణ సీఐ మల్లేశ్, ఎస్సైలు గంగాధర్, యాసిర్ అరాఫత్ ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇందూరు నగరం.. కాషాయ వనం
[ 24-04-2024]
మనసంతా పవనసుతుని నామ జపం.. తనువంతా ఆధ్యాత్మికం.. అయోధ్య రాముడి బంటుగా.. సీతమ్మ జాడను అందించిన హనుమంతుడిపై ఇందూరు ప్రజలు తమ భక్తిని చాటుకున్నారు. -
ప్రణాళికతో సద్వినియోగం
[ 24-04-2024]
సెలవులు వచ్చాయంటే పిల్లలకు భలే సరదా.. చిందులు, సరదాలు, బంధువుల ఇళ్లకు వెళ్లి ఉరకలేసే సమయం. ఆనందం మాత్రమే చూసుకుంటే ఒక్కోసారి విషాదం, ఆందోళనకు దారి తీయొచ్చు. -
సాగర్లో పూడిక.. తొలగించాలిక
[ 24-04-2024]
ఉమ్మడి జిల్లా వరదాయిని నిజాంసాగర్లో పూడిక పేరుకుపోయింది. ప్రస్తుతం 17 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్నట్లు అధికారులు చెబుతున్నా.. ఆ స్థాయిలో నీరు లేదు. -
వరికే ప్రాధాన్యం
[ 24-04-2024]
రానున్న వర్షాకాలంలో నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయనే వాతావరణ శాఖ సమాచారంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది సైతం సమృద్ధిగా వానలు పడితే జలాశయాలు నిండి పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరివ్వొచ్చనే అంచనాలతో వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. -
సంగ్రామానికి సమష్టిగా..
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల పోరు ఊపందుకొంది. అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార వేగాన్ని పెంచుతున్నారు. -
సమాచారం అరచేతిలో..
[ 24-04-2024]
ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఎప్పటికప్పుడు అనేక మార్పులు వస్తున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం నూతన సంస్కరణలకు నాంది పలికింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో యంత్రాంగం సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటోంది. -
బాలాగౌడ్కు అత్యల్పం.. రాంగోపాల్రెడ్డికి అత్యధికం
[ 24-04-2024]
ఎన్నికల్లో ఒక్క ఓటు అనేది ఎంతో కీలకం. ఒక్క ఓటుతోనే ఫలితం తారుమారు కావచ్చు. చాలా మంది ఓటుహక్కును వినియోగించుకోవడం లేదు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరూ ఎంపీలు స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. -
పోలింగ్శాతంపై అభ్యర్థుల బెంగ
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో నమోదయ్యే పోలింగ్శాతంపై అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఏప్రిల్లోనే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. -
ఐదో రోజు తొమ్మిది నామినేషన్లు
[ 24-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఐదో రోజైన మంగళవారం తొమ్మిది మంది నామినేషన్లు వేశారు. అశోక్గౌడ్(బహుజన్ లెఫ్ట్ పార్టీ), పోతు నవీన్(ఆలిండియా బీసీ, ఓబీసీ పార్టీ), నాగార్జున్(ప్రజా సేన పార్టీ), ఎండీ.షాహెద్ ఖాన్(ఆలిండియా నేషనల్ పార్టీ), గోలి నరేష్(దళిత బహుజన పార్టీ), శక్తి ప్రసాద్, బీబీ నాయక్, మహ్మద్ జమీల్, సాయికృష్ణ(స్వతంత్ర) నామపత్రాలను రిటర్నింగ్ అధికారి రాజీవ్గాంధీ హన్మంతుకు అందజేశారు. -
ఓట్లు ఎక్కువ.. ప్రాతినిధ్యం తక్కువ
[ 24-04-2024]
పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. రాజకీయ రంగంలోకి వచ్చేసరికి సర్పంచి నుంచి జడ్పీ ఛైర్పర్సన్ వరకు ఇలా వివిధ పదవుల్లో రాణిస్తున్నారు. -
కార్యకర్తలపైనే ప్రచార బాధ్యతలు
[ 24-04-2024]
నామపత్రాల దాఖలు గడువు చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గతానికి భిన్నంగా జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మొదటిసారి త్రిముఖపోరు నెలకొంది. -
పర్యవేక్షిస్తేనే ఆదాయం
[ 24-04-2024]
బల్దియాల నుంచి అనుమతులు పొందకుండానే ప్రధాన కూడళ్లతోపాటు ఆయా రోడ్ల పక్కన ప్రచార బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఈ దిశగా అడుగులు పడటంలేదు. -
200 మందికి ఉపాధి లక్ష్యం
[ 24-04-2024]
గ్రామాల్లో ఉపాధి పనుల జోరు పెంచాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి గ్రామ పంచాయతీలో 200 మంది కూలీల కంటే ఎక్కువగా హాజరు ఉండాలని పేర్కొంది. దీంతో జిల్లా యంత్రాంగం ఉపాధి కూలీల సంఖ్య పెరగడంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది