బడ్జెట్పై తెవివి ఆశలు
‘‘త్వరలో ప్రకటించే రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులపై తెలంగాణ విశ్వవిద్యాలయం ఎంతో ఆశతో ఉంది. 2023-24లో రూ.140 కోట్లకు పైగా కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వర్సిటీ అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వానికి రూ. 140 కోట్ల ప్రతిపాదనలు
న్యూస్టుడే, తెవివి క్యాంపస్: ‘‘త్వరలో ప్రకటించే రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులపై తెలంగాణ విశ్వవిద్యాలయం ఎంతో ఆశతో ఉంది. 2023-24లో రూ.140 కోట్లకు పైగా కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వర్సిటీ అధికారులు చెబుతున్నారు. ఇందులో బ్లాక్గ్రాంట్ కింద రూ.73.47 కోట్లు, డెవలప్మెంట్ కోసం రూ.67.06 కోట్లు పొందుపర్చినట్లు తెలిసింది. మరి సర్కారు కేటాయింపులు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.’’
అంతంత మాత్రమే..!
ఏటా బడ్జెట్లో విశ్వవిద్యాలయాలకు కేటాయింపులు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. 2014 ఏడాది నుంచి డెవలప్మెంట్ గ్రాంట్ను కేటాయించడం లేదు. ఫలితంగా యూనివర్సిటీలో నూతన భవనాల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కల్పన మరుగున పడినట్లైందని వర్సిటీ ఉద్యోగులు, విద్యార్థులు వాపోతున్నారు.
ఇదొక్కటే దిక్కు
గత కొన్నేళ్లుగా యూనివర్సిటీలకు వేతనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్గ్రాంట్ను మాత్రమే కేటాయిస్తోంది. వీటిని నెలవారీగా విడుదల చేస్తోంది. ప్రతినెల తెవివిలోని రెగ్యులర్, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు, సిబ్బంది వేతనాలకు రూ.2 కోట్లకు పైగా చెల్లింపులు అవుతున్నాయి.
నిధులు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నాం
డెవలప్మెంట్ గ్రాంట్స్ కోసం ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వం బడ్జెట్లో వేతనాల కోసం మాత్రమే బ్లాక్గ్రాంట్ కేటాయిస్తోంది. తెవివిలో భవనాల నిర్మాణం కోసం సైన్స్, టెక్నాలజీ, ఐసీఎస్ఎస్ఆర్, యూజీసీతో పాటు విదేశీ సంస్థల నుంచి నిధులు రాబట్టేలా సొంతంగా ప్రయత్నాలు చేస్తున్నా.
ఆచార్య రవీందర్, తెవివి ఉపకులపతి
భవనాల కొరత
రాష్ట్రంలో మూడో అతిపెద్ద యూనివర్శిటీగా తెవివికి పేరున్నప్పటికీ ఆ స్థాయిలో వసతుల కల్పనకు నోచుకోకపోవడం దురదృష్టకరం. ఇక్కడ భవనాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈసారైనా డెవలప్మెంట్ నిధులు వస్తే కొన్నింటికైనా మోక్షం లభిస్తుంది.
* సైన్స్ కళాశాలకు సొంతగూడు లేదు.
* వర్సిటీ ఆవిర్భవించి 17 ఏళ్లు అవుతున్నా పరీక్షల విభాగానికి ప్రత్యేక భవనం లేకపోవడం గమనార్హం.
* ఇపుడున్న మహిళా వసతి గృహంలో బాలికలు కిక్కిరిసి తలదాచుకుంటున్న దుస్థితి.
* ఆడిటోరియం లేక అంతర్జాతీయ సదస్సులకు ఇబ్బందిగా మారింది. గతేడాది ఓ కాన్ఫరెన్స్ను నిజామాబాద్లోని ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించిన విషయం తెలిసిందే.
* ఇండోర్, అవుట్ డోర్ క్రీడా మైదానాల కొరత ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
6 గ్యారంటీ పథకాలే కాంగ్రెస్ను గెలిపిస్తాయి
[ 25-04-2024]
ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెత్కర్ కు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇంటర్లో అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ 27వ స్థానంలో, ద్వితీయంలో 29వ స్థానంలో నిలిచింది. -
సమాయత్తం.. ఓట్లపైనే చిత్తం
[ 25-04-2024]
లోక్సభ నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ నామ పత్రాలు దాఖలు చేశారు. -
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. -
ఫిర్యాదులపై పెరిగిన చైతన్యం
[ 25-04-2024]
ఎన్నికల నియమాలు, ఉల్లంఘనలపై పౌరుల్లో చైతన్యం పెరిగింది. ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల్ కమిషన్ 1950 కాల్సెంటర్, సీ-విజిల్ యాప్ను రూపొందించిన విషయం తెలిసిందే -
రాష్ట్రంలో చివరి స్థానం
[ 25-04-2024]
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫలితాలు నిరాశపరిచాయి. తొలిసారిగా రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. 35వ స్థానంలో నిలిచింది. -
ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం
[ 25-04-2024]
ఎల్లారెడ్డి బల్దియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. -
కళాశాలల తనిఖీలకు వేళాయె
[ 25-04-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 2024-25 నూతన విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ కోసం ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల తనిఖీలు గురువారం నుంచి చేపట్టనున్నారు. -
కోడ్ ముగిశాకే.. సవరణకు అవకాశం
[ 25-04-2024]
ఎన్నికల కోడ్ రాకముందే ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. -
అదరగొట్టారు..
[ 25-04-2024]
కుటుంబ నేపథ్యం ఏదైనా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని అహర్నిశలు కష్టపడ్డారు. నిపుణుల వద్ద సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రణాళికబద్ధంగా చదివారు. పరీక్షలు రాశారు.
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్