logo

పదేపదే నేరాలకు పాల్పడితే పీడీ యాక్టు

పదేపదే నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్టు ప్రయోగించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌ సూచించారు.

Published : 05 Feb 2023 05:09 IST

వీసీలో పాల్గొన్న సీపీ నాగరాజు, ఏసీపీలు

ఇందూరు సిటీ, న్యూస్‌టుడే: పదేపదే నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్టు ప్రయోగించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌ సూచించారు. ఆయన శనివారం నిర్వహించిన వీసీలో సీపీ నాగరాజుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది(జీపీ) ముజీబ్‌ పీడీ చట్టం విధానాలపై అవగాహన కల్పించారు. బయటి దేశాల నుంచి వచ్చే వారు నిబంధనలు పాటించేలా చూడాలని డీజీపీ ఆదేశించారు. ఏసీపీలు వెంకటేశ్వర్‌, ప్రభాకర్‌రావు, కిరణ్‌కుమార్‌, మధుసూదన్‌, నారాయణ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని