రసవత్తరంగా ప్రోకబడ్డీ పోటీలు
పట్టణంలోని మినీ స్టేడియంలో జరుగుతున్న ప్రో కబడ్డీ పోటీలు శనివారం రసవత్తరంగా సాగాయి. ఉమ్మడి జిల్లాలోని 16 జట్ల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగుతున్నాయి.
క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న సభాపతి పోచారం
బాన్సువాడ, న్యూస్టుడే: పట్టణంలోని మినీ స్టేడియంలో జరుగుతున్న ప్రో కబడ్డీ పోటీలు శనివారం రసవత్తరంగా సాగాయి. ఉమ్మడి జిల్లాలోని 16 జట్ల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగుతున్నాయి. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం వరకు, సాయంత్రం ఐదు నుంచి రాత్రి 10 గంటల వరకు సాగుతున్నాయి. రాత్రిజరిగిన పోటీలకు ముఖ్య అతిథిగా సభాపతి పోచారం హాజరై క్రీడాకారులను అభినందించారు. నిజామాబాద్ డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్రెడ్డి, నిర్వాహకులు పోచారం శంభురెడ్డిలతో పాటు రైతుబంధు జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి, పురపాలక సంఘం ఛైర్మన్ జంగం గంగాధర్, నాయకులు ఎజాజ్, గోపాల్రెడ్డి, భూషణ్రెడ్డి, భగవాన్రెడ్డి, వెంకట్రామ్రెడ్డి, బాబా, నారాయణరెడ్డి తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు, జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులు అక్కడే ఉండి పోటీలు ప్రశాంతంగా జరగడానికి కృషి చేస్తున్నారు.
జాతీయ సాఫ్ట్బాల్ టోర్నీకి ఎంపిక
డిచ్పల్లి, న్యూస్టుడే: ఒడిశా రాష్ట్రంలోని పూరిలో ఆదివారం నుంచి ఈ నెల 9 వరకు జరిగే 44వ సీనియర్ జాతీయ సాఫ్ట్బాల్ టోర్నీకి జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారని అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రభాకర్రెడ్డి, గంగామోహన్ తెలిపారు. మహిళా జట్టులో ఎల్.రాణి, జె.వైశాలి, కె.సృజన (సుద్దపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల), ఎ.ఇందు, ఎ.నందిని (పోచంపాడ్ గురుకుల), ఎస్.సౌమ్య, రాణి భూలబాయి (తాడ్వాయి గురుకుల), డి.మౌనిక (నిజామాబాద్ ట్రైబల్ డిగ్రీ) ఉన్నారు. బాలుర జట్టులో బి.సాయికుమార్ (రూప్లానాయక్ తండా), సెంథిల్ (సాఫ్ట్బాల్ అకాడమీ, ఆర్మూర్) ఉన్నారు. రాష్ట్ర జట్టులో జిల్లా క్రీడాకారులు ఉండటం సంతోషంగా ఉందని అధ్యక్ష, కార్యదర్శులు పేర్కొన్నారు.
ఎంపికైన క్రీడాకారులతో సాఫ్ట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీవశాస్త్రం పరీక్షకు 100 శాతం విద్యార్థుల హాజరు
[ 28-03-2024]
పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా జీవశాస్త్రం పరీక్ష గురువారం నిర్వహించారు. -
మీ ఓటు ఉందా?
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. కొన్ని రోజుల్లో హడావుడి మొదలవుతుంది. అధికారులు అంతా తీరిక లేకుండా ఉంటారు. ఇప్పుడు ఉన్న ఓటు అప్పుడు లేదంటే ఎవరూ పట్టించుకోరు. -
ఔషధ దుకాణాలపై నజర్
[ 28-03-2024]
గతంలో ఏ జిల్లావారు అక్కడే తనిఖీలు చేసేవారు. కానీ గతేడాది నుంచి జంబ్లింగ్ పద్ధతిని పాటిస్తున్నారు. ప్రతి నెల మొదటి వారంలో ఇతర జిల్లాల అధికారులు నిజామాబాద్లో, ఇక్కడి వారు వేరేచోట తనిఖీలు చేస్తున్నారు. -
సమృద్ధిగా జలం... ఆయకట్టుకు జీవం
[ 28-03-2024]
రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల్లో నీటినిల్వలు అడుగంటిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టుల కింద నిర్దేశిత ఆయకట్టుకు నీటిని అందించలేని పరిస్థితి నెలకొంది. చేతికంది వచ్చిన పంటలు ఎండిపోయి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
నిజామాబాద్ బరిలో జీవన్రెడ్డి
[ 28-03-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అందరూ అనుకున్నట్లుగానే తాటిపర్తి జీవన్రెడ్డిని బరిలోకి దింపనుంది. ఈయన అభ్యర్థిత్వాన్ని అధిష్ఠానం బుధవారం రాత్రి ఖరారు చేసింది. -
‘అవినీతికి చిరునామా కాంగ్రెస్’
[ 28-03-2024]
అవినీతికి చిరునామా కాంగ్రెస్ పార్టీ అని భారాస జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి విమర్శించారు. భారాస జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. -
కొమ్మును కొట్టేస్తున్నారు!
[ 28-03-2024]
అత్యంత పవిత్రంగా భావించే పసుపు పంటను చోరీ చేస్తే ఏదీ కలిసిరాదంటారు. కానీ, నిత్యం నిఘా కెమోరాలు పనిచేసే చోట చోరీ జరుగుతోంది. బంగారంతో పోటీ పడుతున్న పసుపు కొనుగోళ్లు జరిగే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో. -
వలసలతో పరేషాన్..!
[ 28-03-2024]
కాంగ్రెస్లోకి వలసలు రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
డబ్బులు ఎప్పుడొస్తాయో..!
[ 28-03-2024]
‘చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు వెంకట్రెడ్డి. తాడ్వాయి మండలం బ్రహ్మణపల్లి నివాసి. ధరణి పోర్టల్ ప్రారంభమైనప్పుడు భూమి కొనుగోలు చేద్దామని మీ-సేవకేంద్రంలో స్లాటు బుక్చేసుకున్నారు. -
టెట్కు సమాయత్తం
[ 28-03-2024]
సర్కారు ఇటీవల మెగా డీఎస్సీ ప్రకటించింది. గత ప్రభుత్వం 2023లో విడుదల చేసిన ప్రకటనను రద్దు చేసి అప్పటి పోస్టులకు మరిన్ని కలిపి ఇటీవల ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి