తరుగుకు చెక్..
రేషన్ బియ్యం తరుగుకు చెక్ పడనుంది. ఎంఎల్ఎస్ కేంద్రాల్లో జరిగే దోపిడీని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రజాపంపిణీలో పాటించే సాంకేతికతను వీటిల్లోనూ అమలు చేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి.
రేషన్ డీలర్లకు బయోమెట్రిక్
ఈ నెల నుంచే అమల్లోకి..
గత నెలలో ఎంఎల్ఎస్ కేంద్రం నుంచి రేషన్ దుకాణానికి వచ్చిన సంచి బరువు
న్యూస్టుడే, కామారెడ్డి కలెక్టరేట్: రేషన్ బియ్యం తరుగుకు చెక్ పడనుంది. ఎంఎల్ఎస్ కేంద్రాల్లో జరిగే దోపిడీని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రజాపంపిణీలో పాటించే సాంకేతికతను వీటిల్లోనూ అమలు చేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నెల నుంచే రేషన్ డీలర్లకు బయోమెట్రిక్ అమలు చేయనున్నారు. దీనికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. డీలర్లు ప్రతి నెల మండల స్థాయి గిడ్డంగికి వెళ్లి తన దుకాణంలోని కార్డుల ఆధారంగా కచ్చితమైన తూకంతో బియ్యం తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లావ్యాప్తంగా 578 రేషన్ దుకాణాలకు ఈ నెల నుంచి బయోమెట్రిక్ ఆధారంగా పంపిణీ చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
దోపిడీపై ఫిర్యాదులు
జిల్లావ్యాప్తంగా ఉన్న ఎంఎల్ఎస్ ఏడు కేంద్రాల నుంచి అన్ని రేషన్ దుకాణాలకు బియ్యాన్ని లారీల్లో పంపిస్తున్నారు. ప్రతి నెల తక్కువగా వస్తున్నాయని డీలర్లు పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. 50 కిలోల బస్తాలో 44- 49 కిలోలే ఉంటున్నాయని పేర్కొంటున్నారు. మండలస్థాయి గోదాముల్లో గన్నీ సంచులకు కావాలని రంధ్రాలు చేసి బియ్యం కిందపడిపోయే విధంగా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ మేరకు స్పందించిన ప్రభుత్వం డీలర్లకూ బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. లబ్ధిదారులు అందులో వేలిముద్ర వేసినప్పుడు ఈ-పాస్కు వేయింగ్ యంత్రానికి ఎలా అనుసంధానం చేశారో.. అదే విధంగా ఎంఎల్ఎస్ కేంద్రాల్లోనూ అమలు చేయనున్నారు. గతంలో పాఠశాలలకు బియ్యం సరఫరా చేసినప్పుడు తూకం తక్కువగా వస్తున్నాయని ఫిర్యాదులు రావడంతో ప్రధానోపాధ్యాయులకు ఇదే విధానం అమలు చేశారు. హెచ్ఎంలు ఎంఎల్ఎస్ కేంద్రాలకు వెళ్లి రావడంతో పాఠశాల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో సీఆర్పీలకు బయోమెట్రిక్ అప్పగించారు.
సాంకేతిక చిక్కులు
ఇందులో కొన్ని సాంకేతిక చిక్కులు ఎదురవుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. 578 రేషన్ దుకాణాలు ఉండగా అందులో 90 చోట్ల డీలర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇతర డీలర్లకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. కొందరికి రెండు, మూడు కేటాయించారు. చాలాచోట్ల బినామీ డీలర్లు దుకాణాలు నడుపుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం బయోమెట్రిక్ విధానం ద్వారా ఎంఎస్ఎస్ కేంద్రాల నుంచి బియ్యం సరఫరా చేయాలని భావిస్తే ఎవరు తీసుకుంటారో వేచిచూడాలి.
ఆనందంగా ఉంది
- రాజు, రేషన్డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు
రేషన్ డీలర్లకు బయోమెట్రిక్ విధానం అమలు చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి నెల బియ్యం తూకం తక్కువగా వచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కొత్త విధానంతో సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నా.
గిడ్డంగికి వెళ్లాల్సిందే..
- పద్మ, డీసీఎస్ఓ, కామారెడ్డి
ప్రక్రియ ప్రారంభించాం. కొన్ని సాంకేతిక ఇబ్బందులు అధిగమించి ముందుకెళ్తాం. ముందునుంచే డీలర్లను ఎంఎల్ఎస్ కేంద్రాలకు వచ్చి తూకం సరిగా ఉందో లేదో చూసుకోవాలని సూచిస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వమే అమలు చేయడంతో ఇక తప్పకుండా మండలస్థాయి గిడ్డంగికి వెళ్లాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పురపాలక ఛైర్మన్పై అవిశ్వాసం
[ 24-04-2024]
ఎల్లారెడ్డి పురపాలక ఛైర్మన్ కుడుముల సత్యనారాయణపై అవిశ్వాసం ప్రవేశపెట్టాలని భారాస పార్టీ కౌన్సిలర్లు తీర్మానించినట్లు తెలుస్తుంది. -
కాంగ్రెస్లో చేరిన పుర ఛైర్మన్
[ 24-04-2024]
పుర ఛైర్మన్ సత్యనారాయణ సంగారెడ్డిలో బుధవారం తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో కాంగ్రెస్లో చేరగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వారికి కాంగ్రెస్ కండువా వేసి పార్టీలో ఆహ్వానించారు. -
ఇందూరు నగరం.. కాషాయ వనం
[ 24-04-2024]
మనసంతా పవనసుతుని నామ జపం.. తనువంతా ఆధ్యాత్మికం.. అయోధ్య రాముడి బంటుగా.. సీతమ్మ జాడను అందించిన హనుమంతుడిపై ఇందూరు ప్రజలు తమ భక్తిని చాటుకున్నారు. -
ప్రణాళికతో సద్వినియోగం
[ 24-04-2024]
సెలవులు వచ్చాయంటే పిల్లలకు భలే సరదా.. చిందులు, సరదాలు, బంధువుల ఇళ్లకు వెళ్లి ఉరకలేసే సమయం. ఆనందం మాత్రమే చూసుకుంటే ఒక్కోసారి విషాదం, ఆందోళనకు దారి తీయొచ్చు. -
సాగర్లో పూడిక.. తొలగించాలిక
[ 24-04-2024]
ఉమ్మడి జిల్లా వరదాయిని నిజాంసాగర్లో పూడిక పేరుకుపోయింది. ప్రస్తుతం 17 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్నట్లు అధికారులు చెబుతున్నా.. ఆ స్థాయిలో నీరు లేదు. -
వరికే ప్రాధాన్యం
[ 24-04-2024]
రానున్న వర్షాకాలంలో నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయనే వాతావరణ శాఖ సమాచారంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది సైతం సమృద్ధిగా వానలు పడితే జలాశయాలు నిండి పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరివ్వొచ్చనే అంచనాలతో వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. -
సంగ్రామానికి సమష్టిగా..
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల పోరు ఊపందుకొంది. అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార వేగాన్ని పెంచుతున్నారు. -
సమాచారం అరచేతిలో..
[ 24-04-2024]
ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఎప్పటికప్పుడు అనేక మార్పులు వస్తున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం నూతన సంస్కరణలకు నాంది పలికింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో యంత్రాంగం సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటోంది. -
బాలాగౌడ్కు అత్యల్పం.. రాంగోపాల్రెడ్డికి అత్యధికం
[ 24-04-2024]
ఎన్నికల్లో ఒక్క ఓటు అనేది ఎంతో కీలకం. ఒక్క ఓటుతోనే ఫలితం తారుమారు కావచ్చు. చాలా మంది ఓటుహక్కును వినియోగించుకోవడం లేదు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరూ ఎంపీలు స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. -
పోలింగ్శాతంపై అభ్యర్థుల బెంగ
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో నమోదయ్యే పోలింగ్శాతంపై అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఏప్రిల్లోనే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. -
ఐదో రోజు తొమ్మిది నామినేషన్లు
[ 24-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఐదో రోజైన మంగళవారం తొమ్మిది మంది నామినేషన్లు వేశారు. అశోక్గౌడ్(బహుజన్ లెఫ్ట్ పార్టీ), పోతు నవీన్(ఆలిండియా బీసీ, ఓబీసీ పార్టీ), నాగార్జున్(ప్రజా సేన పార్టీ), ఎండీ.షాహెద్ ఖాన్(ఆలిండియా నేషనల్ పార్టీ), గోలి నరేష్(దళిత బహుజన పార్టీ), శక్తి ప్రసాద్, బీబీ నాయక్, మహ్మద్ జమీల్, సాయికృష్ణ(స్వతంత్ర) నామపత్రాలను రిటర్నింగ్ అధికారి రాజీవ్గాంధీ హన్మంతుకు అందజేశారు. -
ఓట్లు ఎక్కువ.. ప్రాతినిధ్యం తక్కువ
[ 24-04-2024]
పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. రాజకీయ రంగంలోకి వచ్చేసరికి సర్పంచి నుంచి జడ్పీ ఛైర్పర్సన్ వరకు ఇలా వివిధ పదవుల్లో రాణిస్తున్నారు. -
కార్యకర్తలపైనే ప్రచార బాధ్యతలు
[ 24-04-2024]
నామపత్రాల దాఖలు గడువు చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గతానికి భిన్నంగా జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మొదటిసారి త్రిముఖపోరు నెలకొంది. -
పర్యవేక్షిస్తేనే ఆదాయం
[ 24-04-2024]
బల్దియాల నుంచి అనుమతులు పొందకుండానే ప్రధాన కూడళ్లతోపాటు ఆయా రోడ్ల పక్కన ప్రచార బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఈ దిశగా అడుగులు పడటంలేదు. -
200 మందికి ఉపాధి లక్ష్యం
[ 24-04-2024]
గ్రామాల్లో ఉపాధి పనుల జోరు పెంచాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి గ్రామ పంచాయతీలో 200 మంది కూలీల కంటే ఎక్కువగా హాజరు ఉండాలని పేర్కొంది. దీంతో జిల్లా యంత్రాంగం ఉపాధి కూలీల సంఖ్య పెరగడంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది