Telangana Budget 2023: ఆశల ఊసులు
శాసనసభలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్పై ప్రజల్లో ఎన్నో ఆశలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఉభయ జిల్లాల్లో అసంపూర్తి సాగునీటి ప్రాజెక్టులు, నిర్మాణాలున్నాయి. విద్యారంగానికి ఇటీవలి కాలంలో ప్రాధాన్యం ఇస్తున్నారు.
నేడే రాష్ట్ర బడ్జెట్
కేటాయింపులపై ఆసక్తి
ఈనాడు డిజిటల్, కామారెడ్డి, న్యూస్టుడే, కామారెడ్డి పట్టణం
శాసనసభలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్పై ప్రజల్లో ఎన్నో ఆశలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఉభయ జిల్లాల్లో అసంపూర్తి సాగునీటి ప్రాజెక్టులు, నిర్మాణాలున్నాయి. విద్యారంగానికి ఇటీవలి కాలంలో ప్రాధాన్యం ఇస్తున్నారు. మన ఊరు.. మన బడి పథకం పనులు పూర్తి చేసేందుకు కాసుల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది.
కామారెడ్డి- ఎల్లారెడ్డి నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్యాకేజీ-22కి నాలుగేళ్లుగా నిధుల కేటాయింపు అంతంతమాత్రంగానే ఉంది. 20, 21 ప్యాకేజీలకు రూ.286 కోట్లు అవసరం. నిజాంసాగర్, పోచారం, కౌలాస్ జలాశయాలకు ఏటా అధికారులు ప్రతిపాదనలు పంపిస్తున్నా 10 శాతమైనా కేటాయింపులకు నోచుకోవడం లేదు. నిజాంసాగర్ ఆయకట్టుకు సాగు నీరందించే కాల్వలు శిథిలావస్థకు చేరాయి. ఫీల్డ్ఛానళ్లు కనుమరుగయ్యాయి. వీటి పునరుద్ధరణ కోసం ప్రతిపాదనలు పంపుతున్నా ఫలితం లేకుండా పోతోంది. ప్రధాన కాల్వ ఆధునికీకరణకు ఆమోదం తెలిపినా ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదు.
విశ్వవిద్యాలయం..
తెవివికి రూ.140 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు పంపారు. ఇందులో బ్లాక్గ్రాంట్ కింద రూ.73.47 కోట్లు, అభివద్ధి కోసం రూ.67.06 కోట్లు కావాలని అందులో పొందుపరిచారు. కొన్నేళ్లుగా అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదు. ఫలితంగా విశ్వవిద్యాలయంలో నూతన భవనాల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కల్పన కరవైందని విద్యార్థులు, ఉద్యోగులు వాపోతున్నారు.
నగర, పురపాలికలపై దృష్టి పెట్టేనా..
ఉభయ జిల్లాల్లో 1 నగరపాలకసంస్థ, 6 మున్సిపాలిటీలు ఉన్నాయి. పట్టణ ప్రగతి కింద రూ.6 కోట్ల మేర కేటాయిస్తున్నా.. సకాలంలో రాక అభివృద్ధి కుంటుపడుతోంది. పట్టణాల పరిధి పెరుగుతోంది. దానికి అనుగుణంగా మౌలిక వసతుల కల్పన అవసరం. నిజామాబాద్, కామారెడ్డిలో ఆస్తి, కుళాయి పన్ను రూపేణా రూ.82.15 కోట్లు సమకూరుతున్నా ఇవే మూలకూ సరిపోవడంలేదు.
విద్యుత్తు లోటు తీర్చేందుకు
వ్యవసాయ కనెక్షన్లు, ఉపకేంద్రాల ఏర్పాటు తదితర అవసరాలకు నిధులు కేటాయించాల్సిన అవసరముంది. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో తీగల మార్పు, నియంత్రికల ఏర్పాటుకు రూ.75 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా.
అసంపూర్తిగా మన ఊరు మన బడి
మన ఊరు మన బడి కింద ప్రభుత్వ పాఠశాలల్లో 12 రకాల వసతులను యంత్రాంగం సమకూర్చుతోంది. వీటిలో మరుగుదొడ్లు, వంటగదులు, ప్రహరీలు, అదనపు గదుల ఏర్పాటు, భవనాల మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. ఉభయ జిల్లాల్లో 856 బడులను ఈ పథకం కింద ఎంపిక చేయగా.. పూర్తిస్థాయిలో నిధులు మంజూరుకాక ఆపసోపాలు తప్పడం లేదు. ఇటీవల కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో 22 బడులనే ప్రారంభించారు. మిగతా పనులు పూర్తిచేయడానికి రూ.378 కోట్లు అవసరం.
వైద్యం మెరుగయ్యేనా..?
రెండు జిల్లాల్లో 226 పల్లె దవాఖానాలు ఏర్పాటు చేశారు. వీటిల్లో వైద్యులు, మల్టీపర్పస్ హెల్త్ ప్రొవైడర్లను నియమించారు. ఇందులో 50 శాతం వరకు పీజీ కోర్సుల్లో చేరడంతో పోస్టులు ఖాళీ అయ్యాయి. వీటి భర్తీతోపాటు పక్కా భవనాలు నిర్మించాల్సి ఉంది. ఆరోగ్య ఉపకేంద్రాల మరమ్మతులు చేపట్టాలి. నిజామాబాద్ బోధన ఆసుపత్రిలో వసతుల మెరుగునకు నిధులు అవసరం. కామారెడ్డి మాతాశిశుసంరక్షణ కేంద్రాన్ని రూ.20 కోట్లతో చేపడుతున్నారు. ఈ నిధులు విడతలవారీగా రావడంతో పనుల్లో కొంత జాప్యం జరుగుతోంది. వైద్యకళాశాల భవనానికి ఇప్పటికే రూ.236 కోట్లు కేటాయించారు. నిధుల విడుదలలో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలి. ఉభయ జిల్లాల్లోని డయాలసిస్ కేంద్రాల్లో మరో 50 పడకల పెంపునకు నిధుల ఆవశ్యకత ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పురపాలక ఛైర్మన్పై అవిశ్వాసం
[ 24-04-2024]
ఎల్లారెడ్డి పురపాలక ఛైర్మన్ కుడుముల సత్యనారాయణపై అవిశ్వాసం ప్రవేశపెట్టాలని భారాస పార్టీ కౌన్సిలర్లు తీర్మానించినట్లు తెలుస్తుంది. -
కాంగ్రెస్లో చేరిన పుర ఛైర్మన్
[ 24-04-2024]
పుర ఛైర్మన్ సత్యనారాయణ సంగారెడ్డిలో బుధవారం తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో కాంగ్రెస్లో చేరగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వారికి కాంగ్రెస్ కండువా వేసి పార్టీలో ఆహ్వానించారు. -
ఇందూరు నగరం.. కాషాయ వనం
[ 24-04-2024]
మనసంతా పవనసుతుని నామ జపం.. తనువంతా ఆధ్యాత్మికం.. అయోధ్య రాముడి బంటుగా.. సీతమ్మ జాడను అందించిన హనుమంతుడిపై ఇందూరు ప్రజలు తమ భక్తిని చాటుకున్నారు. -
ప్రణాళికతో సద్వినియోగం
[ 24-04-2024]
సెలవులు వచ్చాయంటే పిల్లలకు భలే సరదా.. చిందులు, సరదాలు, బంధువుల ఇళ్లకు వెళ్లి ఉరకలేసే సమయం. ఆనందం మాత్రమే చూసుకుంటే ఒక్కోసారి విషాదం, ఆందోళనకు దారి తీయొచ్చు. -
సాగర్లో పూడిక.. తొలగించాలిక
[ 24-04-2024]
ఉమ్మడి జిల్లా వరదాయిని నిజాంసాగర్లో పూడిక పేరుకుపోయింది. ప్రస్తుతం 17 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్నట్లు అధికారులు చెబుతున్నా.. ఆ స్థాయిలో నీరు లేదు. -
వరికే ప్రాధాన్యం
[ 24-04-2024]
రానున్న వర్షాకాలంలో నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయనే వాతావరణ శాఖ సమాచారంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది సైతం సమృద్ధిగా వానలు పడితే జలాశయాలు నిండి పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరివ్వొచ్చనే అంచనాలతో వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. -
సంగ్రామానికి సమష్టిగా..
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల పోరు ఊపందుకొంది. అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార వేగాన్ని పెంచుతున్నారు. -
సమాచారం అరచేతిలో..
[ 24-04-2024]
ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఎప్పటికప్పుడు అనేక మార్పులు వస్తున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం నూతన సంస్కరణలకు నాంది పలికింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో యంత్రాంగం సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటోంది. -
బాలాగౌడ్కు అత్యల్పం.. రాంగోపాల్రెడ్డికి అత్యధికం
[ 24-04-2024]
ఎన్నికల్లో ఒక్క ఓటు అనేది ఎంతో కీలకం. ఒక్క ఓటుతోనే ఫలితం తారుమారు కావచ్చు. చాలా మంది ఓటుహక్కును వినియోగించుకోవడం లేదు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరూ ఎంపీలు స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. -
పోలింగ్శాతంపై అభ్యర్థుల బెంగ
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో నమోదయ్యే పోలింగ్శాతంపై అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఏప్రిల్లోనే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. -
ఐదో రోజు తొమ్మిది నామినేషన్లు
[ 24-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఐదో రోజైన మంగళవారం తొమ్మిది మంది నామినేషన్లు వేశారు. అశోక్గౌడ్(బహుజన్ లెఫ్ట్ పార్టీ), పోతు నవీన్(ఆలిండియా బీసీ, ఓబీసీ పార్టీ), నాగార్జున్(ప్రజా సేన పార్టీ), ఎండీ.షాహెద్ ఖాన్(ఆలిండియా నేషనల్ పార్టీ), గోలి నరేష్(దళిత బహుజన పార్టీ), శక్తి ప్రసాద్, బీబీ నాయక్, మహ్మద్ జమీల్, సాయికృష్ణ(స్వతంత్ర) నామపత్రాలను రిటర్నింగ్ అధికారి రాజీవ్గాంధీ హన్మంతుకు అందజేశారు. -
ఓట్లు ఎక్కువ.. ప్రాతినిధ్యం తక్కువ
[ 24-04-2024]
పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. రాజకీయ రంగంలోకి వచ్చేసరికి సర్పంచి నుంచి జడ్పీ ఛైర్పర్సన్ వరకు ఇలా వివిధ పదవుల్లో రాణిస్తున్నారు. -
కార్యకర్తలపైనే ప్రచార బాధ్యతలు
[ 24-04-2024]
నామపత్రాల దాఖలు గడువు చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గతానికి భిన్నంగా జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మొదటిసారి త్రిముఖపోరు నెలకొంది. -
పర్యవేక్షిస్తేనే ఆదాయం
[ 24-04-2024]
బల్దియాల నుంచి అనుమతులు పొందకుండానే ప్రధాన కూడళ్లతోపాటు ఆయా రోడ్ల పక్కన ప్రచార బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఈ దిశగా అడుగులు పడటంలేదు. -
200 మందికి ఉపాధి లక్ష్యం
[ 24-04-2024]
గ్రామాల్లో ఉపాధి పనుల జోరు పెంచాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి గ్రామ పంచాయతీలో 200 మంది కూలీల కంటే ఎక్కువగా హాజరు ఉండాలని పేర్కొంది. దీంతో జిల్లా యంత్రాంగం ఉపాధి కూలీల సంఖ్య పెరగడంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..