logo

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజాంసాగర్‌ మండలంలో సోమవారం చోటుచేసుకుంది.

Published : 06 Feb 2023 17:28 IST

నిజాంసాగర్‌: మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజాంసాగర్‌ మండలంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని కోమలంచ గ్రామానికి చెందిన జ్యోతి లక్ష్మణ్‌(37) మద్యానికి బానిసయ్యాడు. ప్రతిరోజు మాదిరిగానే మద్యం సేవించి రాత్రి ఇంట్లో కుటుంబసభ్యులతో  గొడవ పడి భార్యా పిల్లలను పుట్టింటికి పంపాడు. అనంతరం ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం బాన్సువాడకు తరలించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని