logo

విద్యుత్తు తీగలు పట్టుకుని యువకుడి ఆత్మహత్య

మల్లారం గ్రామానికి చెందిన మోర్తాడ్‌ ప్రశాంత్‌(23) అనే యువకుడు సోమవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు.

Published : 07 Feb 2023 04:47 IST

మృతుడు ప్రశాంత్‌

నందిపేట్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: మల్లారం గ్రామానికి చెందిన మోర్తాడ్‌ ప్రశాంత్‌(23) అనే యువకుడు సోమవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు. అయిలాపూర్‌ శివారులో వ్యవసాయ విద్యుత్తు నియంత్రిక తీగలు పట్టుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. మానసిక సమస్యలతో ప్రశాంత్‌ సొదరుడు రెండేళ్ల కిందట గల్ఫ్‌లో ఉరేసుకొని బలవన్మరణం పొందగా, అంతకుముందు తల్లి కూడా చనిపోవడంతో కొంతకాలంగా మనోవేదనకు గురై.. జీవితంపై విరక్తి చెంది చనిపోయినట్లు వెల్లడించారు. తండ్రి నర్సయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని