రైతు నేస్తం
శాసనసభలో సోమవారం ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ సాగుకు ప్రోత్సాహం అందించేలా సంక్షేమానికి చేయూతనిచ్చేలా ఉంది.
సాగుకు దన్ను.. జల వనరులకు పెద్దపీట
రాష్ట్ర బడ్జెట్లో బడుగులకు భరోసా
ఈనాడు డిజిటల్ కామారెడ్డి, ఈనాడు నిజామాబాద్
శాసనసభలో సోమవారం ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ సాగుకు ప్రోత్సాహం అందించేలా సంక్షేమానికి చేయూతనిచ్చేలా ఉంది.
ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దపీట వేసేలా నిధులు కేటాయించడంతో ఆయా వర్గాలు అత్యధికంగా కలిగిన ఉభయ జిల్లాలకు ప్రయోజనం కలగనుంది. సాగునీటి రంగానికి ప్రాధాన్యం ఇవ్వడంతో కాళేశ్వరం ప్యాకేజీ-20, 21, 22పై ఆశలు చిగురించాయి.
కర్షక హితం
రుణమాఫీ అమలుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం అన్నదాతలకు లబ్ధిచేకూరే అంశం. స్థానికంగా చెరకు పంట ఏటేటా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఆయిల్పాంను ప్రోత్సహించేందుకు రూ.వెయ్యి కోట్లు కేటాయించడం శుభపరిణామం. ఉభయ జిల్లాల్లో దీని సాగుకు సమాయత్తమవుతున్న సుమారు పదిహేను వేల మంది మెట్టప్రాంత రైతులకు మేలు జరగనుంది.
నేరుగా స్థానిక సంస్థలకు నిధులు
పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులను నేరుగా విడుదల చేస్తోంది. ఇదే మాదిరిగా పురపాలికలతో పాటు పంచాయతీలకు పల్లె, పట్టణ ప్రగతితోపాటు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను నేరుగా పంచాయతీలు, బల్దియాల ఖాతాల్లో వేయనున్నట్లు మంత్రి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. దీనివల్ల స్థానిక సంస్థల్లో నిధుల కొరత తీరే అవకాశముంది.
పురపాలికలు : - 4 - 3
గోదావరి జలాల తరలింపునకు కసరత్తు
కాళేశ్వరం నుంచి నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు సాగునీరు అందించేందుకు ప్యాకేజీ-20, 21, 22 తీసుకొచ్చారు. నిజామాబాద్లో ప్యాకేజీ-21ని వేగంగా పూర్తిచేసేందుకు అధికారులు ప్యాకేజీ-21, -21(ఎ)గా విభజించి పనులు చేపడుతున్నారు. కామారెడ్డి, మెదక్ కోసం ప్యాకేజీ-22 కొనసాగుతోంది. ప్రస్తుత బడ్జెట్లో నీటిపారుదల రంగానికి భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించినా.. వీటి కోసం ప్రత్యేకంగా కేటాయింపులు ఉంటేనే అన్నదాతల ఆశలు నెరవేరే అవకాశముంది.
అనుబంధ నర్సింగ్ కళాశాల
కామారెడ్డి వైద్య కళాశాలలో రాబోయే విద్యాసంవత్సరం తరగతులు ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. దీనికి అనుబంధంగా నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే బాన్సువాడలో నర్సింగ్ కళాశాల ఉంది. గతేడాది తరగతులు ప్రారంభమయ్యాయి. తాజాగా మరోటి రానుంది.
నెరవేరనున్న సొంతింటి కల
రెండు పడక గదుల ఇళ్లకు భారీగా నిధులు కేటాయించిన నేపథ్యంలో సొంత స్థలం ఉండి ఇంటి నిర్మాణం చేపట్టే వారికి రూ.3 లక్షలు మంజూరు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనిపై బడ్జెట్ ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించనప్పటికీ గతేడాది వెల్లడించినందున ఈ పథకానికి మోక్షం లభించే అవకాశం ఉంది. తద్వారా నిరుపేదల గృహ కల నెరవేరనుంది.
ఒప్పంద క్రమబద్ధీకరణ, సెర్ప్ పేస్కేల్ సవరణ
ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. సెర్ప్ సిబ్బంది పేస్కేల్ సవరణ చేయనున్నట్లు తెలిపారు. దీనివల్ల ఉభయ జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న 5,327 మందికి ప్రయోజనం కలగనుంది.
దళిత యువతకు ఉపాధి
అణగారిన దళిత జాతి సమగ్ర అభ్యుదయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఈమేరకు దళితబంధు ప్రవేశపెట్టి నియోజకవర్గానికి వంద మందిని ఎంపిక చేసి యూనిట్లు మంజూరు చేశారు. నిజాంసాగర్ మండలంలోని మొత్తం దళిత కుటుంబాలకు యూనిట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. రెండో విడతలో నియోజకవర్గానికి 500 మంది చొప్పున ఎంపిక చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు.
ప్రస్తుత బడ్జెట్లో ఈ పథకం అమలుకు రూ.17,700 కోట్లు కేటాయించడంతో సదరు కుటుంబాల్లో ఆశలు నెలకొన్నాయి.
మన ఊరు మన బడి
మన ఊరు-మన బడికి ప్రస్తుత బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. దశల వారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 12 రకాల సౌకర్యాలు కల్పించి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. మొదటి దశలో ఉభయ జిల్లాల్లోని 758 బడుల్లో మౌలిక వసతుల కల్పన నిమిత్తం ఎంపిక చేశారు. ఇప్పటికే కొన్నిచోట్ల పనులు పూర్తికావడం గమనార్హం.
కొత్త ఈహెచ్ఎస్ విధానం
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు కొత్త ఈహెచ్ఎస్ విధానాన్ని తీసుకురానున్నట్లు మంత్రి ప్రకటించారు. ఎంప్లాయీస్ హెల్త్కేర్ ట్రస్ట్ను ఏర్పాటు చేసి ఇందులో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులను భాగస్వాములుగా చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 19-04-2024]
తాండూరు గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి కూలీల వద్దకు వెళ్లి 6 గ్యారంటీలు, రుణమాఫీ గురించి స్థానిక కాంగ్రెస్ నాయకులు వివరించారు. -
పోరు.. ఇక జోరు
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
సిద్ధమవుతున్నారు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో బరిలో నిలిచే అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. -
‘వ్యాపార కాంక్షతోనే బీబీపాటిల్ పోటీ’
[ 19-04-2024]
తన వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకే బీబీపాటిల్ ఎంపీగా పోటీచేస్తున్నారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు విమర్శించారు. -
ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ
[ 19-04-2024]
రైతులకు ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ పేర్కొన్నారు. -
లక్ష్యం అధిగమించి.. ఆర్థికంగా ఎదిగి
[ 19-04-2024]
మహిళా సంఘాలకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తోంది. ఈ అవకాశాన్ని చాలా మంది మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. -
ఇక ప్రచార హోరు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఇక హోరెత్తనుంది. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరు పెంచేందుకు సిద్ధమయ్యారు. -
బీఫాం అందుకున్న బాజిరెడ్డి
[ 19-04-2024]
నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు అధినేత కేసీఆర్ హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం బీఫాం అందజేశారు. -
రూ.52.71 లక్షల నగదు.. 16,547 లీటర్ల మద్యం పట్టివేత
[ 19-04-2024]
సాధారణ ఎన్నికల షెడ్యూల్ మార్చి 16న విడుదలైంది. ఆ రోజు నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. -
ఇద్దరు సీఐలపై వేటు
[ 19-04-2024]
కమిషనరేట్ పరిధిలో ఇద్దరు సీఐలపై గురువారం సస్పెన్షన్ వేటు పడింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ను తప్పించేందుకు పంజాగుట్ట సీఐని సంప్రదించినట్లు విచారణలో తేలడంతో అప్పటి బోధన్ సీఐ ప్రేమ్కుమార్ సస్పెండ్ చేశారు. -
హైకోర్టును ఆశ్రయించిన సాహిల్
[ 19-04-2024]
హైదరాబాద్ పంజాగుట్ట వద్ద బారీకేడ్లను ఢీకొట్టిన రోడ్డు ప్రమాద ఘటనలో నిందితుడిగా చేర్చడాన్ని సవాలు చేస్తూ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ అలియాస్ రాహిల్ హైకోర్టును ఆశ్రయించారు. -
అరచేతిలో ఎన్నికల సమాచారం
[ 19-04-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎక్కడైనా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, డబ్బుల పంపిణీ చేస్తే ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా? -
‘పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి’
[ 19-04-2024]
నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉందని’ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబుకు విజ్ఞప్తి చేశారు. -
హ్యాట్రిక్ వీరులు ఇద్దరు
[ 19-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరు వ్యక్తులు వరుసగా మూడు సార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 1952లో హరీశ్ చంద్ర హెడా కాంగ్రెస్ తరఫున విజయం సాధించి మొదటి సారి లోక్సభ సభ్యుడిగా అడుగు పెట్టారు. -
విద్యార్థులు.. సైబర్ రక్షకులు
[ 19-04-2024]
పెరిగిన సాంకేతికత, చరవాణులు అందరికీ చేరువై అన్ని రంగాల్లో సేవలు సులభమయ్యాయి. కానీ అదే సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగత డేటా, ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి సైబర్ మోసగాళ్లు డబ్బులు అపహరిస్తున్నారు. -
ఆకాశవాణి మీకోసం..
[ 19-04-2024]
పిల్లలూ.. మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు మొదలుకానున్నాయి.. ఇంటి వద్దే ఉంటూ చరవాణిలో వీడియో గేమ్స్ ఆడుకుంటూ సమయాన్ని వృథా చేయకండి. -
ద్విచక్రవాహనాల దొంగ అరెస్టు
[ 19-04-2024]
ట్రాక్టర్ నడుపుకొంటూ జీవనం సాగించే వ్యక్తి అక్రమంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో ద్విచక్ర వాహనాలను దొంగతనాలు చేసి తనిఖీల్లో ఒకటో ఠాణా పోలీసులకు దొరికిపోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు