logo

భూమి అమ్మకానికి అడ్డొస్తుందని.. తల్లిని కడతేర్చిన తనయుడు

పెంచి పెద్దచేసిన కన్న తల్లిని కొడుకే కడతేర్చాడు. భూమి అమ్మకానికి అడ్డొస్తుందని తల్లిని గొంతు నులిమి హత్యచేసిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బల్దియా పరిధిలోని గండిమాసానిపేటలో మంగళవారం చోటుచేసుకుంది.

Published : 08 Feb 2023 05:40 IST

లచ్చి పోచమ్మ

ఎల్లారెడ్డి(సదాశివనగర్‌), న్యూస్‌టుడే: పెంచి పెద్దచేసిన కన్న తల్లిని కొడుకే కడతేర్చాడు. భూమి అమ్మకానికి అడ్డొస్తుందని తల్లిని గొంతు నులిమి హత్యచేసిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బల్దియా పరిధిలోని గండిమాసానిపేటలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై గణేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన లచ్చి పోచమ్మ(57) కొడుకు సంజీవులు(36), కోడలు సరిత, ఇద్దరు మనవళ్లతో కలిసి పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు. వీరికి రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. సంజీవులు చెడు అలవాట్లకు బానిసై పని చేయకపోవడంతో అప్పులు పెరిగాయి. ఈ క్రమంలో మూడు నెలల కిందట నాలుగు గుంటల భూమి విక్రయించి అప్పులు తీర్చారు. మిగిలిన భూమిని కూడా అమ్మేద్దామని తరుచూ తల్లితో గొడవకు దిగేవాడు. ఈ విషయమై మంగళవారం మరోమారు ఇరువురి మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన సంజీవులు తల్లి గొంతునులిమి చంపినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని