సాగు బాగుకు.. అరకొర నిధులే
జలాశయాల కింది కాల్వలు శిథిలావస్థకు చేరాయి. చివరి ఆయకట్టుకు నీరందక పంటలు పండని పరిస్థితి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల కింద డిస్ట్రిబ్యూటరీ, ఉప కాల్వల మరమ్మతులకు బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఆశించిన అన్నదాతలకు నిరాశే ఎదురైంది.
నిజాంసాగర్ ఆధునికీకరణకు రూ.146.51 కోట్లు
మిగతా వాటికి రిక్తహస్తం
ఈనాడు డిజిటల్, కామారెడ్డి
నిజాంసాగర్ ప్రాజెక్టు
జలాశయాల కింది కాల్వలు శిథిలావస్థకు చేరాయి. చివరి ఆయకట్టుకు నీరందక పంటలు పండని పరిస్థితి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల కింద డిస్ట్రిబ్యూటరీ, ఉప కాల్వల మరమ్మతులకు బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఆశించిన అన్నదాతలకు నిరాశే ఎదురైంది. కేవలం నిజాంసాగర్ ఆధునికీకరణకు రూ.146.51 కోట్ల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి.. కాళేశ్వరం పనులు పూర్తి చేస్తామని ప్రస్తావించడంతోనే సరిపెట్టారు. ప్రత్యేకంగా నిధులు ఇవ్వకపోవడంతో పనుల పూర్తికి నిర్దిష్ట కార్యాచరణ కొరవడింది. గోదావరి జలాలతో జిల్లాలో 2 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టును స్థిరీకరిస్తామని నేతలు చెప్పే మాటలు నీటి మూటలుగానే మిగిలాయి.
పోచారం
భారీగా ప్రతిపాదనలు: ఈ ఏడాది బడ్జెట్లో ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని నీటిపారుదలశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. నిజాంసాగర్ కాల్వల ఆధునికీకరణతో పాటు డ్యాం మరమ్మతులకు రూ.380 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. పోచారం కాల్వల ఆధునికీకరణకు రూ.100 కోట్లు, కౌలాస్కు రూ.43 కోట్లు అవసరమని నివేదించారు. వీటితో పాటు కాళేశ్వరం ప్యాకేజీ-22 పనుల పూర్తికి రూ.1,340 కోట్లు ఇవ్వాలని కోరారు.
నిర్వహణకే సరిపోవు : జలవనరుల శాఖ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉమ్మడి జిల్లాను నిజామాబాద్, కామారెడ్డిగా వర్గీకరించి సీఈలను నియమించారు. కామారెడ్డి జిల్లా సీఈ పరిధిలోకి నిజాంసాగర్, పోచారం, కౌలాస్తో పాటు సింగీతం, కల్యాణి వంటి రిజర్వాయర్లు, నిర్మాణంలో ఉన్న లెండి ప్రాజెక్టును చేర్చారు. ప్రస్తుతం వీటి నిర్వహణకు గతానికి భిన్నంగా కేవలం రూ.5 కోట్లే కేటాయించారు.
భూసేకరణ దశలోనే : నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి, మెదక్ జిల్లాలకు కాళేశ్వరం నీరందించేందుకు ప్యాకేజీ-20, 21, 22 కింద పనులు చేపట్టాలని నిర్ణయించారు. మెట్ట ప్రాంతమైన కామారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు తరలించేందుకు ఉద్దేశించిన 22-ప్యాకేజీ పనులు ఇంకా పూర్తికాలేదు. నిధుల విడుదల్లో జాప్యం కారణంగా ప్యాకేజీ-22 పనులు నత్తనడకన సాగుతున్నాయి. కాల్వల తవ్వకాలతో పాటు ఇతర పనులకు పెద్ద ఎత్తున భూసేకరణ చేపట్టాల్సింది. గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా పనులు సాగడం లేదు. ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల రైతులకు ఈ ప్రాజెక్టు పూర్తయితేనే ప్రయోజనం చేకూరుతుంది.
కౌలాస్నాలా
పోచారం ఎత్తు పెంపు ఉత్తిదే
2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లారెడ్డిలో బహిరంగ సభలో కేసీఆర్ పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంపు ప్రతిపాదనను పరిశీలిస్తానని హమీ ఇచ్చారు. గతఏడాది బడ్జెట్లోనూ అరకొర కేటాయింపులు చేశారు. ప్రస్తుతం రూ.3.50 కోట్లు ఇచ్చినప్పటికీ అవి ఏ మూలకు సరిపోవు. ఎత్తుపెంపుపై సర్వే చేపట్టేందుకు రూ.33 లక్షలు మంజూరు చేయాలని అధికారులు నివేదించినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది. దీనికి తోడు వందేళ్ల కిందట నిర్మించిన ప్రాజెక్టు కావడంతో డిస్ట్రిబ్యూటరీలు, కాల్వలు శిథిలావస్థకు చేరాయి. రైతులే డబ్బులు వెచ్చించి బాగు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటర్లో అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ 27వ స్థానంలో, ద్వితీయంలో 29వ స్థానంలో నిలిచింది. -
సమాయత్తం.. ఓట్లపైనే చిత్తం
[ 25-04-2024]
లోక్సభ నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ నామ పత్రాలు దాఖలు చేశారు. -
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. -
ఫిర్యాదులపై పెరిగిన చైతన్యం
[ 25-04-2024]
ఎన్నికల నియమాలు, ఉల్లంఘనలపై పౌరుల్లో చైతన్యం పెరిగింది. ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల్ కమిషన్ 1950 కాల్సెంటర్, సీ-విజిల్ యాప్ను రూపొందించిన విషయం తెలిసిందే -
రాష్ట్రంలో చివరి స్థానం
[ 25-04-2024]
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫలితాలు నిరాశపరిచాయి. తొలిసారిగా రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. 35వ స్థానంలో నిలిచింది. -
ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం
[ 25-04-2024]
ఎల్లారెడ్డి బల్దియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. -
కళాశాలల తనిఖీలకు వేళాయె
[ 25-04-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 2024-25 నూతన విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ కోసం ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల తనిఖీలు గురువారం నుంచి చేపట్టనున్నారు. -
కోడ్ ముగిశాకే.. సవరణకు అవకాశం
[ 25-04-2024]
ఎన్నికల కోడ్ రాకముందే ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. -
అదరగొట్టారు..
[ 25-04-2024]
కుటుంబ నేపథ్యం ఏదైనా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని అహర్నిశలు కష్టపడ్డారు. నిపుణుల వద్ద సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రణాళికబద్ధంగా చదివారు. పరీక్షలు రాశారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)