logo

విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి

సిర్‌పూర్‌లో విద్యుదాఘాతంతో కౌలు రైతు రాజప్ప(45) మృతి చెందినట్లు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు. గురువారం ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

Published : 24 Mar 2023 05:54 IST

డోంగ్లీ(మద్నూర్‌), న్యూస్‌టుడే: సిర్‌పూర్‌లో విద్యుదాఘాతంతో కౌలు రైతు రాజప్ప(45) మృతి చెందినట్లు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు. గురువారం ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజప్ప కౌలుకు తీసుకున్న పొలంలో వరి సాగు చేశారు. పురుగు మందు పిచికారీ చేసేందుకు వెళ్లగా..  పొలంలో వేలాడుతున్న విద్యుత్తు తీగలను చూసుకోకుండా వాటిపై కాలువేయడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై అన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని