logo

వివాహిత బలవన్మరణం

ఆర్మూర్‌ పట్టణంలోని పెర్కిట్‌కు చెందిన ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. సిరికొండ మండలం గడ్కోల్‌కు చెందిన ఉప్పునూతుల పల్లవి (28)కి పెర్కిట్‌కు చెందిన శివకుమార్‌తో ఆరు సంవత్సరాల కిందట వివాహమైంది.

Published : 24 Mar 2023 06:04 IST

దవాఖానా వద్ద ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులు

ఆర్మూర్‌ పట్టణం, న్యూస్‌టుడే: ఆర్మూర్‌ పట్టణంలోని పెర్కిట్‌కు చెందిన ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. సిరికొండ మండలం గడ్కోల్‌కు చెందిన ఉప్పునూతుల పల్లవి (28)కి పెర్కిట్‌కు చెందిన శివకుమార్‌తో ఆరు సంవత్సరాల కిందట వివాహమైంది. ఈ క్రమంలో కొన్ని రోజులుగా అత్తింటి వేధింపులకు తాళలేక గురువారం యాసిడ్‌ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు కుటుంబాలను సముదాయించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఆర్మూర్‌ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తపై దాడి చేయడంతో అతను చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో సురేశ్‌బాబు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని