logo

రైల్వేగేటు మూసేలోగా.. ఈ దారి బాగు చేయండి

నిజామాబాద్‌ శివారులోని మాధవనగర్‌ దగ్గర ఆర్వోబీ పనులు కొనసాగుతున్నాయి. పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు రైల్వేగేటును కొన్నిరోజుల పాటు మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది.

Published : 24 Mar 2023 06:04 IST

మాధవనగర్‌ పోచమ్మగుడి సమీపంలోని రహదారి

నిజామాబాద్‌ శివారులోని మాధవనగర్‌ దగ్గర ఆర్వోబీ పనులు కొనసాగుతున్నాయి. పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు రైల్వేగేటును కొన్నిరోజుల పాటు మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గేటు పూర్తిగా మూసివేస్తే ద్విచక్రవాహనదారులు కంఠేశ్వర్‌ బైపాస్‌ మీదుగా 10 కిలోమీటర్ల వరకు తిరిగి రావాల్సి ఉంటుంది. ఈ దూరం తగ్గించడానికి మాధవనగర్‌ గ్రామంలోని పోచమ్మగుడి సమీపంలోని దారిని బాగు చేయాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి లోలెవల్‌ వంతెన నుంచి బైపాస్‌ రోడ్డులోని వెలమ సంఘం వరకు చేరుకోవచ్చు. ఇందుకోసం వంతెన కింద ఉన్న నీటిని తొలగించాలి. అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

ఈనాడు, నిజామాబాద్‌

ఇలా బైపాస్‌ రోడ్డుకు చేరుకోవచ్చు

లోలెవల్‌ వంతెన కింద నిలిచిన నీరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని