యువతరం.. సేవాపథం
చదువు..ఉద్యోగం..సంపాదన అనే ఆలోచనతో ముందుకు సాగుతున్న నేటి యువతకు సమాజసేవ చేసే అవకాశం కల్పిస్తుంది జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్).
గుండారంలో తడి, పొడి చెత్త గురించి వివరిస్తున్న వాలంటీర్లు (పాత చిత్రం)
న్యూస్టుడే, వినాయక్నగర్: చదువు..ఉద్యోగం..సంపాదన అనే ఆలోచనతో ముందుకు సాగుతున్న నేటి యువతకు సమాజసేవ చేసే అవకాశం కల్పిస్తుంది జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్). సంబంధిత వాలంటీర్లు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించనున్నారు. అందులో భాగంగా జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల వాలంటీర్లు ఈనెల 25 నుంచి 31 వరకు సిర్పూర్, గుండారం, ముత్యంపల్లి, ఒడ్యాట్పల్లి, మాదాపూర్, మోపాల్ గ్రామాల్లో ఎన్ఎస్ఎస్ శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో గతంలో శిబిరాల్లో పాల్గొన్నవారి అనుభవాలతో ‘న్యూస్టుడే’ కథనం.
వీరు చేసే కార్యక్రమాలు
ఏటా నిర్వహించే శిబిరాల్లో శ్రమదానం, రక్తదానం, అక్షరాస్యత, స్వచ్ఛభారత్, హరితహారం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్వహణ, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, వాననీటి సంరక్షణ, ఓటు హక్కు నమోదు, సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన కల్పిస్తూ గ్రామీణ ప్రజలను చైతన్యపరుస్తారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ఏడాది కొత్తగా నిరుద్యోగితపై సర్వే నిర్వహించనున్నారు. చివరిగా ఇంటింటి సర్వే చేసి పల్లెల్లోని సమస్యలు ఇతర అంశాలను తెలుసుకుంటారు.
సేవే ముఖ్య ఉద్దేశం
శ్రీజ జాదవ్, బీఎస్సీ, బీటీజడ్సీ తృతీయ సంవత్సరం
ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సేవ చేయడమే ఎన్ఎస్ఎస్ ముఖ్య ఉద్దేశం. సమాజ సేవే కాకుండా విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను బయటకు తీయడానికి ఇది వేదికగా నిలుస్తుంది. ఏడాదిన్నరగా ఇందులో కొనసాగుతున్నాను. రెండుసార్లు నేషనల్ యూత్ పార్లమెంటులో రాష్ట్రస్థాయి వరకు వెళ్లాను. జిల్లా ఉత్తమ వాలంటీరుగా ఎంపికయ్యాను. ఆల్ ఇండియా రేడియోలో ప్రసంగించడానికి ఎన్ఎస్ఎస్ ద్వారా అవకాశం దక్కింది.
రెండేళ్లుగా కొనసాగుతున్నా
కల్యాణ్, బీకాం తృతీయ సంవత్సరం
రెండేళ్లుగా వాలంటీరుగా కొనసాగుతున్నాను. పాటలు, నాటకాల రూపంలో ఆయా అంశాలను ప్రజలకు అర్థమయ్యేలా చేశాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా నర్సాపుర్లో ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్లో పాల్గొన్నా. అక్కడ మాదకద్రవ్యాల నివారణ, చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో నాటకం ద్వారా వివరించాం.
కొత్త విషయాలు తెలుసుకున్నా
ప్రియవర్ధన్, బీఏ ద్వితీయ సంవత్సరం
ఎన్ఎస్ఎస్ ద్వారా సమాజాభివృద్ధికి నా వంతు కృషి చేశాను. గ్రామాల్లో పర్యటించినప్పుడు కొత్త విషయాలు నేర్చుకున్నా. జాతీయ శిబిరాలకు వెళ్లడం ద్వారా వ్యక్తిత్వ వికాస, నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు. గతేడాది నవంబర్లో హిమాచల్ప్రదేశ్లో జరిగిన నేషనల్ అడ్వెంచర్ శిబిరానికి తెలంగాణ విశ్వవిద్యాలయం తరఫున హాజరయ్యాను.
క్రమశిక్షణ అలవడుతుంది
శాంతికుమార్, బీఏ తృతీయ సంవత్సరం
ఎన్ఎస్ఎస్తో విద్యార్థి దశ నుంచి క్రమశిక్షణ అలవడుతుంది. శిబిరాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలు వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతాయి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, సామాజిక సమస్యలపై స్పందించడం అలవాటుగా మారుతాయి. గతేడాది నవంబర్లో గుజరాత్లో నిర్వహించిన ప్రీరిపబ్లిక్ శిబిరంలో నా ప్రదర్శనకు ప్రశంసలు రావడం సంతోషంగా అనిపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
[ 23-04-2024]
మడలంలోని అన్ని గ్రామాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. -
రేపటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు
[ 23-04-2024]
జిల్లాలో రేపటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు డీఈఓ రాజు ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం
[ 23-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. -
భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 23-04-2024]
ధర్మారెడ్డి గ్రామంలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మన పార్లమెంటు మహోన్నతం
[ 23-04-2024]
దేశమంతా సార్వత్రిక ఎన్నికల సంగ్రామంతో హోరెత్తుతోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. ఫలితమెలా ఉంటుందని ఉత్కంఠగా ఎదురుచూస్తోంది -
పద..పార్టీ మారుదాం !
[ 23-04-2024]
రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీల క్యాడర్ స్వరూపం మారిపోతోంది. ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు కిందిస్థాయి క్రీయాశీలక కార్యకర్తల వరకు ఒక్కొక్కరు తమకు అనుకూలంగా ఉండే పార్టీల వైపు క్యూ కడుతున్నారు. -
ఓటరే లక్ష్యం.. అస్త్రాలు సిద్ధం
[ 23-04-2024]
పార్లమెంటు ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభంకావడంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయం వేడెక్కింది. నిజామాబాద్, జహీరాబాద్ లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉండే అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు -
12 లో ఫెయిల్ జీవితంలో గెలుపు
[ 23-04-2024]
పది, ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో ఉత్తీర్ణతే మైలురాయి కాదు. విద్యాలయాలకు వెళ్లకపోయినా దూర విద్యలోనూ డిగ్రీలు సాధించి ఉన్నత స్థానాల్లో స్థిరపడినవారున్నారు. పరిమిత వనరుల్లోనూ ప్రణాళికాబద్ధంగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి -
పోరు.. ఇక హోరు
[ 23-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అగ్రనేతల ప్రచారానికి రంగం సిద్ధమైంది. కాంగ్రెస్, భారాస, భాజపాలు ఇప్పటికే నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశాయి -
సెప్టెంబరులో చక్కెర కర్మాగారాలు తెరిపిస్తాం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు నిజాం చక్కెర కర్మాగారాలు తెరిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
ఓటరు తీర్పు విభిన్నం..
[ 23-04-2024]
కామారెడ్డి జిల్లా ప్రజలకు జహీరాబాద్, మెదక్ లోక్సభ స్థానాలతో అనుబంధం ఉంది. ఇక్కడి ఓటర్లు విభిన్నమైన తీర్పులు ఇచ్చారు. -
వీడని వాన
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాను అకాల వర్షాలు వీడటం లేదు. ఉపరితల ద్రోణి ప్రభావంతో వరుసగా కురుస్తున్న వానలు అన్నదాతలకు కునుకులేకుండా చేస్తున్నాయి. సోమవారం కూడా పలు ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో వర్షం పడింది. -
బోధన్ - మహబూబ్నగర్ ప్యాసింజర్ రద్దు
[ 23-04-2024]
నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి మహబూబ్నగర్ మధ్య నడిచే రైలును మే 16 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వు జారీ చేశారు -
2.30 లక్షల మె.ట.ధాన్యం కొనుగోలు
[ 23-04-2024]
జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా ఆధ్వర్యంలో మొదట 480 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. 411 కేంద్రాలు ప్రారంభించి ఇప్పటి వరకు 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి.. రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది -
కాంగ్రెస్ శ్రేణుల్లో హుషారు
[ 23-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహించిన తొలి ఎన్నికల సభకు భారీగా జనం తరలివచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా ఇతర నాయకులు తమ ప్రసంగాలతో పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం నింపారు
తాజా వార్తలు (Latest News)
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?