రూ.3 కోట్లకు పైగా ముంచాడు
ఆయనో ప్రభుత్వ ఉపాధ్యాయుడు. కుటుంబంలోనూ ఉద్యోగులున్నారు. చిన్నపాటి వ్యాపారాలు, అద్దెకిచ్చేందుకు మడిగెలు ఉన్నాయి. ఇంకేం అంతా నమ్మారు.
బంధువులు, స్నేహితులవద్ద అప్పు చేసి పరారీ
నందిపేట్లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి నిర్వాకం
న్యూస్టుడే, ఆర్మూర్
ఆయనో ప్రభుత్వ ఉపాధ్యాయుడు. కుటుంబంలోనూ ఉద్యోగులున్నారు. చిన్నపాటి వ్యాపారాలు, అద్దెకిచ్చేందుకు మడిగెలు ఉన్నాయి. ఇంకేం అంతా నమ్మారు. స్నేహితులు, బంధువులు ఒకరికి తెలియకుండా మరొకరు రూ.లక్షలు ఆయన చేతిలో పెట్టారు. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెడుతున్నాడేమోనని భావించారు. తీరా చూస్తే ఆయన ఆచూకీ లేదు. డొంకేశ్వర్ మండలం దత్తాపూర్కు చెందిన సదరు ఉద్యోగి కొన్నాళ్లుగా నందిపేట్ మండల కేంద్రంలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. గ్రామంలో స్నేహితులు, బంధువులను మభ్యపెట్టాడు. ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.2 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అప్పుగా తెచ్చుకున్నాడు. మొదట్లో వడ్డీ సక్రమంగా కట్టడంతో నమ్మి మరింత మంది అప్పులిచ్చారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడంతో పాటు స్థిరాస్తులున్నాయనే ధైర్యంతో ఎవరూ వెనకా ముందు ఆలోచించలేదు. తీరా చూస్తే సదరు వ్యక్తి నెల రోజులుగా అందుబాటులో లేకుండాపోయాడు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ ప్రాంతంలో పనిచేసే చోటుకు కూడా వెళ్లడం లేదని తెలుస్తోంది. దీంతో అప్పులిచ్చినవారు ఇంటికెళ్లి అడిగితే అతనితో తమకేం సంబంధం లేదని సమాధానం ఇస్తున్నారని బాధితులు వాపోతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేద్దామంటే కేసులైతే తమకు వచ్చే డబ్బులు రావనే భయం వారిని వెంటాడుతోంది. చేసేదేమీ లేక అతని ఆచూకీ కోసం వెతికి వేసారిపోతున్నారు. పిల్లల ఉన్నత చదువులకని కొందరు, పెళ్లిళ్లు చేయాలని ఇంకొందరు, ఇళ్లు కట్టుకుందామని మరికొందరు రూపాయి రూపాయి పోగేసుకున్నదంతా కూడగట్టి సదరు ఉపాధ్యాయుడి చేతిలో పెట్టారు. సుమారు 40 మంది వరకు బాధితులు సుమారు రూ.3 కోట్లకు పైగా ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ‘న్యూస్టుడే’ నందిపేట్ ఎస్సై శ్రీకాంత్ను సంప్రదించగా ఈ మోసం తన దృష్టికి వచ్చిందని, బాధితులు పదుల సంఖ్యలో ఉన్నారని తెలిపారు. ఎవరైనా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజలు మళ్లీ మోసపోవద్దు
[ 20-04-2024]
భాజపా అభ్యర్థి అర్వింద్ రాముడి పేరుతో రాజకీయం తప్ప.. ప్రజలకు చేసింది ఏమీ లేదని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
పుస్తకంతో దోస్తీ చేద్దామా..?
[ 20-04-2024]
వేసవి సెలవుల్లో పిల్లల అల్లరి నియంత్రించేందుకు తల్లిదండ్రులు చేసేది.. సెల్ఫోన్ ఇచ్చి ఒక చోట పరిమితం చేయడం. కానీ దాంతో కంటి చూపు మందగించడం, మానసిక సమస్యల వంటి దుష్పరిణామాలను గ్రహించలేకపోతున్నారు. -
‘నగరాభివృద్ధిపై భారాస ప్రభుత్వం వివక్ష’
[ 20-04-2024]
భారాస ప్రభుత్వ హయాంలో నగరాభివృద్ధిపై పూర్తి వివక్ష చూపారని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
రెండో రోజు.. ఆరుగురు
[ 20-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ఆరు నామపత్రాలు దాఖలయ్యాయి. ఇందులో ప్రధాన పార్టీలైన భారాస, భాజపా అభ్యర్థులున్నారు. -
బడుల బలోపేతానికి కృషి
[ 20-04-2024]
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ‘మన ఊరు మన బడి కింద’ ఎంపికైంది. ఇక్కడ వంట గదులు సక్రమంగా లేవు. ఏళ్ల నాటి గదుల్లోనే వంట చేస్తున్నారు -
హలో పురపాలిక
[ 20-04-2024]
‘హలో మేము పాత బాన్సువాడ నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ పైపులైను పగిలి నీటి సమస్యగా మారింది. దీన్ని త్వరగా పరిష్కరించేలా చొరవ తీసుకోండి -
సమస్యలు అటుంచి.. విధానాలే ముందుంచి
[ 20-04-2024]
శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే లోక్సభ స్థానం పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచార బాధ్యతలను ముఖ్య కార్యకర్తలకే అప్పగిస్తున్నారు. -
వడగళ్ల వాన.. వణికిన రైతన్న
[ 20-04-2024]
వడగళ్ల వాన జిల్లాను మరోసారి వణికించింది. శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో వాన కురిసింది -
ప్రమాదాల కాలం.. అప్రమత్తతతోనే పదిలం
[ 20-04-2024]
ఎండలు మండుతుండడంతో ఏప్రిల్, మే నెలల్లో అగ్నిప్రమాదాలకు ఆస్కారముంది. నాలుగు నెలల కిందట కామారెడ్డి జిల్లాకేంద్రంలోని అయ్యప్ప షాపింగ్ మాల్లో సంభవించిన అగ్నిప్రమాదంలో రెండు రోజులకు గానీ మంటలు అదుపులోకి రాలేదు -
ఈ- కేవైసీకి మరో అవకాశం
[ 20-04-2024]
రేషన్ కార్డుకు ఈ కేవైసీ చేయించుకునేందుకు అధికారులు మళ్లీ అవకాశం కల్పించారు. గతంలో మూడు సార్లు గడువు పొడిగించినప్పటికీ ఉమ్మడి జిల్లాలో ఇంకా 19 శాతం మంది ప్రక్రియ పూర్తిచేసుకోలేదు. -
ముందస్తు పన్ను రాయితీపై ఆసక్తి
[ 20-04-2024]
ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్నుల వసూలులో ఆర్మూర్ బల్దియా ముందంజలో ఉంది. ఈనెల 1 నుంచి 30 వరకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన పన్ను రుసుముపై 5 శాతం రాయితీ ఇస్తున్న విషయం తెలిసిందే. -
గొలుసుకట్టు చెరువులు నిండేదెట్లా?
[ 20-04-2024]
వృథా నీటిని చెరువుల్లోకి మళ్లించేందుకు నీటిపారుదల శాఖ యంత్రాంగం చేపట్టిన లక్ష్యం నిధుల కొరతతో ఆచరణకు నోచుకోవడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్