సీఎంఆర్ పూర్తి చేస్తారా..?
సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) సేకరణ గడువు తరుముకొస్తోంది. మార్చి 31 వరకు మిల్లింగ్ పూర్తి చేయాలని కేంద్రం ఇది వరకే తుది గడువు విధించింది.
ఈ నెలాఖరుతో ముగియనున్న గడువు
85శాతం చేరిన మిల్లింగ్
న్యూస్టుడే, కామారెడ్డి కలెక్టరేట్
సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) సేకరణ గడువు తరుముకొస్తోంది. మార్చి 31 వరకు మిల్లింగ్ పూర్తి చేయాలని కేంద్రం ఇది వరకే తుది గడువు విధించింది. నాలుగైదు నెలలుగా గడువు పొడిగిస్తున్నప్పటికీ మిల్లింగ్లో పెద్దగా వేగం కనిపించలేదు. ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 2021-22 వానాకాలం నుంచి 2022-23 వానాకాలం వరకు ఒక సీజన్లోనూ లక్షాన్ని చేరలేదు. 40 రోజులుగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించడంతో మిల్లింగ్ ప్రక్రియ 85 శాతం వరకు చేరుకుంది. మిగిలిన మూడు రోజుల వ్యవధిలో 15 శాతం పూర్తి చేయాల్సి ఉంది.
గతేడాది వానాకాలం సీజన్కు సంబంధించి మరో 25 వేల క్వింటాళ్ల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. అధికారులు రోజువారీ లక్ష్యాలు నిర్దేశించినప్పటికీ మిల్లింగ్ లక్ష్యం చేరుకోలేదు. జిల్లావ్యాప్తంగా గత యాసంగి సీజన్లో 2.78 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. వీటిని ఆయా మిల్లులకు కేటాయించారు. ఈ మేరకు 1.88 లక్షల మె.ట. బియ్యం ఇవ్వాలని లక్ష్యం నిర్దేశించారు. ఇప్పటి వరకు కేవలం 1.69 లక్షల మె.ట. మాత్రమే ఇచ్చారు. మొన్నటి వానాకాలం సీజన్కు సంబంధించి మిల్లింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇది పూర్తి చేయడానికి మరికొంత సమయం పడుతుంది.
ప్రత్యేక సమావేశాలు నిర్వహించినా...
కేంద్ర విధించిన గడువులోపు సీఎంఆర్ పూర్తి చేయడానికి మిల్లర్లు ఆపసోపాలు పడుతున్నారు. 2021-22 వానాకాలం సీజన్ ధాన్యం గత ఫిబ్రవరి వరకు పూర్తికాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కరోనా సమయంలో హమాలీల కొరత ఉందనే సాకుతో జాప్యం చేశారు. ప్రస్తుతం ఏడాది నుంచి అంతా బాగానే ఉన్నా వేగం కనిపించడంలేదు. కలెక్టర్ జితేశ్ వి పాటిల్, అదనపు కలెక్టర్ చంద్రమోహన్, పౌరసరఫరాలశాఖ అధికారులు మిల్లర్లతో తరచూ సమావేశాలు ఏర్పాటు చేసి గడువులోపు సీఎంఆర్ పూర్తి చేయాలని ఆదేశించినా లక్ష్యం చేరుకోవడంలేదు.
గడువులోపు పూర్తి చేయాలి
మిల్లర్లకు ఇచ్చిన లక్ష్యాల ప్రకారం సీఎంఆర్ను గడువులోపు పూర్తి చేయాలి. జిల్లాలో మిల్లింగ్ ప్రక్రియ 90శాతానికి చేరువైంది. వచ్చే మూడు రోజుల్లో శత శాతానికి చేరుకోవాలని ఆదేశించాం.
అభిషేక్, డీఎం, పౌరసరఫరాలశాఖ, కామారెడ్డి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ పార్టీ మండల నూతన కమిటీ ఏర్పాటు
[ 29-03-2024]
ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు శుక్రవారం నాయకుల సమక్షంలో నాగిరెడ్డిపేట మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. -
ప్రధాని మోదీ పాలనలోనే దేశం అభివృద్ధి: భాజపా
[ 29-03-2024]
ప్రధాని మోదీ పాలనలో దేశం అభివృద్ధి దిశలో పయనిస్తోందని జహీరాబాద్ ఎంపీ, భాజపా జహీరాబాద్ లోక్సభ అభ్యర్థి బీబీ పాటిల్ అన్నారు. -
వడ్ల కొనుగోలు సెంటర్ ప్రారంభం
[ 29-03-2024]
జిల్లా పాలనధికారి జితేష్ వి పాటిల్ ఆదేశాలనుసారం శుక్రవారం మండల కేంద్రంలోని లక్ష్మాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించినట్లు ఎల్లారెడ్డి సొసైటీ సీఈవో విశ్వనాథం తెలిపారు. -
ఓటేయాలి.. చైతన్యం చాటాలి
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా స్వీప్ ద్వారా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. -
ఆధారాలు చూపిస్తే నగదు వాపస్
[ 29-03-2024]
పార్లమెంట్ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినందున పోలీసు, ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్ బృందాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయని, రూ.50 వేల కంటే ఎక్కువ నగదు, బంగారం, వెండి, ఇతర వస్తువులకు -
లక్ష్య సాధనలో పరుగులు
[ 29-03-2024]
జిల్లాలో వ్యవసాయోత్పత్తులు ఆశాజనకంగా ఉండటంతో మార్కెట్ ఫీజు వసూళ్లు ఈ ఏడాది ఊపుమీదున్నాయి. -
ఇంటి వద్దే ఓటు
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల్లోనూ దివ్యాంగులు, వయోవృద్ధులకు ఇంటి వద్దనే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. -
బాసరలో జంట ఆత్మహత్య ఘటనలో యువకుడి గుర్తింపు
[ 29-03-2024]
బాసర రైల్వే స్టేషన్లో బుధవారం రాత్రి ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. -
నిధులు లేక.. నిలిచిన భూ సేకరణ
[ 29-03-2024]
జిల్లాలోని సాగునీటి పథకాల నిర్మాణాలకు నిధుల విడుదలలో జాప్యంతో భూ సేకరణ నిలిచిపోయింది. కాళేశ్వరం ప్యాకేజీ-22 పనులతో పాటు నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. -
స్తబ్దుగా సలహా సంఘాలు
[ 29-03-2024]
ప్రజల భాగస్వామ్యంతో ఆయా శాఖల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం సలహా సంఘాలను(అభివృద్ధి కమిటీలు) ఏర్పాటు చేస్తుంది. -
చోరీలకు పాల్పడిన నిందితుడి రిమాండ్
[ 29-03-2024]
మద్యానికి బానిసై చోరీలు చేసిన నిందితుడిని రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ సత్యనారాయణ పేర్కొన్నారు. పట్టణంలోని కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. -
కుళాయి కనెక్షన్లు.. ఆన్లైన్లో తప్పులు
[ 29-03-2024]
పాలనలో పారదర్శకత పెంచడానికి, ప్రజలకు జవాబుదారీతనం కలిగించడానికి ఆన్లైన్ విధానం అమల్లోకి తెచ్చినా క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో అపసోపాలు తప్పడం లేదు. -
కర్ణాటకలో జిల్లా దంపతుల బలవన్మరణం
[ 29-03-2024]
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా సోమవార్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?