మోగని అలారాలు..నడవని మోటార్లు
ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకొన్న భారీ అగ్నిప్రమాదాల ఘటనలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాల వారీగా అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించని భవనాలపై కొరడా ఝలిపించాలని ఆదేశాలు జారీ చేసింది.
అధికారుల తనిఖీల్లో వెలుగులోకి..
ఇదీ జిల్లాలో భవనాల దుస్థితి
న్యూస్టుడే - ఇందూరు సిటీ
నగరంలోని సుభాష్నగర్లో వాణిజ్య సముదాయాల యజమానులతో మాట్లాడుతున్న అధికారులు
ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకొన్న భారీ అగ్నిప్రమాదాల ఘటనలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాల వారీగా అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించని భవనాలపై కొరడా ఝలిపించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అగ్నిమాపక, మున్సిపల్ శాఖలు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నాయి. ఇప్పటికే నిజామాబాద్ నగరపాలక సంస్థ, ఆర్మూర్, బోధన్ పరిధిలో 20 భవనాలను పరిశీలించిన అధికారులు పలువురు నిబంధనలు ఉల్లంఘించినట్లుతేల్చారు. త్వరలోనే సంబంధిత యజమానులకు నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం.
ఇళ్లే ఆసుపత్రులుగా..
నిజామాబాద్, ఆర్మూర్లో కొందరు వైద్యులు పాత ఇళ్లను ఆసుపత్రులుగా మార్చేశారు. వాటికి పైపైన రంగులద్ది అందులోనే పడకలు ఏర్పాటు చేసి వైద్యారోగ్య శాఖ అనుమతులు పొందినా.. రోగుల రక్షణ నిమిత్తం అగ్ని నిరోధక పరికరాలు మాత్రం ఏర్పాటు చేయలేదు. పలుచోట్ల పైపైన నీటి పైపులైన్లు, అలారం బిగించి చేతులు దులుపేసుకున్నారు. వాణిజ్య సముదాయాలు, మాల్స్లోనూ ఇదే పరిస్థితి ఉంది. భవనం చుట్టూర ఖాళీ స్థలం, నీటి సంపులు ఉండట్లేదు. అగ్ని ప్రమాదం జరిగితే తప్పించుకొనే మార్గం నిర్మించట్లేదు.
ఎన్నో ఉల్లంఘనలు
నగరం, పట్టాణాల్లో వేర్వేరుగా తనిఖీలు చేస్తున్న అగ్నిమాపక శాఖ, మున్సిపల్ అధికారులు పలు భవనాల్లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించారు. కనీస అగ్ని నిరోధక పరికరాలు లేవని, ఏ చిన్న ప్రమాదం జరిగినా తప్పించుకోవటం కష్టమేనని తేల్చారు. కొందరు నీటి సంపులు నిర్మించలేదు. మరికొందరు నిర్మించినా నిర్వహణ మరిచారు. మోటార్లు పాడైనా పట్టించుకోవట్లేదు. అలారం సెన్సార్లు సైతం పనిచేయట్లేదని తెలిసింది.
ఎత్తుతో సంబంధం లేదు..
అగ్నిమాపక శాఖ నిబంధనల ప్రకారం.. 15 మీటర్ల ఎత్తు కంటే తక్కువగా ఉన్న పాఠశాలలు, కళాశాలల భవనాలకు విధిగా ఎన్వోసీ అవసరం లేదు. ఆసుపత్రులు, థియేటర్లు, వాణిజ్య సముదాయాలు, గోదాంల్లో ఎత్తుతో సంబంధం లేకుండా నిబంధనలు పాటించాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటే వజ్రాయుధం
[ 25-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. -
6 గ్యారంటీ పథకాలే కాంగ్రెస్ను గెలిపిస్తాయి
[ 25-04-2024]
ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెత్కర్ కు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇంటర్లో అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ 27వ స్థానంలో, ద్వితీయంలో 29వ స్థానంలో నిలిచింది. -
సమాయత్తం.. ఓట్లపైనే చిత్తం
[ 25-04-2024]
లోక్సభ నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ నామ పత్రాలు దాఖలు చేశారు. -
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. -
ఫిర్యాదులపై పెరిగిన చైతన్యం
[ 25-04-2024]
ఎన్నికల నియమాలు, ఉల్లంఘనలపై పౌరుల్లో చైతన్యం పెరిగింది. ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల్ కమిషన్ 1950 కాల్సెంటర్, సీ-విజిల్ యాప్ను రూపొందించిన విషయం తెలిసిందే -
రాష్ట్రంలో చివరి స్థానం
[ 25-04-2024]
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫలితాలు నిరాశపరిచాయి. తొలిసారిగా రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. 35వ స్థానంలో నిలిచింది. -
ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం
[ 25-04-2024]
ఎల్లారెడ్డి బల్దియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. -
కళాశాలల తనిఖీలకు వేళాయె
[ 25-04-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 2024-25 నూతన విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ కోసం ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల తనిఖీలు గురువారం నుంచి చేపట్టనున్నారు. -
కోడ్ ముగిశాకే.. సవరణకు అవకాశం
[ 25-04-2024]
ఎన్నికల కోడ్ రాకముందే ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. -
అదరగొట్టారు..
[ 25-04-2024]
కుటుంబ నేపథ్యం ఏదైనా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని అహర్నిశలు కష్టపడ్డారు. నిపుణుల వద్ద సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రణాళికబద్ధంగా చదివారు. పరీక్షలు రాశారు.
తాజా వార్తలు (Latest News)
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!