ముందుకు కదలని పనులు
నవీపేట మండలం స్టేషన్ ఏరియా పంచాయతీ కార్యాలయం ఇది. పాత వీడీవో క్వార్టర్స్ గదిలో కొనసాగిస్తున్నారు. ఇరుకుగా ఉండటంతో సిబ్బంది, ప్రజాప్రతినిధులు ఇబ్బందులు పడుతున్నారు
జిల్లాకు కొత్తగా 136 పంచాయతీ భవనాలు
40 చోట్ల మాత్రమే ప్రారంభం
న్యూస్టుడే, నవీపేట
స్టేషన్ ఏరియా పంచాయతీ భవనం
నవీపేట మండలం స్టేషన్ ఏరియా పంచాయతీ కార్యాలయం ఇది. పాత వీడీవో క్వార్టర్స్ గదిలో కొనసాగిస్తున్నారు. ఇరుకుగా ఉండటంతో సిబ్బంది, ప్రజాప్రతినిధులు ఇబ్బందులు పడుతున్నారు. పక్కా భవన నిర్మాణానికి రూ.20 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ నెలాఖరు వరకు పనులు ప్రారంభించాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు.
రాష్ట్ర ప్రభుత్వం గిరిజన తండాలు, అనుబంధ గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. పలు చోట్ల తాత్కాలికంగా అద్దె, ప్రభుత్వ పాత, మహిళా మండలి భవనాల్లో కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కొత్తగా 136 భవనాలను మంజూరు చేసింది. ఉపాధిహామీ కింద ఒక్కో భవనానికి రూ.20 లక్షల చొప్పున రూ.27.20 కోట్ల నిధులు కేటాయించింది. పనులను పంచాయతీరాజ్శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. గడువు సమీపిస్తున్నా ఇప్పటి వరకు 40 చోట్ల మాత్రమే ప్రారంభమైనట్లు డీఆర్డీవో చందర్ చెప్పారు.
స్థలం లేక జాప్యం
మహిళా మండలి భవనంలో తాత్కాలికంగా పంచాయతీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాం. కొత్త భవన నిర్మాణానికి ఇటీవల రూ.20 లక్షలు మంజూరయ్యాయి. గ్రామంలో ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోవడంతో పనుల ప్రారంభంలో జాప్యం జరుగుతోంది.
స్థలం కోసం అన్వేషిస్తున్నాం.
రాము, సర్పంచి, మట్టయ్యఫారం తండా గుత్తేదారులు
ముందుకు రావడం లేదు
భవన నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులకు సూచించాం. పనులు చేసేందుకు కొంత మంది గుత్తేదారులు ముందుకురావడం లేదని సమాచారం ఉంది. సత్వరమే ప్రారంభించేందుకు ఆయా శాఖల అధికారుల సమన్వయంతో నిరంతరం పర్యవేక్షిస్తున్నాం.
చందర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, నిజామాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటర్లో అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ 27వ స్థానంలో, ద్వితీయంలో 29వ స్థానంలో నిలిచింది. -
సమాయత్తం.. ఓట్లపైనే చిత్తం
[ 25-04-2024]
లోక్సభ నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ నామ పత్రాలు దాఖలు చేశారు. -
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. -
ఫిర్యాదులపై పెరిగిన చైతన్యం
[ 25-04-2024]
ఎన్నికల నియమాలు, ఉల్లంఘనలపై పౌరుల్లో చైతన్యం పెరిగింది. ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల్ కమిషన్ 1950 కాల్సెంటర్, సీ-విజిల్ యాప్ను రూపొందించిన విషయం తెలిసిందే -
రాష్ట్రంలో చివరి స్థానం
[ 25-04-2024]
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫలితాలు నిరాశపరిచాయి. తొలిసారిగా రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. 35వ స్థానంలో నిలిచింది. -
ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం
[ 25-04-2024]
ఎల్లారెడ్డి బల్దియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. -
కళాశాలల తనిఖీలకు వేళాయె
[ 25-04-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 2024-25 నూతన విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ కోసం ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల తనిఖీలు గురువారం నుంచి చేపట్టనున్నారు. -
కోడ్ ముగిశాకే.. సవరణకు అవకాశం
[ 25-04-2024]
ఎన్నికల కోడ్ రాకముందే ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. -
అదరగొట్టారు..
[ 25-04-2024]
కుటుంబ నేపథ్యం ఏదైనా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని అహర్నిశలు కష్టపడ్డారు. నిపుణుల వద్ద సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రణాళికబద్ధంగా చదివారు. పరీక్షలు రాశారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!