వసూళ్లు శత శాతం.. గ్రంథాలయాలకు ఎగనామం
ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం వివిధ ప్రకటనలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో గ్రంథాలయాల బలోపేతానికి నిధులు అవసరం. ఏళ్లుగా సెస్సు రూపేణ రావాల్సిన నిధులు జమ కావడం లేదు
పంచాయతీ, పురపాలికలకు మెరుగ్గా రాబడి
సెస్సు చెల్లింపుల్లో నిర్లక్ష్యం
న్యూస్టుడే, కామారెడ్డి విద్యావిభాగం
జిల్లా గ్రంథాలయంలో చదువుకుంటున్న ఉద్యోగార్థులు
ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం వివిధ ప్రకటనలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో గ్రంథాలయాల బలోపేతానికి నిధులు అవసరం. ఏళ్లుగా సెస్సు రూపేణ రావాల్సిన నిధులు జమ కావడం లేదు. ఫలితంగా కేంద్రాల అభివృద్ధి కుంటుపడింది. ఆస్తి పన్నుతోపాటు గ్రంథాలయ సెస్సును ప్రజల నుంచి వసూలు చేస్తున్న పంచాయతీలు, పురపాలికలు గ్రంథాలయాల ఖాతాలో జమ చేయకపోవడంతో ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 90 శాతానికి పైగా పన్నులు వసూలయ్యాయి. మార్చి 31 గడువు ముగియగానే సెస్సు చెల్లిస్తే విజ్ఞాన బాంఢాగారాలకు ప్రయోజనం చేకూరుతుంది.
నాలుగేళ్లుగా నయా పైసా ఇవ్వలేదు
జిల్లాలో మూడు పురపాలకలు, 526 పంచాయతీలు ఉన్నాయి. 22 మండలాల్లో 17 గ్రంథాలయ శాఖలున్నాయి. వీటికి రావాల్సిన లక్షలాది రూపాయలు బకాయిపడ్డాయి. నాలుగేళ్లుగా నయా పైసా సెస్సు చెల్లించిన దాఖలాలు లేవు. చిన్నపాటి మరమ్మతులు, మౌలిక వసతుల కల్పనకు వీలు లేకుండా పోతోంది. అధికారులు పలుమార్లు పంచాయతీలకు లేఖ రాసినా స్పందించడం లేదు. గతేడాది తాఖీదులు జారీ చేయడంతో పలు కేంద్రాల నుంచి స్పందన వచ్చింది. గతంలో సెస్సుకు సంబంధించిన దస్త్రాలు పురపాలికల్లో గల్లంతయ్యాయి. పలువురు ఆస్తి పన్నుకు సంబంధించి చెక్కులు ఇస్తుండటంతో బల్దియా ఖాతాలో జమ చేస్తున్నారు. వీటిని గ్రంథాలయానికి బదలాయింపు చేయడం లేదు.
ఆశల ఊసులు
మూడేళ్ల క్రితం సర్పంచులకు జిల్లా గ్రంథాలయంలోనే శిక్షణ తరగతులు నిర్వహించారు. పంచాయతీల్లో జమవుతున్న సెస్సును వెంటనే చెల్లించాలని సూచించినావారి నుంచి స్పందన కరవైంది. ప్రస్తుతం ఉద్యోగాల ప్రకటనల నేపథ్యంలో అభ్యర్థులు గ్రంథాలయాలకు వస్తున్నారు. వసతుల లేమి కారణంగా వారికి అగచాట్లు తప్పడం లేదు. బకాయిలు సమకూరితే బల్లలు, కుర్చీలు, పుస్తకాలు తెప్పించే వీలుంది. అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటికే నోటీసులు అందజేశాం
- పున్న రాజేశ్వర్, గ్రంథాలయ జిల్లా ఛైర్మన్
పంచాయతీలు సెస్సు బకాయిలను వెంటనే చెల్లించాలని ఇటీవల పురపాలికలు, పంచాయతీలకు నోటీసులు అందజేశాం. ఇవి సమకూరితే అభివృద్ధి చేసుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుతం దాతల సహాయంతో వసతులు సమకూరుస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయాలి.. చైతన్యం చాటాలి
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా స్వీప్ ద్వారా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. -
ఆధారాలు చూపిస్తే నగదు వాపస్
[ 29-03-2024]
పార్లమెంట్ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినందున పోలీసు, ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్ బృందాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయని, రూ.50 వేల కంటే ఎక్కువ నగదు, బంగారం, వెండి, ఇతర వస్తువులకు -
లక్ష్య సాధనలో పరుగులు
[ 29-03-2024]
జిల్లాలో వ్యవసాయోత్పత్తులు ఆశాజనకంగా ఉండటంతో మార్కెట్ ఫీజు వసూళ్లు ఈ ఏడాది ఊపుమీదున్నాయి. -
ఇంటి వద్దే ఓటు
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల్లోనూ దివ్యాంగులు, వయోవృద్ధులకు ఇంటి వద్దనే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. -
బాసరలో జంట ఆత్మహత్య ఘటనలో యువకుడి గుర్తింపు
[ 29-03-2024]
బాసర రైల్వే స్టేషన్లో బుధవారం రాత్రి ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. -
నిధులు లేక.. నిలిచిన భూ సేకరణ
[ 29-03-2024]
జిల్లాలోని సాగునీటి పథకాల నిర్మాణాలకు నిధుల విడుదలలో జాప్యంతో భూ సేకరణ నిలిచిపోయింది. కాళేశ్వరం ప్యాకేజీ-22 పనులతో పాటు నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. -
స్తబ్దుగా సలహా సంఘాలు
[ 29-03-2024]
ప్రజల భాగస్వామ్యంతో ఆయా శాఖల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం సలహా సంఘాలను(అభివృద్ధి కమిటీలు) ఏర్పాటు చేస్తుంది. -
చోరీలకు పాల్పడిన నిందితుడి రిమాండ్
[ 29-03-2024]
మద్యానికి బానిసై చోరీలు చేసిన నిందితుడిని రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ సత్యనారాయణ పేర్కొన్నారు. పట్టణంలోని కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. -
కుళాయి కనెక్షన్లు.. ఆన్లైన్లో తప్పులు
[ 29-03-2024]
పాలనలో పారదర్శకత పెంచడానికి, ప్రజలకు జవాబుదారీతనం కలిగించడానికి ఆన్లైన్ విధానం అమల్లోకి తెచ్చినా క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో అపసోపాలు తప్పడం లేదు. -
కర్ణాటకలో జిల్లా దంపతుల బలవన్మరణం
[ 29-03-2024]
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా సోమవార్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
కన్నారా.. ఇది విన్నారా?
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్