వివాదానికి పరిష్కారం దొరికేనా!
తెలంగాణ విశ్వవిద్యాలయం పాలకమండలి సమావేశం శనివారం జరగనుంది. హైదరాబాద్లోని రూసా భవనంలో ఉదయం 11 గంటలకు సభ్యులు భేటీ కానున్నారు.
నేడు తెవివి పాలకమండలి భేటీ
ఈనాడు, నిజామాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయం పాలకమండలి సమావేశం శనివారం జరగనుంది. హైదరాబాద్లోని రూసా భవనంలో ఉదయం 11 గంటలకు సభ్యులు భేటీ కానున్నారు. ముందస్తుగా నిర్ణయించిన సమావేశమైనప్పటికీ.. వర్సిటీలో నెలకొన్న వివాదాలకు పరిష్కారాలు కనుగొనే అవకాశం ఉంటుందా..? అనే చర్చ సాగుతోంది. పాలకమండలి నియమించిన రిజిస్ట్రార్ ఆ బాధ్యతలకు దూరంగా ఉంటున్నారు. ఉపకులపతి నియమించిన రిజిస్ట్రార్ అధికారిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. మే నెల వేతనాల బిల్లులపై ఆయన సంతకాలు చేశారు. ప్రస్తుతం అవి బ్యాంకుకు చేరాయి. అయితే రిజిస్ట్రార్ విషయంలో గత నెల ఇదే సమయానికి రిజిస్ట్రార్ ఎవరనే విషయంలో సందిగ్ధతతో బ్యాంకు వారు బిల్లులను అనుమతించని విషయం తెలిసిందే. మళ్లీ అదే పరిస్థితులు నెలకొన్నాయి. బ్యాంకు వారు వాటిని అనుమతిస్తారా..తిరస్కరిస్తారనేది సోమవారం లోపు తేలిపోనుంది.
భిన్నవాదలతో ఎన్నాళ్లు..: పాలకమండలిలో విద్యశాఖ కార్యదర్శి, కళాశాల విద్య కమిషనర్లు ప్రభుత్వం తరఫున ఎక్స్ అఫీషియో సభ్యులు ఉంటారు. ఉపకులపతికి, పాలకమండలికి మధ్య అభిప్రాయభేదాల నేపథ్యంలో సమావేశాలు జరుగుతున్న తీరు వివాదాస్పదం అవుతోంది. ఉపకులపతి హాజరుకావటం లేదు. ఎక్స్అఫీసియో హోదాలో పాల్గొంటున్న ఐఏఎస్లలో ఒకరు ఛైర్మన్గా సమావేశాలు జరుగుతున్నాయి. విశ్వవిద్యాలయాల చట్టానికి లోబడి ఈ విధంగా ముందుకెళ్తున్నామని వివరిస్తున్నారు. కాగా.. పాలకమండలికి ఛైర్మన్ హోదా ఉపకులపతిగా తనదే అని.. తాను లేకుండా సమావేశాలు నిర్వహించటం, తీర్మానాలు చేయటం చెల్లుబాటు కావనేది ఉపకులపతి వాదన. ఈ విషయంలో ఆయన కోర్టుకు వెళ్లి మరీ మధ్యంతర ఉత్తర్వులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. సభ్యులు తాను లేకుండా ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని ఆయన చెబుతున్నారు. ఈ మేరకు ఆయన ఓ లేఖనూ విడుదల చేశారు.
కొనసాగుతున్న గందరగోళం: ఉప కులపతి, పాలక మండలికి మధ్య విభేదాలు న్యాయస్థానం వరకు చేరటంతో వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఇరువురు ఏకతాటిపైకి వచ్చి చర్చించే పరిస్థితులు కనిపించటం లేదు. ఉపకులపతి తనకు అధికారాలున్నాయని చెబుతూ రిజిస్ట్రార్ను నియమిస్తూ పోతున్నారు. పాలకమండలి ఇదే తరహాలో మరొకరిని నియమిస్తోంది. ఇలా ఎవరి దారి వారిదే అవుతున్న తరుణంలో వర్సిటీ పాలనలో గందరగోళం నెలకొంటోంది. గడిచిన ఏడాదిన్నర కాలంలో జరిగిన నిధుల వ్యయాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయనేది పాలకమండలి వాదన. అలాంటిదేమీ లేదని ఉపకులపతి చెప్పుకొస్తున్నారు. ఇందులో ఏది నిజం అని తేల్చితే కాని వివాదం ఒక కొలిక్కి రాదు. అది చేయాలంటే.. ప్రభుత్వం కల్పించుకోవాలి. అదే జరిగితే కొత్త సవాళ్లను ఎదుర్కొవాల్సి వస్తుందనే చర్చ మొదలైంది. కోర్టులో మధ్యంతర ఉత్తర్వులపై పాలకమండలి వేసిన పిటీషన్ విచారణకు వచ్చాక గానీ చేసిన తీర్మానాల అమలుకు అడుగులు పడే పరిస్థితి కనిపించటం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వడ్ల కొనుగోలు సెంటర్ ప్రారంభం
[ 29-03-2024]
జిల్లా పాలనధికారి జితేష్ వి పాటిల్ ఆదేశాలనుసారం శుక్రవారం మండల కేంద్రంలోని లక్ష్మాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించినట్లు ఎల్లారెడ్డి సొసైటీ సీఈవో విశ్వనాథం తెలిపారు. -
ఓటేయాలి.. చైతన్యం చాటాలి
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా స్వీప్ ద్వారా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. -
ఆధారాలు చూపిస్తే నగదు వాపస్
[ 29-03-2024]
పార్లమెంట్ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినందున పోలీసు, ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్ బృందాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయని, రూ.50 వేల కంటే ఎక్కువ నగదు, బంగారం, వెండి, ఇతర వస్తువులకు -
లక్ష్య సాధనలో పరుగులు
[ 29-03-2024]
జిల్లాలో వ్యవసాయోత్పత్తులు ఆశాజనకంగా ఉండటంతో మార్కెట్ ఫీజు వసూళ్లు ఈ ఏడాది ఊపుమీదున్నాయి. -
ఇంటి వద్దే ఓటు
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల్లోనూ దివ్యాంగులు, వయోవృద్ధులకు ఇంటి వద్దనే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. -
బాసరలో జంట ఆత్మహత్య ఘటనలో యువకుడి గుర్తింపు
[ 29-03-2024]
బాసర రైల్వే స్టేషన్లో బుధవారం రాత్రి ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. -
నిధులు లేక.. నిలిచిన భూ సేకరణ
[ 29-03-2024]
జిల్లాలోని సాగునీటి పథకాల నిర్మాణాలకు నిధుల విడుదలలో జాప్యంతో భూ సేకరణ నిలిచిపోయింది. కాళేశ్వరం ప్యాకేజీ-22 పనులతో పాటు నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. -
స్తబ్దుగా సలహా సంఘాలు
[ 29-03-2024]
ప్రజల భాగస్వామ్యంతో ఆయా శాఖల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం సలహా సంఘాలను(అభివృద్ధి కమిటీలు) ఏర్పాటు చేస్తుంది. -
చోరీలకు పాల్పడిన నిందితుడి రిమాండ్
[ 29-03-2024]
మద్యానికి బానిసై చోరీలు చేసిన నిందితుడిని రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ సత్యనారాయణ పేర్కొన్నారు. పట్టణంలోని కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. -
కుళాయి కనెక్షన్లు.. ఆన్లైన్లో తప్పులు
[ 29-03-2024]
పాలనలో పారదర్శకత పెంచడానికి, ప్రజలకు జవాబుదారీతనం కలిగించడానికి ఆన్లైన్ విధానం అమల్లోకి తెచ్చినా క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో అపసోపాలు తప్పడం లేదు. -
కర్ణాటకలో జిల్లా దంపతుల బలవన్మరణం
[ 29-03-2024]
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా సోమవార్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు