logo

ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాటం

ప్రజాస్వామిక తెలంగాణ కోసం ప్రజలు, వివిధ వర్గాలు పోరాటాలకు సిద్ధం కావాలని బహుజన సమాఖ్య జిల్లా కన్వీనర్‌ క్యాతం సిద్దిరాములు, తెలంగాణ జన సమితి రాష్ట్ర కన్వీనర్‌ నిజ్జన రమేశ్‌ అన్నారు.

Published : 03 Jun 2023 05:43 IST

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: ప్రజాస్వామిక తెలంగాణ కోసం ప్రజలు, వివిధ వర్గాలు పోరాటాలకు సిద్ధం కావాలని బహుజన సమాఖ్య జిల్లా కన్వీనర్‌ క్యాతం సిద్దిరాములు, తెలంగాణ జన సమితి రాష్ట్ర కన్వీనర్‌ నిజ్జన రమేశ్‌ అన్నారు. జిల్లాకేంద్రంలో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద శుక్రవారం నిరసన తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు వదిలినవారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణలో పదేళ్లలో చెప్పుకోదగిన ప్రగతి కరవైందన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, నిరుద్యోగ భృతి, రుణమాఫీ, ఉద్యోగాల కల్పన తదితర సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోందన్నారు. భారాస సర్కారును గద్దె దించితేనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు, తెజస జిల్లా ప్రతినిధులు కుంబాల లక్ష్మణ్‌, పూల్‌సింగ్‌ తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు