మీలో మార్పు కోరుకుంటూ వెళ్లొస్తా..!
పది రోజులుగా మీ అభిమానం, భక్తి పారవశ్యం చూసి ముగ్దుడనయ్యాను. నన్ను భువిలోకి స్వాగతించడానికి పక్షం రోజులు మీరు పడిన శ్రమ హృదయాన్ని తాకింది. ప్రతిష్ఠాపన నుంచి నియమనిష్ఠలతో చేసిన పూజా సేవలు అద్భుతం.
బోధన్ పట్టణం, న్యూస్టుడే
ప్రియ భక్తులకు...
పది రోజులుగా మీ అభిమానం, భక్తి పారవశ్యం చూసి ముగ్దుడనయ్యాను. నన్ను భువిలోకి స్వాగతించడానికి పక్షం రోజులు మీరు పడిన శ్రమ హృదయాన్ని తాకింది. ప్రతిష్ఠాపన నుంచి నియమనిష్ఠలతో చేసిన పూజా సేవలు అద్భుతం. విఘ్నాలను తొలగించడానికి వచ్చిన నేను నా ధర్మాన్ని అనుసరించి ఈ సారి మనిషి జీవన విధానంపై దృష్టి నిలిపాను. సమాజంలో పరిణామాలు, దుర్ఘటనలు, వివిధ సమస్యలు ప్రజలను సతమతం చేస్తున్నాయని స్పష్టమైంది. విఘ్నాలు దూరమవడానికి జీవన విధానంలో మార్పులు అనివార్యమని గుర్తించాను. తరతరాలుగా ధర్మం నేర్పినవి అనుసరించడంలో వెనకబడిన అంశాల్లో మార్పు కోసం కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్నాను.
పర్యావరణం
జలవనరులు, వృక్షాలు, అడవులు సంరక్షిస్తేనే మానవ మనుగడ. సాగుతో భూమిలోకి ఇంకిస్తున్న రసాయన ఎరువుల నుంచి వ్యర్థాలతో జలవనరుల కలుషితం, వృక్షాల నరికివేత, వాయు కాలుష్యం... ఇవన్నీ నేటి వాతావరణ మార్పులకు కారణం. రాబోయే భారీ విపత్తుల నుంచి రక్షణ కావాలంటే ఇప్పటి నుంచైనా ప్రకృతిని ప్రేమించడం నేర్చుకోండి.
బద్ధకం వీడండి
వ్యక్తి విజయానికి దోహదం చేసేది క్రమశిక్షణ. నిద్రలేచి వ్యాయామం మొదలు నిద్రించేవరకు సమయానుకూలంగా పనులు నిర్వర్తించాలి. వ్యాయామం, ధ్యానం, నడక శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు. నిద్రలేచే మొదలు తలపెట్టిన పనుల పూర్తిలో బద్ధకం వీడాలి.
సమయపాలన
కాలయాపన చాలా మందిలో ప్రధాన లోపంగా మారింది. విద్యార్థులు విద్యాసంవత్సరం ప్రారంభంలో కాలయాపన చేసి పరీక్షల సమయంలో సిలబస్ అంతా నెత్తిమీద పెట్టుకుంటున్నారు. ఫలితాలపై అంచనాకు వచ్చి ఒత్తిడిలో తనువు చాలిస్తున్నారు. క్రమపద్ధతిలో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఈ సమస్య ఉత్పన్నం కాదు. అధికారులు, నాయకులు రహదారి నిర్మాణాల్లో చేస్తున్న జాప్యం ప్రాణాపాయంగా మారుతోంది. దీనిని నిలువరించాలి.
ఆర్థిక ప్రణాళికలు
అప్పులతో కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే దుర్ఘటనలు కలచివేశాయి. అత్యాశ, విచ్చలవిడి వ్యయాలు ఆర్థిక కష్టాలకు కారణం. వచ్చే ఆదాయాన్ని సమర్థవంతంగా ఖర్చు చేసే పరిజ్ఞానం పెంచుకోవాలి. అవసరమేదనే గ్రహించే విజ్ఞానం అవసరం. ముఖ్యంగా బెట్టింగ్లు, జూదం, తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే కోరిక అప్పులు చేయడానికి ప్రేరేపిస్తోంది. చిన్నప్పటి నుంచి డబ్బు విలువ తెలియజేస్తూ, పొదుపు నేర్పించండి. అప్పు ఎలా ముప్పుగా మారుతుందో అర్థం చేయించాలి.
మానవ విలువలు
తల్లిదండ్రులే సర్వమని నమ్మి ఆది పూజలందుకునే అర్హత పొందాను. ప్రస్తుత పరిస్థితులు సమాజంలో భిన్నంగా ఉన్నాయి. మాట వినకపోవడం, వృద్ధాప్యంలో నిరాదరణ, ఆస్తి కోసం హత్య చేయడం వంటివి కలచివేశాయి. ఈ విషయంలో మార్పు తప్పనిసరి. తల్లిదండ్రులు, తోబుట్టువులు, తోటి మనుషులతో ప్రేమతో మెలగాలి. ముఖ్యంగా స్త్రీలను గౌరవించడం నేర్చుకోండి.
వ్యసనాలకు దూరం
ప్రస్తుతమున్న దురలవాట్లకు తోడుగా డిజిటల్ వ్యసనం వచ్చి చేరింది. ఒక్క క్షణం గ్యాడ్జెట్లు కనిపించకపోతే భరించలేకపోతున్నారు. అంతలా బానిసలయ్యారు. నెమ్మదిగా తెర సమయం తగ్గించుకోవడానికి పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి. పక్కనే ఉన్నా మనుషులతో సంబంధం లేకుండా పోయిన తరుణంలో కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నం అవుతున్నాయని గ్రహించండి.
వ్యక్తిగత, పరిసరాల శుభ్రత
ఈ సారి చాలా మంది జ్వరం, జలుబు, దగ్గు వంటి అనారోగ్యంతో కనిపించారు. ఎవరో వస్తారని వేచి చూడకుండా పరిసరాల్లో, ఇంట్లో వ్యర్థాల నిర్వహణ సమర్థవంతంగా చేపట్టాలి. వ్యక్తిగతంగానూ శుభ్రత పాటిస్తే ప్రయోజనం. అనారోగ్యం బారిన పడితే పనిదినాలు కోల్పోవడం, చికిత్స ఖర్చులతో ఆర్థికం భారం పడుతుందని గ్రహించండి.
నైతిక విలువలు
వ్యాపారం, ఉద్యోగం, కుటుంబంలో నైతికత అత్యావశ్యకం. నమ్మకానికి తిలోదకాలిచ్చి పరస్పరం మోసం చేసుకునే తీరు బాధాకరం. తినే ఆహారంలో కల్తీ, లంచావతారులు, వివాహేతర సంబంధాలు వంటివి సామాజిక విలువలను దిగజారుస్తున్నాయి. ఈ విషయంలో మాత్రం ఎవరికి వారే ఆత్మపరీక్ష చేసుకోవాలి.
వారసత్వం
ఆచార, సంప్రదాయాల వారసత్వాన్ని భావితరాలకు అందించడంలో కృషి చేయాలి. అది వ్యక్తిగత, కుటుంబ, సామాజిక అనుబంధాలు కావొచ్చు. ఇతర అంశాల్లో వారసత్వాన్ని సంరక్షించుకోవడానికి కృషి చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతివలే.. గెలుపు నిర్ణేతలు
[ 02-12-2023]
శాసనసభ ఎన్నికల ఓటింగ్ ముగిసింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని తొమ్మిది నియోజకవర్గాల్లో నమోదైన పోలింగ్ వివరాలను మహిళలు, పురుషుల వారీగా అధికారులు వెల్లడించారు. -
గత స్ఫూర్తికి గండి
[ 02-12-2023]
అసెంబ్లీ ఎన్నికల క్రతువులో వంద శాతం ఓట్లు సాధించాలని నాయకులు తీవ్రంగా శ్రమించారు. దాదాపుగా నియోజకవర్గంలోని ప్రతీ ఓటరును ఏదో ఒక రకంగా చేరుకోవడానికి ప్రయత్నించారు. -
ఏ ఊరు ఎటువైపు నిలిచిందో..
[ 02-12-2023]
శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసి.. ఫలితాలు వెల్లడి కావడానికి ఒక్కరోజే మిగిలింది. -
అంతా ఓకేనా..
[ 02-12-2023]
శాసనసభ ఎన్నికల్లో భాగంగా కీలక ఘట్టమైన పోలింగ్ ముగిసింది. ఈ నెల 3వ తేదీన మధ్యాహ్నం వరకు ఫలితాలు తేలనున్నప్పటికీ.. -
పాలిటెక్నిక్ కళాశాలల్లో ఓట్ల లెక్కింపు
[ 02-12-2023]
శాసన సభ ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరింది. పోలింగ్ ముగియడంతో 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. -
ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు
[ 02-12-2023]
అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి ఘట్టం పూర్తయింది. ఇక ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఎవరెటున్నారో..? గెలుపెవరిదో..?
[ 02-12-2023]
జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ఎవరెవరు గెలుస్తారు..? విజయావకాశాలు ఏంటి..? ఏ వర్గం ఓట్లు ఎవరికి అనుకూలం..? ఇదే ప్రస్తుతం అంతటా కొనసాగుతున్న ప్రధాన చర్చ. -
‘కాంగ్రెస్కు పట్టం కట్టాలని నిర్ణయించారు’
[ 02-12-2023]
ప్రజలు ఈసారి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని నిర్ణయించారని అర్బన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షబ్బీర్ అలీ తెలిపారు. -
సరిహద్దు దాటిన పందేలు
[ 02-12-2023]
అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో గెలుపు గుర్రాలు ఎవరనే దానిపై బెట్టింగులు జోరందుకున్నాయి. -
పోలింగ్ ముగిసింది...ఊరు కదిలింది...
[ 02-12-2023]
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా గ్రామాల్లో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలతో సందడి నెలకొంది. -
ఏ మీట నొక్కారో..!
[ 02-12-2023]
శాసనసభ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ గురువారం ముగిసింది. ఉదయం నుంచి ఓటర్లు కేంద్రాల వద్ద బారులు తీరి ఓటేశారు. -
52 రోజుల్లో రూ.7.02 కోట్ల నగదు స్వాధీనం
[ 02-12-2023]
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది మొదలు.. పోలీసులు, ఆబ్కారీ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లతో ఎక్కడికక్కడ కట్టడి చేయడంతోనే అక్రమాలకు అడ్డుకట్ట వేయగలిగారు. -
30, 30(ఎ) పోలీసు యాక్టుల అమలు
[ 02-12-2023]
జిల్లాలో 30, 30(ఎ) పోలీసు యాక్టులు అమలు చేస్తున్నట్లు ఎస్పీ సింధుశర్మ పేర్కొన్నారు. -
స్వస్థలానికి కదిలి.. ఓటేసి
[ 02-12-2023]
మండల కేంద్రానికి చెందిన కొందరు ఓటర్లు వివిధ జిల్లాలకు ఉపాధి నిమిత్తం వెళ్లిపోయారు.


తాజా వార్తలు (Latest News)
-
టీచర్ అవుదామనుకొని..
-
రెండిళ్ల గొడవ.. రోడ్డెక్కింది గోడై!
-
IPL: ఐపీఎల్ వేలం.. 1166 మంది క్రికెటర్ల ఆసక్తి
-
Israel-Hamas Conflict: ఆగిన కాల్పులు విరమణ.. ఇజ్రాయెల్ దాడిలో 178 మంది మృతి
-
తుపాకులతో చొరబడి బ్యాంకులో రూ.18 కోట్ల దోపిడీ
-
Gujarat: గుండెపోటుతో 6 నెలల్లో 1052 మంది మృతి.. 80శాతం 25ఏళ్ల లోపువారే!