పెట్టుబడులకు అవకాశాలు పుష్కలం
ఒడిశాలో పెట్టుబడులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు. బుధవారం దుబాయ్లో నిర్వహించిన ‘మేకిన్ ఒడిశా’
పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహకారం
దుబాయ్ ‘మేకిన్ ఒడిశా’ సదస్సులో సీఎం నవీన్
యూసఫ్ అలీ హమీదితో చర్చిస్తున్న ముఖ్యమంత్రి
భువనేశ్వర్, న్యూస్టుడే: ఒడిశాలో పెట్టుబడులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు. బుధవారం దుబాయ్లో నిర్వహించిన ‘మేకిన్ ఒడిశా’ పెట్టుబడిదారుల సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఖనిజ సంపదలు పుష్కలంగా ఉన్నాయని, పెట్టుబడిదారులకు భద్రత, సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. తమది శాంతియుత రాష్ట్రమని, స్థిరమైన ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పారు. కొవిడ్ సమయంలో రాష్ట్రానికి రూ.3.65 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఉక్కు, అల్యూమినియం, పెట్రోకెమికల్స్, విద్యుత్తు, ఐటీ, పర్యటకం, మత్స్య ఉత్పత్తులు, ప్రాసెసింగ్ రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. కువైట్కు చెందిన ఎంబీటీసీ గ్రూపు సంస్థల అధిపతి కె.జి.అబ్రహం, టబ్రీడ్ గ్రూపు చైర్మన్ డాక్టర్ యూసఫ్ అలీ హమీది తదితర ప్రముఖులతో నవీన్ చర్చించారు. కార్యక్రమంలో ఆహార పౌరసరఫరాల మంత్రి అతాను సవ్యసాచి నాయక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్ మహాపాత్ర్, పౌరసరఫరాల ప్రిన్సిపల్ కార్యదర్శి వీర్విక్రం యాదవ్, 5-టీ కార్యదర్శి వి.కార్తికేయ పాండ్యన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దుబాయ్లోని ఒబెరాయ్ ఇంటర్నేషనల్ హోటల్ వేదికగా ఏర్పాటైన సదస్సులో మధ్య ప్రాచ్య దేశాలకు చెందిన పలువురు పెట్టుబడిదారులు పాల్గొన్నారు. దీనికి ముందుగా దుబాయ్లో ఉన్న కొందరు ఒడియా ప్రముఖులు నవీన్ను కలసి మాట్లాడారు. మాతృభూమి (ఒడిశా) కోసం తమ వంతు సహకరిస్తామని, మో కాలేజ్, మో స్కూల్ కార్యక్రమాలకు నిధులు అందజేస్తామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గొంతు కోసి యువకుడి దారుణ హత్య
[ 29-03-2024]
గజపతి జిల్లాలోని గుసాని సమితి గురండి ఠాణా పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. -
కాషాయం కండువాలు ధరించిన అగ్రనేతలు
[ 29-03-2024]
దిల్లీ భాజపా కార్యాలయం వేదికగా గురువారం మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో ఇద్దరు ప్రముఖ నేతలు, మరో ప్రముఖ రచయిత్రి కాషాయం కండువాలు ధరించారు. -
తోడేలు దాడిలో ఇద్దరికి గాయాలు
[ 29-03-2024]
మల్కాన్గిరి సమితి ఎమ్.వి.93 గ్రామంలో ఇద్దరిపై తోడేలు దాడి చేయడంతో, పోరాడి హతమార్చారు. ఈ క్రమంలో వీరికి తీవ్ర గాయాలయ్యాయి -
డబుల్ ఇంజిన్ పాలన తథ్యం: అపరాజిత
[ 29-03-2024]
రాష్ట్రంలో భాజపా డబుల్ ఇంజిన్ పాలన తథ్యమని, ప్రజల్లో మార్పు కనిపిస్తోందని భువనేశ్వర్ సిటింగ్ ఎంపీ అపరాజిత షడంగి చెప్పారు. -
బిజదలో అసమ్మతి సెగ
[ 29-03-2024]
ఎన్నికల ముందు అధికార పక్షం బిజదలో అసమ్మతి సెగ తగలడంతో పార్టీకి తలనొప్పిగా మారుతోంది. రాయగడ శాసనసభ నియోజకవర్గ టికెట్ అనుసూయ మాఝికి కేటాయించడంపై రెండు వర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటుండడం పార్టీ శ్రేణులకు మింగుడుపడడం లేదు -
గోపాల్పూర్ ఓడరేవు కొనుగోలు చేసిన అదానీ
[ 29-03-2024]
తూర్పు తీరంలో సరకు రవాణాలో అగ్రగామిగా ఉన్న గోపాల్పూర్ ఓడరేవును ప్రముఖ పారిశ్రామిక గ్రూపు అదానీ కొనుగోలు చేసింది -
ప్రతిష్ఠాత్మక నియోజకవర్గం పోరు రసవత్తరం
[ 29-03-2024]
బిజద అభ్యర్థి బిక్రం పండాకు గోపాల్పూర్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నియోజకవర్గం ఓటర్లందరికీ చిరపరిచితులు. భంజవిహార్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఆయన తొలినాళ్లలో విద్యార్థి నేత -
ఎన్నికల బరిలో అతివలకు అవకాశం
[ 29-03-2024]
ఎన్నికల్లో మహిళా అభ్యర్థులకు అధిక ప్రాధాన్యం ఇస్తామని బిజద ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగా ఎన్నికల బరిలో పోటీపడేందుకు మహిళలకు అవకాశం కల్పించారు. -
‘రిడ్లీ’ల రాకకు ఎదురుచూపు
[ 29-03-2024]
విదేశీ అతిథులు ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్ల రాక వల్ల గంజాం జిల్లా ఖ్యాతిగాంచింది. రాష్ట్రంలోని రిడ్లీల పునరుత్పత్తికి మూడు కేంద్రాలుండగా, వీటిలో గంజాం జిల్లాలోని రుషికుల్యా ముఖద్వారం ఒకటి. -
శ్రీక్షేత్రంలో మీనాక్షి శేషాద్రి
[ 29-03-2024]
ప్రముఖ బాలీవుడ్ (ముంబయి) నటి, నర్తకి మీనాక్షి శేషాద్రి గురువారం పూరీ వచ్చారు. శ్రీక్షేత్రంలో జగన్నాథుడి సన్నిధిలో పూజలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!