నవవధువు ఆత్మహత్య
వివాహమైన రెండు నెలలకే నవవధువుకు నూరేళ్లు నిండిపోయాయి. అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కటక్లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
ప్రజ్ఞ పరిమిత (పాత చిత్రం)
భువనేశ్వర్ అర్బన్, న్యూస్టుడే: వివాహమైన రెండు నెలలకే నవవధువుకు నూరేళ్లు నిండిపోయాయి. అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కటక్లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కటక్కు చెందిన ప్రజ్ఞ పరిమిత స్వయిన్(23)కు భువనేశ్వర్కు చెందిన ప్రశాంత్ కుమార్ పాత్ర్తో రెండు నెలల క్రితం వివాహం జరిగింది. పది రోజుల తరువాత ఆమెకు నోటిలో పుండు అయింది. దానిని క్యాన్సర్ అనుకున్న అత్త, భర్త ప్రజ్ఞను వేధించడం ప్రారంభించారు. మోసం చేసి పెళ్లి చేశారంటూ ఇద్దరూ కలిసి ఆమెను కన్నవారి ఇంటికి పంపించేశారు. అప్పటి నుంచి మనస్తాపం చెందిన ప్రజ్ఞ ఇంట్లో ముభావంగా ఉండేది. ఆమె సోదరుడు ప్రియ వ్రత స్వయిన్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అది క్యాన్సర్ కాదని పరీక్షల్లో తేలింది. ఆ విషయాన్ని సోదరి అత్తగారికి ఫోన్ చేసి చెప్పిన ప్రియ వత్ర స్వయిన్ తమ ఇంటికి తీసుకెళ్లాలని కోరాడు. అందుకు నిరాకరించిన ప్రజ్ఞ అత్త, భర్త ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి రానిచ్చేది లేదని తేల్చి చెప్పడంతో ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో పంకాకు ఉరేసుకుని ప్రజ్ఞ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై స్వయిన్ భువనేశ్వర్ని మంచేశ్వర్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. తన సోదరిని ఆమె అత్తింటి వారే చంపేశారని పేర్కొన్నాడు. పోలీసులు దర్యాప్తు చేసి, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నితీష్ గమ్యం ఎటువైపు?
[ 20-04-2024]
సంబల్పూర్ సిటింగ్ ఎంపీ నితీష్ గమ్యం ఎటువైపు? ఈసారి ఎన్నికల్లో ఆయన భార్య అరుంధతీ దేవి తరఫున ప్రచారం చేస్తారా? భాజపాకు అనుకూలంగా ఉంటారా? అన్నదిప్పుడు చర్చనీయాంశమైంది. -
కనుల పండువగా చైత్రోత్సవాలు
[ 20-04-2024]
శక్తి స్వరూపిణి, శాంతి స్వరూపిణి మజ్జిగౌరీ అమ్మవారి చైత్రోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. -
మౌలిక సౌకర్యాలకు దూరం.. ఎన్నికల బహిష్కరణ నిర్ణయం
[ 20-04-2024]
కొంధమాల్ జిల్లా బలిగుడ సమితిలో రుతుంగియా పంచాయతీలోని గగలిమహ, పనిపదర్, పాంగాబడి గ్రామాలకు రహదారులు, తాగునీరు, అంగన్వాడీ వంటి మౌలిక సౌకర్యాలు లేవు. -
మహిళా ఓటర్లే అత్యధికం
[ 20-04-2024]
రాష్ట్రంలో తొలివిడత ఎన్నికలు జరగనున్న నాలుగు లోక్సభ స్థానాల్లో పురుషులకంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) నికుంజ బిహారీ ధొళో అన్నారు. -
బ్రహ్మపురలో నామినేషన్ల పర్వం
[ 20-04-2024]
బ్రహ్మపుర సబ్కలెక్టరు కార్యాలయం, పరిసరాలు రెండోరోజు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థులు, వారి మద్దతుదారులతో కిటకిటలాడింది. -
భాజపా మోదీ మంత్రం.. బిజద అభివృద్ధి అస్త్రం
[ 20-04-2024]
ప్రధాన పార్టీలు ఎన్నికల్లో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేస్తున్నాయి. మండుటెండలను కూడా లెక్క చేయకుండా ఓటర్ల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతున్నారు. రోడ్షోలు, పాదయాత్రలు, సభలు నిర్వహిస్తున్నారు. -
మహానదిలో పడవ మునక: ఇద్దరి దుర్మరణం
[ 20-04-2024]
ఝార్సుగుడ జిల్లా లఖన్పూర్ సమితి ఛత్తీస్గఢ్ సరిహద్దు శారదా వద్ద శుక్రవారం సాయంత్రం మహానదిలో పడవ మునిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. -
నిప్పుల కొలిమిలా రాష్ట్రం
[ 20-04-2024]
రాష్ట్రం నిప్పులకొలిమిలా మారింది. భానుని ప్రతాపంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీర ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటాయి. -
చాకుతో దాడి: యువకుడి హతం
[ 20-04-2024]
గంజాం జిల్లా నిమ్మఖండి ఠాణా పరిధిలోని బొరిగావ్ గ్రామంలోని అమ్మవారి మందిరం సమీపాన చెరువు ఒడ్డున గురువారం సాయంత్రం సునీల్ దాస్ (27) అనే యువకుడు, మరో యువకుడి మధ్య పాతకక్షల నేపథ్యంలో వాగ్వాదం జరిగింది.