కొరాపుట్లో స్తంభించిన జనజీవనం
కొరాపుట్ జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. జిల్లాలో ఆదివారం 486.3 మి.మీ. వర్షపాతం నమోదైంది.
లిమిక వద్ద కల్వర్టు పైనుంచి వరద పరవాహం
సిమిలిగుడ, న్యూస్టుడే: కొరాపుట్ జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. జిల్లాలో ఆదివారం 486.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. దశమంత్పూర్లో అత్యధికంగా 63.0 మి.మీ., పొట్టంగిలో అత్యల్పంగా 8.0 మి.మీ. వర్షపాతం నమోదైంది. కొరాపుట్ సమితిలోని లిమిక గ్రామంలో కల్వర్టు పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ పరిసర ప్రాంతంలో పంట పొలాలు నీట మునిగాయి. నందపూర్ ఠాణా మార్గంలోనూ రోడ్డు నీరు ప్రవహించింది. వర్షం కారణంగా వారపు సంతలు బోసిపోయాయి. అటవీ ఉత్పత్తుల విక్రయాలు సాగక గిరిజనులు ఉసూరుమంటూ ఇళ్లకు వెనుదిరిగారు.
నీట మునిగిన పొలాలు
గుణుపురం, న్యూస్టుడే: రాయగడ జిల్లా గుణుపురం, పద్మపురం ప్రాంతాల్లో శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇటీవలే రైతులు నాట్లు పూర్తి చేయగా ఆ పొలాలన్నీ నీట మునిగాయి. వివిధ ప్రాంతాల్లో చెరువులు, కాల్వల గట్లు తెగిపోయాయి. పద్మపురంలోని సునారిఘాయి కూడలికి సమీపంలో చెరువు గట్టు కోతకు గురై పొలాల్లోకి నీరు చేరింది. లవుగుడ, ఇందుపురం ప్రాంతాల్లో అధిక శాతం పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లవుగుడ సమీపంలో మైనర్ కాల్వకు గండి పడటంతో ఓ వీధిలో నీరు చేరింది. ఓవైపు ఇప్పటివరకు నీరు లేక ఆలస్యంగా వరి నాట్లు వేయగా తాజా వర్షాలతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
పద్మపురం సమీపంలో పొల్లాల్లోకి చేరిన నీరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారసులొచ్చారు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొంతమంది ప్రముఖ నాయకులు పోటీ నుంచి తప్పుకున్నారు. వారి భార్యలు, వారసులను బరిలోకి దించారు. బిజద, భాజపా, కాంగ్రెస్ పార్టీల నాయకత్వాలు వారికి అవకాశం కల్పించాయి. తండ్రులు, తల్లులు వారి తరుఫున ప్రచారం చేస్తున్నారు. -
కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘హెర్’ టీం
[ 19-04-2024]
మహిళల్ని వేధించే వారి భరతం పట్టడానికి జంటనగరాల (భువనేశ్వర్, కటక్) కమిషనరేట్ యంత్రాంగం ‘హై ఎఫిషియన్సీ రెస్పాన్స్ (హెరా) టీం ఏర్పాటు చేసింది. -
సత్వర విద్యుత్తు సేవలకు ‘సంచార సబ్ స్టేషన్’లు
[ 19-04-2024]
వేసవిలో ప్రజలకు మరింత మెరుగైన విద్యుత్తు సేవలు అందించేందుకు, సరఫరాలో అంతరాయం ఏర్పడితే సత్వర సేవలకు ‘సంచార సబ్ స్టేషన్’లు సిద్ధం చేశామని విద్యుత్తు సరఫరా సంస్థ ‘టాటా పవర్ సదరన్ ఒడిశా డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్’ (టీపీఎస్ఓడీఎల్) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది -
జగన్నాథునికి రూ.2.51 కోట్ల విరాళం
[ 19-04-2024]
రిలయన్స్ గ్రూపు సంస్థల అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ బుధవారం పూరీ శ్రీక్షేత్రానికి వచ్చారు. జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
సచిదాస్ కన్నుమూత
[ 19-04-2024]
జత్రా పార్టీ (నాటకాలు) దర్శకునిగా, నటునిగా ఖ్యాతి గాంచిన సచిదాస్ (91) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అస్వస్థతతో కటక్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. -
ఎవరి ప్రయోజనాల కోసం రెండుచోట్ల పోటీ?
[ 19-04-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మళ్లీ రెండుచోట్ల పోటీకి సిద్ధమయ్యారు. దీనివల్ల ప్రజలకు ఒరిగేదేమిటని? ఈ పోటీ ఎవరి ప్రయోజనాల కోసమని? సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో ఉప ఎన్నిక, వ్యయప్రయాసలు మినహా సాధించేదేమిటని విమర్శలు వినిపిస్తున్నాయి. -
నేటి నుంచి మజ్జిగౌరీ చైత్రోత్సవాలు
[ 19-04-2024]
రాయగడ ఉత్కళాంధ్రుల ఇలవేల్పు, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి మజ్జిగౌరీ అమ్మవారి చైత్రోత్సవ సంబరాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. -
‘శ్రేష్ఠ భారత్’ ఏర్పాటుకు అంతా సహకరించాలి
[ 19-04-2024]
‘శ్రేష్ఠ భారత్’ లక్ష్యంగా దేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలు, అన్ని రంగాల సమగ్ర అభివృద్ధికి ప్రధాని మోదీ 2024 సంకల్ప పత్రం జారీ చేశారని, ప్రజలంతా సహకరించి, మరోసారి మోదీని ప్రధాని చేసేందుకు ముందుకు రావాలని బ్రహ్మపుర లోక్సభ భాజపా అభ్యర్థి ప్రదీప్ కుమార్ పాణిగ్రహి కోరారు -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
[ 19-04-2024]
గంజాం జిల్లా గొళంత్రా ఠాణా పరిధిలోని కొణిసి-తుళు మార్గంలో బుధవారం మధ్యాహ్నం రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు యువకులు ఎమ్కేసీజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు