విపత్తులు వెంటాడుతున్నాయ్.. ప్రగతికి ప్రతిబంధకాలవుతున్నాయ్!
ఒడిశాకు తరచుగా విపత్తులు చుట్టుముడుతున్నాయని, రాష్ట్ర ప్రగతికి ప్రతిబంధకాలవుతున్నాయని నవీన్ పట్నాయక్ అన్నారు. ఆదివారం దిల్లీ లోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏర్పాటైంది.
నీతిఆయోగ్ సమావేశంలో సీఎం నవీన్
సమావేశంలో ప్రధాని మోదీ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో సీఎం నవీన్ పట్నాయక్
భువనేశ్వర్, న్యూస్టుడే: ఒడిశాకు తరచుగా విపత్తులు చుట్టుముడుతున్నాయని, రాష్ట్ర ప్రగతికి ప్రతిబంధకాలవుతున్నాయని నవీన్ పట్నాయక్ అన్నారు. ఆదివారం దిల్లీ లోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏర్పాటైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నవీన్ రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులు మోదీ దృష్టికి తీసుకెళ్లారు. సాయం చేయాలని కోరారు.
ప్రధానికి అభినందన
కరోనా మహమ్మారి నియంత్రించడానికి ప్రధాని మోదీ తీసుకున్న చర్యలు, ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమం అభినందనీయమని నవీన్ ప్రశంసించారు. దిల్లీలో సీఎం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాలు ధ్యేయంగా నీతి ఆయోగ్ సమావేశంలో కీలకాంశాలు ప్రస్తావించామని చెప్పారు. ప్రత్యేక హోదా పట్ల ఆశాభావంతో ఉన్నామన్నారు.
ముఖ్యమంత్రి డిమాండ్లు ఇవే..
ఖనిజ సంపదలు పుష్కలంగా ఉన్నా రాష్ట్రం పేదరికంతో సతమతమవుతోంది. ప్రాంతీయ అసమానతలు కనిపిస్తున్నాయి. సమగ్రాభివృద్ధి సాధించాలంటే ప్రత్యేక హోదా కేటాయించాలి. కొన్నేళ్లుగా కోరుతున్నాం.
* విపత్తుల మూలంగా ఆర్థికంగా ఇబ్బందులు చవిచూస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం విపత్తుల సాయం 90:10 నిష్పత్తిలో కేటాయింపులు చేయాలి.
* రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు రైల్వే కనెక్టివిటీ, గ్రామాలకు బ్యాంకింగ్ సేవలు, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలి.
* వెనుక బడిన కేబీకే జిల్లా అభివృద్ధికి ప్రత్యేక మొత్తాలు కేటాయించాలి.
* ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన రాష్ట్రంలో సక్రమంగా అమలు కావడం లేదు. లోపాలు సరిదిద్ది అమలయ్యేలా చూడాలి.
* రాష్ట్రంలో 16 లక్షల పేదకుటుంబాలకు పక్కా ఇళ్లు కేటాయించాలని ఎంతో కాలంగా కోరుతున్నాం. నిరాశ్రయులు ఇబ్బందులు చవి చూస్తున్నారు. 2019 మే 3న ఫొని తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఉత్తరకోస్తా ప్రాంతాల్లో 6 లక్షల పూరిగుడిసెలు కూలిపోయాయి. వారందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటరుతో మాట...నేతల కొత్త బాట
[ 23-04-2024]
ఈ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు కీలకం. ఒకవైపు మోదీ కోసం భాజపా ఉద్యమిస్తుంటే... ఆరోసారి ముఖ్యమంత్రిగా నవీన్ను చూడాలని బిజద ప్రయత్నిస్తోంది. -
రాజకీయ ప్రత్యర్థులు ఎదురుపడిన వేళ...
[ 23-04-2024]
బ్రహ్మపురలోని గంజాం న్యాయవాదుల సంఘం (జీబీఏ) సమావేశ మందిరం ఆవరణలో సోమవారం రాజకీయ ప్రత్యర్థులు ఎదురుపడ్డారు. -
ఆరుగురితో బిజద 7వ జాబితా
[ 23-04-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోమవారం 6 అసెంబ్లీ స్థానాలకు 7వ జాబితా ప్రకటించారు. క్రీడలు, యువజన సర్వీసులశాఖ మంత్రి తుషార్కాంతి బెహరాకు, విద్యాశాఖ మంత్రి సుధాం మారాండి భార్య రంజితాకు, ఢెంకనాల్ ఎంపీ ముహేష్సాహుకు టికెట్లు కేటాయించారు. -
కేంద్రపడ బిజదలో భగ్గుమన్న అసంతృప్తి
[ 23-04-2024]
పార్టీకి విధేయులుగా ఉన్నవారిని పక్కన పెట్టి ఫిరాయింపు నేతలకు ఎన్నికల బరిలో దించడంతో కేంద్రపడ జిల్లా బిజదలో అసంతృప్తి భగ్గుమంది. -
సనాతన్ మహాకుడోకు పిలిచి టికెట్ ఇచ్చిన సీఎం
[ 23-04-2024]
గనులకు నిలయమైన కేంఝర్ జిల్లాలో అంతా కుబేరునిగా చెప్పుకునే సనాతన్ మహాకుడోకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక చంపువా అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా చేశారు. -
బిజదలో చేరికలు.. సన్నాహక సమావేశాలు
[ 23-04-2024]
ఎన్నికల తేదీలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి దూకుళ్లు అధికమవుతున్నాయి. -
నవరంగపూర్లో త్రిముఖం..ఎవరిదో విజయం
[ 23-04-2024]
గత పదేళ్ల కిందటి వరకు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నవరంగపూర్ లోక్సభ స్థానంలో క్రమేణా బిజద బలం పుంజుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలతోపాటు భాజపా కూడా గట్టి పోటీ ఇస్తుండడంతో త్రిముఖ పోటీ ఆసక్తికరంగా మారింది. -
గమాంగ్ దంపతుల మద్దతు ఎవరికో?
[ 23-04-2024]
రాయగడ జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్, ఆయన భార్య హేమా గమాంగ్ పేరు తెలియని వారుండరు. గిరిధర్ గమాంగ్కు సుమారు 50 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది. -
కార్మిక బంధువు నవీన్: పాండ్యన్
[ 23-04-2024]
అసంఘటిత రంగాల్లో పనులు చేస్తున్న కార్మికులకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బంధువయ్యారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని బిజద నేత వి.కార్తికేయ పాండ్యన్ చెప్పారు. -
పాదయాత్రలు.. ఇంటింటా ప్రచారాలు
[ 23-04-2024]
బ్రహ్మపుర అసెంబ్లీ నియోకవర్గంలో పోటీ చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. భాజపా అభ్యర్థి కె.అనిల్కుమార్ సోమవారం 11వ వార్డులోని వివిధ వీధుల్లో పాదయాత్రగా ఇంటింటా ఓటర్లను కలిసి ఓటు వేయాలని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?