ఇళ్లిస్తాం... సీఎం హామీ ఇవ్వాలి..
అర్హులకే ఇళ్లు కేటాయిస్తామని, అవినీతి, అక్రమాలకు తావీయబోమని, నిర్మించే ఇళ్ల గోడలపై ‘ఆవాస్’ లోగో ముద్రిస్తామని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని, ఆ తర్వాతే రాష్ట్రానికి 8 లక్షల ప్రధానమంత్రి
స్పష్టం చేసిన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్
గిరిరాజ్ సింగ్తో ధర్మేంద్ర ప్రధాన్, ప్రదీప్ అమత్
భువనేశ్వర్, న్యూస్టుడే: అర్హులకే ఇళ్లు కేటాయిస్తామని, అవినీతి, అక్రమాలకు తావీయబోమని, నిర్మించే ఇళ్ల గోడలపై ‘ఆవాస్’ లోగో ముద్రిస్తామని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని, ఆ తర్వాతే రాష్ట్రానికి 8 లక్షల ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) ఇళ్లు కేటాయిస్తామని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి గిరిరాజ్ సింగ్ స్పష్టం చేశారు. గురువారం మధ్యాహ్నం కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను దిల్లీలో కలిసిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రదీప్ ఆయనతో కలసి గిరిరాజ్ కార్యాలయానికి వెళ్లారు. రెండేళ్లుగా ఆవాస్ గృహాలు కేటాయించకపోవడంతో నిరాశ్రయులు ఇబ్బందులు పడుతున్నారని అమత్ కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో గిరిరాజ్ మాట్లాడుతూ గతంలో ఈ పథకం కింద మంజూరైన ఇళ్లు దుర్వినియోగమయ్యాయని, అనర్హులకు ఇళ్లు కేటాయించారని పేర్కొన్నారు. దర్యాప్తులో ఈ విషయం నిర్ధారణ అయిందన్నారు. ఆయనతో ఏకీభవించిన రాష్ట్ర మంత్రి అమత్ అవకతవకలు బయట పడిన తర్వాత ప్రభుత్వం 22 మంది అధికారులపై చర్యలు తీసుకుందని, తప్పిదాలు పునరావృతం కావని తెలిపారు. అనంతరం గిరిరాజ్ విలేకరులతో మాట్లాడుతూ అర్హులకు (పేదలు) గృహాలు కేటాయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, ఈ విషయం రాష్ట్ర మంత్రికి తెలియజేశామన్నారు. ఇళ్లు కేటాయించడానికి ముందుగా ముఖ్యమంత్రి తమ కార్యాలయానికి లేఖ రాయాలని, తప్పిదాలు పునరావృతం కావని స్పష్టం చేయాలన్నారు. సీఎం నుంచి లేఖ అందిన తర్వాత పెండింగులో ఉన్న 8 లక్షల ఇళ్లు కేటాయిస్తామన్నారు. రాష్ట్ర మంత్రి అమత్ మాట్లాడుతూ ఇళ్ల విషయమై ఆశావహ చర్చలు జరిగాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధి కొనసాగుతుంది..శంక ద్వయాన్ని ఆశీర్వదించండి
[ 25-04-2024]
రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని, బిజదను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రజల్ని కోరారు. -
భాజపాకు 40 మంది స్టార్ ప్రచారకులు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాజపా స్టార్ ప్రచారకుల జాబితా మంగళవారం రాత్రి విడుదల చేశారు. -
ఇంకెన్నాళ్లీ దుస్థితి?
[ 25-04-2024]
అధ్వానంరాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు అధ్వానంగా ఉన్నాయన్న నివేదికలు దిగజారిన ‘నాక్’ గ్రేడేషన్లు దుస్థితిని తెలియజేస్తున్నాయని కేంద్రమంత్రి నిలదీశారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో భర్తీకాని టీచింగ్ సిబ్బంది, అసౌకర్యాలు, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల డ్రాపౌట్ల గురించి ఏం సమాధానం చెబుతారన్నారు. -
ఓ తండ్రి...ఇద్దరు కొడుకులు
[ 25-04-2024]
గత అయిదున్నర దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నేత ఆయన. అన్ని పార్టీల నేతల మన్ననలు అందుకున్న వ్యక్తి. వయసుతోపాటు గౌరవం, నిక్కచ్చితనం పెంచుకున్న నికార్సయిన నేత. 80 ఏళ్ల వయసులో కొడుకు నిర్వాకంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
నామినేషన్ల సందడి
[ 25-04-2024]
బ్రహ్మపుర లోకసభ పరిధిలోని పర్లాఖెముండి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కోడూరు నారాయణరావు నామినేషన్ పత్రాన్ని సబ్ కలెక్టర్ అనూప్ పండాకు అందజేశారు. -
భాజపాలో సీమారాణి చేరిక
[ 25-04-2024]
బిజదకు రాజీనామా చేసిన హిందళ్ సిటింగ్ ఎమ్మెల్యే సీమారాణి నాయక్ బుధవారం భాజపాలో చేరారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, ఇతర నాయకులు ఆమెను స్వాగతించారు. -
నేడు అమిత్షా రాక
[ 25-04-2024]
కేంద్ర హోంమంత్రి అమిత్షా గురువారం రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం సోన్పూర్లో ఏర్పాటయ్యే ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
నా ఓటు.. నా బాధ్యత
[ 25-04-2024]
నా ఓటు నా బాధ్యత అంటూ, తప్పకుండా ఓటు వినియోగించుకుంటామని నూతన ఓటర్లు, కళాశాల విద్యార్థులన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్