logo

ఏడాది తరువాత కుమారుడి ఆచూకీ

ఇంట్లో గొడవపడి అలిగి వెళ్లిపోయిన కుమారుడి ఆచూకీ ఏడాది తరువాత తెలియడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఘటన పట్టణంలోని సౌత్‌సైడ్‌ ప్రాంతంలో జరిగింది. చంద్రకోణా పరిధిలోని

Published : 12 Aug 2022 01:37 IST

వివరాలు తెలుసుకుంటున్న సుపదీప్‌

ఖరగ్‌పూర్‌, న్యూస్‌టుడే: ఇంట్లో గొడవపడి అలిగి వెళ్లిపోయిన కుమారుడి ఆచూకీ ఏడాది తరువాత తెలియడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఘటన పట్టణంలోని సౌత్‌సైడ్‌ ప్రాంతంలో జరిగింది. చంద్రకోణా పరిధిలోని సీతానగర్‌కు చెందిన బంగ్సీ సమంతా, సరస్వతి సమంతాల కుమారుడు రామకృష్ణ సమంతా గత ఏడాది ఆగస్టు 11న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కొడుకు ఆచూకీ కోసం అనేక ప్రయత్నాలు చేసిన తల్లిదండ్రులు జాడ తెలియకపోవడంతో ఏడాదిగా మదన పడుతున్నారు. ఈ క్రమంలో వెస్ట్‌ బెంగాల్‌ రేడియో క్లబ్‌ సభ్యులు సుపదీప్‌ రాయ్‌, జయదీప్‌ స్వర్ణకార్‌లు సౌత్‌ సైడ్‌ ప్రాంతంలోని రైల్వే ఎకౌంట్స్‌ విభాగానికి పని నిమిత్తం వచ్చినప్పుడల్లా ఆ పరిసర ప్రాంతంలో అనాథలా జీవిస్తున్న యుకుడిని గమనిస్తుండేవారు. ఇటీవల మళ్లీ పని మీద వచ్చిన సుపదీప్‌ ఆ యువకుడితో మాట కలిపారు. అతి కష్టమ్మీద అతడు రామకృష్ణ అని తెలుసుకున్నారు. వివరాలు సేకరించి బుధవారం సాయంత్రం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వచ్చి కుమారుడిని చూసిన బంగ్సీ సమంతా, సరస్వతి సమంతాలు ఉప్పొంగిపోయారు. తమ వెంట ఇంటికి తీసుకెళ్లిపోయారు.

తల్లిదండ్రులతో రామకృష్ణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని