పరుగులు తీస్తున్న పారిశ్రామిక రంగం
రాష్ట్రానికి మంచిరోజులొచ్చాయని, పారిశ్రామిక రంగం పరుగులు తీస్తోందని, పెట్టుబడులు వస్తున్నాయని పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ, విద్యుత్తు శాఖల మంత్రి ప్రతాప్ దేవ్ పేర్కొన్నారు. బుధవారం రాత్రి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్
రాష్ట్రానికి తరలివస్తున్న పెట్టుబడులు
మేకిన్ ఒడిశా సదస్సు తర్వాత ఉపాధికి బాటలు
సీఎం అధ్యక్షతన హెచ్ఎల్సీఏ సమావేశం
భువనేశ్వర్, న్యూస్టుడే: రాష్ట్రానికి మంచిరోజులొచ్చాయని, పారిశ్రామిక రంగం పరుగులు తీస్తోందని, పెట్టుబడులు వస్తున్నాయని పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ, విద్యుత్తు శాఖల మంత్రి ప్రతాప్ దేవ్ పేర్కొన్నారు. బుధవారం రాత్రి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధ్యక్షతన లోక్సేవాభవన్లో హైలెవల్ క్లియరెన్స్ కమిటీ సమావేశమైంది. రూ.74,620.18 కోట్ల పెట్టుబడులకు ఆమోదముద్ర వేసింది. ఈ కార్యక్రమం తర్వాత మంత్రి ప్రతాప్ విలేకరులతో మాట్లాడుతూ.. నవంబరు నెలాఖరులో భువనేశ్వర్లో ఏర్పాటయ్యే మూడో మేకిన్ ఒడిశా సదస్సు రాష్ట్రాభివృద్ధి, ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తుందన్నారు. ఈ సదస్సుకు ముందుగా ముఖ్యమంత్రి మహారాష్ట్ర, దిల్లీ, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో రోడ్షోలు నిర్వహించి పెట్టుబడిదారులతో చర్చిస్తారని, వారిని మేకిన్ ఒడిశా సదస్సుకు ఆహ్వానిస్తారని చెప్పారు.
ప్రతాప్ దేవ్
కాశీపూర్లో భారీ నిర్మాణం
బుధవారం రాత్రి హెచ్ఎల్సీఏ ఆమోదం తెలిపిన నిర్మాణాల వివరాలు ఇవీ...
* రాయగడ జిల్లా కాశీపూర్లో అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ రూ.41,653 కోట్ల వ్యయంతో ఏడాదిలో 4 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కల అల్యూమిన రిఫైనరీ కేంద్రం ఏర్పాటు చేస్తుంది. దీంతోపాటు 175 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల క్యాప్టిన్ పవర్ ప్లాంట్ ప్రారంభిస్తుంది. 7750 మందికి ఉపాధి అవకాశాలుంటాయి.
* జాజ్పూర్ జిల్లా కళింగనగర్లో ఒడిశా అలయ స్టీల్ కంపెనీ రూ.8 వేల కోట్లతో ఏడాదిలో 2.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల ఉక్కు కర్మాగారం, 370 మెగావాట్ల ఉత్పత్తి క్యాప్టివ్ విద్యుత్కేంద్రం ఏర్పాటు చేస్తుంది.
* భద్రక్ జిల్లా ధమ్రాలో సోంపురి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూపు రూ.7811 కోట్ల వ్యయంతో పాలెట్ పరిశ్రమ, కేంఝర్లో రూ.4592.18 కోట్లతో పీవీసీ పైపుల నిర్మాణ కేంద్రం, ఇక్కడే (కేంఝర్) రూ.3674 కోట్లతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తుంది.
* టాటా స్టీల్, ఆరతీ స్టీల్ లిమిటెడ్, అర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్, డంగ్టా మెటల్స్ కంపెనీలు కటక్, మయూర్భంజ్, కేంఝర్లలో ఉక్కు, క్యాప్టివ్ పవర్ జనరేషన్, పీవీసీ పైపుల తయారీ కేంద్రాలు ఏర్పాటు చేస్తాయి.
* సంబంధిత నిర్మాణాల కింద రూ.74,620.18 కోట్ల పెట్టుబడులు వస్తాయి. 24,047 మందికి ఉపాధి అవకాశాలుంటాయి.
* హెచ్ఎల్సీఏ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్ మహాపాత్ర్, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి హేమంత శర్మ, 5-టీ కార్యదర్శి వి.కార్తికేయ పాండ్యన్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారసులొచ్చారు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొంతమంది ప్రముఖ నాయకులు పోటీ నుంచి తప్పుకున్నారు. వారి భార్యలు, వారసులను బరిలోకి దించారు. బిజద, భాజపా, కాంగ్రెస్ పార్టీల నాయకత్వాలు వారికి అవకాశం కల్పించాయి. తండ్రులు, తల్లులు వారి తరుఫున ప్రచారం చేస్తున్నారు. -
కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘హెర్’ టీం
[ 19-04-2024]
మహిళల్ని వేధించే వారి భరతం పట్టడానికి జంటనగరాల (భువనేశ్వర్, కటక్) కమిషనరేట్ యంత్రాంగం ‘హై ఎఫిషియన్సీ రెస్పాన్స్ (హెరా) టీం ఏర్పాటు చేసింది. -
సత్వర విద్యుత్తు సేవలకు ‘సంచార సబ్ స్టేషన్’లు
[ 19-04-2024]
వేసవిలో ప్రజలకు మరింత మెరుగైన విద్యుత్తు సేవలు అందించేందుకు, సరఫరాలో అంతరాయం ఏర్పడితే సత్వర సేవలకు ‘సంచార సబ్ స్టేషన్’లు సిద్ధం చేశామని విద్యుత్తు సరఫరా సంస్థ ‘టాటా పవర్ సదరన్ ఒడిశా డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్’ (టీపీఎస్ఓడీఎల్) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది -
జగన్నాథునికి రూ.2.51 కోట్ల విరాళం
[ 19-04-2024]
రిలయన్స్ గ్రూపు సంస్థల అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ బుధవారం పూరీ శ్రీక్షేత్రానికి వచ్చారు. జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
సచిదాస్ కన్నుమూత
[ 19-04-2024]
జత్రా పార్టీ (నాటకాలు) దర్శకునిగా, నటునిగా ఖ్యాతి గాంచిన సచిదాస్ (91) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అస్వస్థతతో కటక్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. -
ఎవరి ప్రయోజనాల కోసం రెండుచోట్ల పోటీ?
[ 19-04-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మళ్లీ రెండుచోట్ల పోటీకి సిద్ధమయ్యారు. దీనివల్ల ప్రజలకు ఒరిగేదేమిటని? ఈ పోటీ ఎవరి ప్రయోజనాల కోసమని? సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో ఉప ఎన్నిక, వ్యయప్రయాసలు మినహా సాధించేదేమిటని విమర్శలు వినిపిస్తున్నాయి. -
నేటి నుంచి మజ్జిగౌరీ చైత్రోత్సవాలు
[ 19-04-2024]
రాయగడ ఉత్కళాంధ్రుల ఇలవేల్పు, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి మజ్జిగౌరీ అమ్మవారి చైత్రోత్సవ సంబరాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. -
‘శ్రేష్ఠ భారత్’ ఏర్పాటుకు అంతా సహకరించాలి
[ 19-04-2024]
‘శ్రేష్ఠ భారత్’ లక్ష్యంగా దేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలు, అన్ని రంగాల సమగ్ర అభివృద్ధికి ప్రధాని మోదీ 2024 సంకల్ప పత్రం జారీ చేశారని, ప్రజలంతా సహకరించి, మరోసారి మోదీని ప్రధాని చేసేందుకు ముందుకు రావాలని బ్రహ్మపుర లోక్సభ భాజపా అభ్యర్థి ప్రదీప్ కుమార్ పాణిగ్రహి కోరారు -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
[ 19-04-2024]
గంజాం జిల్లా గొళంత్రా ఠాణా పరిధిలోని కొణిసి-తుళు మార్గంలో బుధవారం మధ్యాహ్నం రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు యువకులు ఎమ్కేసీజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు
తాజా వార్తలు (Latest News)
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో