క్రైమ్ వార్తలు
కొరాపుట్ జిల్లా సిమిలిగుడ బస్టాండ్ వద్ద ఉన్న యాక్సిస్ బ్యాంక్లో బుధవారం రాత్రి చోరీయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఒకరిని
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
ఖరగ్పూర్, న్యూస్టుడే: చంద్ర కోణా పట్టణంలోని ప్రధాన రహదారిపై కమర్ పాడా ప్రాంతంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రకోణా వైపు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనానికి, మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఒక శిశువు, మహిళ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మిడ్నాపూర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో తరలించారు.
చోరీ కేసులో ఒకరి అరెస్టు
సిమిలిగుడ, న్యూస్టుడే: కొరాపుట్ జిల్లా సిమిలిగుడ బస్టాండ్ వద్ద ఉన్న యాక్సిస్ బ్యాంక్లో బుధవారం రాత్రి చోరీయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు సునాబెడ ఎస్డీపీవో మనోజ్ కుమార్ బెహరా విలేకరులకు వెల్లడించారు. బ్యాంకులో ప్రవేశించేందుకు యత్నించిన సమయంలో అలారం మోగిందని దీంతో ఒకరు పరారవగా, మరొకరు బ్యాంకులోనే దాక్కున్నాడని, కనుగొని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడు బిజూ కాలనీకి చెందిన భుబన్ కుల్దీప్గా గుర్తించి, గురువారం కోర్టుకు తరలించినట్లు చెప్పారు. బ్యాంకులో స్టాంప్లు, కొన్ని పత్రాలు చోరీకి గురయ్యాని, వాటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు బెహరా తెలిపారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
151 కిలోల గంజాయి స్వాధీనం
సిమిలిగుడ, న్యూస్టుడే: నందపూర్ సమితి పాడువా ప్రాంతం నుంచి కలహండికి అక్రమంగా రవాణా అవుతున్న గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నలుగురిని అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు. సిమిలిగుడ ఠాణాలో గురువారం సునాబెడ ఎస్డీపీవో మనోజ్ కుమార్ బెహరా అందించిన వివరాల ప్రకారం... ముందస్తు సమాచారంతో గురువారం తెల్లవారుజామున బోడో బొడింగ కూడలి వద్ద పాడువా వైపు నుంచి వస్తున్న కారును ఆపారు. అందులో తనిఖీ చేయగా 151 కిలోల గంజాయి గుర్తించారు. నలుగురిని అరెస్టు చేశారు. సరకు విలువ రూ.12 లక్షలు ఉంటుందని తెలిపారు.
సైబర్ నేరస్థుని వలలో ఇంజినీరు
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: బీఈఎంసీలో ఉప కార్యనిర్వాహక ఇంజినీరుగా పనిచేస్తున్న ఒకరు సైబర్ నేరగాళ్ల వలకు చిక్కుకుని, రూ.లక్షకుపైగా పోగొట్టుకున్నారు. ఆయన ఇంటి విద్యుత్తు బిల్లు బకాయిలు చెల్లించకుంటే సాయంత్రంలోగా సరఫరా నిలిపివేస్తామంటూ మొబైల్ ఫోనుకు సంక్షిప్త సందేశం వచ్చింది. దీంతో ఆయన ఆ సందేశంలోని లింక్ను క్లిక్ చేయగా, సైబర్ నేరగాళ్లు ఓ యాప్ ద్వారా సొమ్ము చెల్లించాలంటూ ఆయన ఫోనుకు దాన్ని పంపారు. ఆ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత తొలుత రూ.10లు చెల్లించాలని కోరారు. ఆయన డెబిట్ కార్డు ద్వారా సొమ్ము చెల్లించిన తర్వాత ఆయన బ్యాంకు ఖాతా నుంచి మూడు విడతల్లో రూ.లక్షకుపైగా బదిలీ అయినట్లు గురువారం సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి.
* గంజాం జిల్లా పురుషోత్తంపూర్ ఠాణా పరిధిలో సొలొఘరొ, సున్నాథర పంచాయతీల గ్రామ్ రోజ్గార్ సేవక్ (జీఆర్ఎస్) స్వాగత్ పండా సోమవారం రాత్రి బీడీఓను కలిసేందుకు వెళుతున్నట్లు ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో మరుసటి రోజు మంగళవారం ఆయన భార్య ఠాణాలో ఫిర్యాదు చేసింది. మరోవైపు ఆయన మొబైల్ ఫోను, ద్విచక్ర వాహనం పురుషోత్తంపూర్లోని రెండు వేర్వేరు చోట్ల లభించాయి. దీంతో మాయమైన జీఆర్ఎస్ ఘటన చర్చనీయాంశమైంది.
సారా తయారీ కేంద్రాలపై దాడులు
పర్లాఖెముండి, న్యూస్టుడే: పర్లాఖెముండి ఠాణ పరిధిలోని సింగిపురం, ఉద్దనగూడ, ఆనందపూర్, నమ్మనగూడ, సిద్ధమనుగు, కొర్సండ, నేరడిగూడ గ్రామాల్లోని సారా తయారీ కేంద్రాలపై అబ్కారీ అధికారులు దాడి చేశారు. 810 లీటర్ల నాటుసారా, 4000 లీటర్ల బెల్లపు ఊటను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు.
విద్యుదాఘాతంతో ఆవు మృతి
కాశీనగర్, న్యూస్టుడే: గజపతి జిల్లా గురండి ఠాణా పరిధిలోని మచ్చుమర గ్రామంలో విద్యుదాఘాతంతో గురువారం ఆవు మృతి చెందింది. నియంత్రిక చుట్టూ కంచె లేకపోవడంతో అటువైపు మేతకు వెళ్లి చనిపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మావో డంప్ స్వాధినం
[ 19-04-2024]
మల్కానిగిరి జిల్లా కలిమెల ఠాణా పరిధిలో వున్న సానో టేకుడ, బెజంగి వాడ గ్రామం మధ్యలో వున్న అడవిలో బి.ఎస్.ఎఫ్. జవాన్లు మావో డంప్ స్వాధినం చెసుకున్నారు. -
వారసులొచ్చారు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొంతమంది ప్రముఖ నాయకులు పోటీ నుంచి తప్పుకున్నారు. వారి భార్యలు, వారసులను బరిలోకి దించారు. బిజద, భాజపా, కాంగ్రెస్ పార్టీల నాయకత్వాలు వారికి అవకాశం కల్పించాయి. తండ్రులు, తల్లులు వారి తరుఫున ప్రచారం చేస్తున్నారు. -
కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘హెర్’ టీం
[ 19-04-2024]
మహిళల్ని వేధించే వారి భరతం పట్టడానికి జంటనగరాల (భువనేశ్వర్, కటక్) కమిషనరేట్ యంత్రాంగం ‘హై ఎఫిషియన్సీ రెస్పాన్స్ (హెరా) టీం ఏర్పాటు చేసింది. -
సత్వర విద్యుత్తు సేవలకు ‘సంచార సబ్ స్టేషన్’లు
[ 19-04-2024]
వేసవిలో ప్రజలకు మరింత మెరుగైన విద్యుత్తు సేవలు అందించేందుకు, సరఫరాలో అంతరాయం ఏర్పడితే సత్వర సేవలకు ‘సంచార సబ్ స్టేషన్’లు సిద్ధం చేశామని విద్యుత్తు సరఫరా సంస్థ ‘టాటా పవర్ సదరన్ ఒడిశా డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్’ (టీపీఎస్ఓడీఎల్) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది -
జగన్నాథునికి రూ.2.51 కోట్ల విరాళం
[ 19-04-2024]
రిలయన్స్ గ్రూపు సంస్థల అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ బుధవారం పూరీ శ్రీక్షేత్రానికి వచ్చారు. జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
సచిదాస్ కన్నుమూత
[ 19-04-2024]
జత్రా పార్టీ (నాటకాలు) దర్శకునిగా, నటునిగా ఖ్యాతి గాంచిన సచిదాస్ (91) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అస్వస్థతతో కటక్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. -
ఎవరి ప్రయోజనాల కోసం రెండుచోట్ల పోటీ?
[ 19-04-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మళ్లీ రెండుచోట్ల పోటీకి సిద్ధమయ్యారు. దీనివల్ల ప్రజలకు ఒరిగేదేమిటని? ఈ పోటీ ఎవరి ప్రయోజనాల కోసమని? సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో ఉప ఎన్నిక, వ్యయప్రయాసలు మినహా సాధించేదేమిటని విమర్శలు వినిపిస్తున్నాయి. -
నేటి నుంచి మజ్జిగౌరీ చైత్రోత్సవాలు
[ 19-04-2024]
రాయగడ ఉత్కళాంధ్రుల ఇలవేల్పు, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి మజ్జిగౌరీ అమ్మవారి చైత్రోత్సవ సంబరాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. -
‘శ్రేష్ఠ భారత్’ ఏర్పాటుకు అంతా సహకరించాలి
[ 19-04-2024]
‘శ్రేష్ఠ భారత్’ లక్ష్యంగా దేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలు, అన్ని రంగాల సమగ్ర అభివృద్ధికి ప్రధాని మోదీ 2024 సంకల్ప పత్రం జారీ చేశారని, ప్రజలంతా సహకరించి, మరోసారి మోదీని ప్రధాని చేసేందుకు ముందుకు రావాలని బ్రహ్మపుర లోక్సభ భాజపా అభ్యర్థి ప్రదీప్ కుమార్ పాణిగ్రహి కోరారు -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
[ 19-04-2024]
గంజాం జిల్లా గొళంత్రా ఠాణా పరిధిలోని కొణిసి-తుళు మార్గంలో బుధవారం మధ్యాహ్నం రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు యువకులు ఎమ్కేసీజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు
తాజా వార్తలు (Latest News)
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!