కోత నివారణ, తీర రక్షణకు శాశ్వత చర్యలు
సముద్రుని అలల కోత నివారణ, తీర ప్రాంతాల రక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, ఈ దిశగా శాశ్వత చర్యలు చేపట్టినట్లు జలవనరులశాఖ మంత్రి టుకుని సాహు చెప్పారు. బుధవారం రాత్రి లోక్సేవా భవన్లో ఏర్పాటైన
ఒప్పంద కార్యక్రమంలో మంత్రి టుకుని, అనూ, ఎన్ఐఓటీ అధికారులు
భువనేశ్వర్, న్యూస్టుడే: సముద్రుని అలల కోత నివారణ, తీర ప్రాంతాల రక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, ఈ దిశగా శాశ్వత చర్యలు చేపట్టినట్లు జలవనరులశాఖ మంత్రి టుకుని సాహు చెప్పారు. బుధవారం రాత్రి లోక్సేవా భవన్లో ఏర్పాటైన కార్యక్రమంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ, చెన్నై) సంస్థతో జల వనరులశాఖ రానున్న అయిదేళ్ల కోసం ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఎంఓయూ ప్రకారం... గంజాం, పూరీ, భద్రక్, బాలేశ్వర్, కేంద్రపడ, జగత్సింగ్పూర్ తీర జిల్లాల్లో అనేక తీర ప్రాంతాలు అలల కోతకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితి నియంత్రణలోకి తేవడానికి ఎన్ఐఓటీ సమగ్ర కార్యాచరణ నివేదికలు (బ్లూ ప్రింట్) సిద్ధం చేస్తోంది. ఆయాచోట్ల రక్షణ గోడలు తదితర నిర్మాణాలు చేపడుతుంది. మంత్రి టుకుని విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశాల మేరకు తీర ప్రాంతాల రక్షణకు జలవనరులశాఖ శాశ్వత కార్యక్రమాలు ప్రారంభించామన్నారు. తీర రక్షణలో విశేషానుభవం కలిగిన ఎన్ఐఓటీతో కలిసి తీర ప్రాంతాల నిర్మాణాలను జలవనరులశాఖ చేపడుతుందన్నారు. కార్యక్రమంలో శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అనుగార్గ్, ఎన్ఐఓటీ సంచాలకుడు జి.ఎ.రాందాస్, జలవనరులశాఖ చీఫ్ ఇంజినీరు బిజయ్కుమార్ మిశ్ర తదితర అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 25-04-2024]
ఒడిశాలో కోరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. -
అభివృద్ధి కొనసాగుతుంది..శంక ద్వయాన్ని ఆశీర్వదించండి
[ 25-04-2024]
రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని, బిజదను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రజల్ని కోరారు. -
భాజపాకు 40 మంది స్టార్ ప్రచారకులు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాజపా స్టార్ ప్రచారకుల జాబితా మంగళవారం రాత్రి విడుదల చేశారు. -
ఇంకెన్నాళ్లీ దుస్థితి?
[ 25-04-2024]
అధ్వానంరాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు అధ్వానంగా ఉన్నాయన్న నివేదికలు దిగజారిన ‘నాక్’ గ్రేడేషన్లు దుస్థితిని తెలియజేస్తున్నాయని కేంద్రమంత్రి నిలదీశారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో భర్తీకాని టీచింగ్ సిబ్బంది, అసౌకర్యాలు, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల డ్రాపౌట్ల గురించి ఏం సమాధానం చెబుతారన్నారు. -
ఓ తండ్రి...ఇద్దరు కొడుకులు
[ 25-04-2024]
గత అయిదున్నర దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నేత ఆయన. అన్ని పార్టీల నేతల మన్ననలు అందుకున్న వ్యక్తి. వయసుతోపాటు గౌరవం, నిక్కచ్చితనం పెంచుకున్న నికార్సయిన నేత. 80 ఏళ్ల వయసులో కొడుకు నిర్వాకంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
నామినేషన్ల సందడి
[ 25-04-2024]
బ్రహ్మపుర లోకసభ పరిధిలోని పర్లాఖెముండి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కోడూరు నారాయణరావు నామినేషన్ పత్రాన్ని సబ్ కలెక్టర్ అనూప్ పండాకు అందజేశారు. -
భాజపాలో సీమారాణి చేరిక
[ 25-04-2024]
బిజదకు రాజీనామా చేసిన హిందళ్ సిటింగ్ ఎమ్మెల్యే సీమారాణి నాయక్ బుధవారం భాజపాలో చేరారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, ఇతర నాయకులు ఆమెను స్వాగతించారు. -
నేడు అమిత్షా రాక
[ 25-04-2024]
కేంద్ర హోంమంత్రి అమిత్షా గురువారం రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం సోన్పూర్లో ఏర్పాటయ్యే ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
నా ఓటు.. నా బాధ్యత
[ 25-04-2024]
నా ఓటు నా బాధ్యత అంటూ, తప్పకుండా ఓటు వినియోగించుకుంటామని నూతన ఓటర్లు, కళాశాల విద్యార్థులన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట