రత్న భాండాగారం తెరవాలి
పూరీ జగన్నాథుని రత్నభాండాగారం లోపల పరిస్థితి అధ్యయనం చేయాలని, మరమ్మతులు తప్పనిసరిగా చేపట్టాల్సి ఉన్నందున భాండాగారం తలుపులు తెరవాలని పురావస్తుశాఖ (ఏఎస్ఐ) సూపరింటెండెంటు అరుణ్ మల్లిక్ శ్రీక్షేత్ర పాలనాధికారికి,
లోపల మరమ్మతులు తప్పనిసరి
యంత్రాంగానికి ఏఎస్ఐ లేఖ
గోపాలపూర్, న్యూస్టుడే: పూరీ జగన్నాథుని రత్నభాండాగారం లోపల పరిస్థితి అధ్యయనం చేయాలని, మరమ్మతులు తప్పనిసరిగా చేపట్టాల్సి ఉన్నందున భాండాగారం తలుపులు తెరవాలని పురావస్తుశాఖ (ఏఎస్ఐ) సూపరింటెండెంటు అరుణ్ మల్లిక్ శ్రీక్షేత్ర పాలనాధికారికి, న్యాయశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శికి లేఖలు రాశారు. ఏఎస్ఐ దీనిపై లిఖిత పూర్వకంగా తెలియజేసినట్లు శ్రీక్షేత్ర అభివృద్ధి అధికారి అజయ్ జెనా గురువారం రాత్రి విలేకరులకు చెప్పారు.
లేఖలో ఏం పేర్కొన్నారు?
చాలాకాలంగా రత్నభాండాగారం తెరవనందున లోపల పరిస్థితి ఎలా ఉందన్నదానిపై స్పష్టత లేదు. 2018 ఏప్రిల్ 4న భాండాగారం పరిశీలనకు వెళ్లిన నిపుణుల బృందం రహస్య గది తాళం చెవి లేకపోవడంతో లోపలికి వెళ్లలేకపోయింది. అప్పట్లో కిటికీ ద్వారా వెలుపల నుంచి పరిశీలించిన సమయంలో పైకప్పు ప్లాస్టర్ పెచ్చులు ఊడిన విషయాన్ని గమనించారు. గోడల్లో తేమ కనిపించింది. ఈ నేపథ్యంలో సమగ్ర అధ్యయనం చేపట్టి మరమ్మతులు చేయాల్సి ఉన్నందున తలుపులు తెరవడానికి అనుమతించాలని ఏఎస్ఐ అధికారి యంత్రాంగానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
లేజర్ స్కానింగ్ చేయాలి
ప్రముఖ జగన్నాథ తత్వవేత్త డాక్టర్ ప్రఫుల్ల రథ్ విలేకరులతో మాట్లాడుతూ.. రత్నభాండాగరం లోపల లేజర్ స్కానింగ్ చేయాలని తర్వాత మరమ్మతులు చేపడితే బాగుంటుందని సూచించారు.
ఆభరణాలు భద్రంగా ఉన్నాయా?
రత్నభాండాగారంలో పురుషోత్తముని దివ్యాభరణాలు భద్రంగా ఉన్నాయా? అన్నదానిపై భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లెక్కించాలని సేవాయత్లు, ఇతర సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పురాతన నివేదికలో ఉన్న వివరాల మేరకు ఆభరణాలన్నీ ఉన్నాయా? అన్నది స్పష్టం చేయాలని అంతా కోరుతున్నారు. రహస్య మందిరం తలుపులు తెరిస్తే కచ్చితంగా లెక్కింపు జరుగుతుంది. ఏఎస్ఐ మరమ్మతులు చేసే అవకాశం కలుగుతోంది.
త్వరలో సమావేశం నిర్వహించాలి
భాండాగారం తెరవాలంటే శ్రీక్షేత్ర పాలకవర్గం సమావేశమై తీర్మానం చేయాలి, న్యాయశాఖ అనుమతించాలి. ఈ రెండు జరిగిన తర్వాతే తలుపులు తెరుస్తారు. ఏఎస్ఐ అధికారులతోపాటు ఆభరణాల లెక్కింపునకు బృందం ఏర్పాటు చేయాలి. తేదీ నిర్ణయమైన తర్వాత తలుపులు తెరుస్తారని శ్రీక్షేత్ర ప్రధాన సేవాయత్ రజిత్ ప్రతిహారి శుక్రవారం విలేకరులకు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నితీష్ గమ్యం ఎటువైపు?
[ 20-04-2024]
సంబల్పూర్ సిటింగ్ ఎంపీ నితీష్ గమ్యం ఎటువైపు? ఈసారి ఎన్నికల్లో ఆయన భార్య అరుంధతీ దేవి తరఫున ప్రచారం చేస్తారా? భాజపాకు అనుకూలంగా ఉంటారా? అన్నదిప్పుడు చర్చనీయాంశమైంది. -
కనుల పండువగా చైత్రోత్సవాలు
[ 20-04-2024]
శక్తి స్వరూపిణి, శాంతి స్వరూపిణి మజ్జిగౌరీ అమ్మవారి చైత్రోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. -
మౌలిక సౌకర్యాలకు దూరం.. ఎన్నికల బహిష్కరణ నిర్ణయం
[ 20-04-2024]
కొంధమాల్ జిల్లా బలిగుడ సమితిలో రుతుంగియా పంచాయతీలోని గగలిమహ, పనిపదర్, పాంగాబడి గ్రామాలకు రహదారులు, తాగునీరు, అంగన్వాడీ వంటి మౌలిక సౌకర్యాలు లేవు. -
మహిళా ఓటర్లే అత్యధికం
[ 20-04-2024]
రాష్ట్రంలో తొలివిడత ఎన్నికలు జరగనున్న నాలుగు లోక్సభ స్థానాల్లో పురుషులకంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) నికుంజ బిహారీ ధొళో అన్నారు. -
బ్రహ్మపురలో నామినేషన్ల పర్వం
[ 20-04-2024]
బ్రహ్మపుర సబ్కలెక్టరు కార్యాలయం, పరిసరాలు రెండోరోజు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థులు, వారి మద్దతుదారులతో కిటకిటలాడింది. -
భాజపా మోదీ మంత్రం.. బిజద అభివృద్ధి అస్త్రం
[ 20-04-2024]
ప్రధాన పార్టీలు ఎన్నికల్లో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేస్తున్నాయి. మండుటెండలను కూడా లెక్క చేయకుండా ఓటర్ల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతున్నారు. రోడ్షోలు, పాదయాత్రలు, సభలు నిర్వహిస్తున్నారు. -
మహానదిలో పడవ మునక: ఇద్దరి దుర్మరణం
[ 20-04-2024]
ఝార్సుగుడ జిల్లా లఖన్పూర్ సమితి ఛత్తీస్గఢ్ సరిహద్దు శారదా వద్ద శుక్రవారం సాయంత్రం మహానదిలో పడవ మునిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. -
నిప్పుల కొలిమిలా రాష్ట్రం
[ 20-04-2024]
రాష్ట్రం నిప్పులకొలిమిలా మారింది. భానుని ప్రతాపంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీర ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటాయి. -
చాకుతో దాడి: యువకుడి హతం
[ 20-04-2024]
గంజాం జిల్లా నిమ్మఖండి ఠాణా పరిధిలోని బొరిగావ్ గ్రామంలోని అమ్మవారి మందిరం సమీపాన చెరువు ఒడ్డున గురువారం సాయంత్రం సునీల్ దాస్ (27) అనే యువకుడు, మరో యువకుడి మధ్య పాతకక్షల నేపథ్యంలో వాగ్వాదం జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?